Nita Ambani : నీతా అంబానీ భారీ ప్రకటన.. రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా 25కోట్ల మంది విద్యార్థులకు సాయం!
- రిలయన్స్ ఇండస్ట్రీస్ 47వ వార్షిక సర్వసభ్య సమావేశం
- ప్రసంగించిన రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ నీతా అంబానీ
- సుమారు 25 కోట్ల మంది పాఠశాల పిల్లలకు సహాయం చేస్తానని ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముఖేష్ అంబానీ నేతృత్వంలోని.. దేశంలోనే అత్యంత విలువైన కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ 47వ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) ప్రారంభమైంది. ఓ వైపు రిలయన్స్ వ్యాపారం యొక్క ప్రణాళికను ముఖేష్ అంబానీ పంచుకుంటూ ఉండగా.. అదే సమయంలో రిలయన్స్ (ఆర్ఐఎల్ షేర్) షేర్లు వేగంగా ట్రేడవుతున్నాయి. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ చివరి గంటలో కంపెనీ షేరు రూ.3074 స్థాయికి ఎగబాకింది. అయితే.. మార్కెట్ ముగిసే సమయానికి దాని వేగం మందగించింది. అయినప్పటికీ ఇది 1.55 శాతం పెరిగి రూ. 3042.90 వద్ద ముగిసింది. షేర్ల పెరుగుదల కారణంగా రిలయన్స్ మార్కెట్ క్యాప్ రూ.20.58 లక్షల కోట్లకు పెరిగింది.
READ MORE: IMD Warning: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. ఈ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
Also Read
- Elon Musk: ప్రపంచ చరిత్రలో ఒకే ఒక్కడు.. ఎలాన్ మస్క్కు అడుగు దూరంలో అరుదైన ఘనత!
- LIC Saral Pension: ఈ ఎల్ఐసీ పాలసీ తెలుసా? ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు.. ఆ తర్వాత జీవితాంతం చేతికి రూ.21000!
- UPI Scam Alert : UPI ద్వారా డబ్బు పంపిన వెంటనే మోసపోయారా? మొదటి 30 నిమిషాల్లో ఏం చేస్తే నష్టం తగ్గే అవకాశం ఉంటుంది
- Money: జీతం పెరుగుతున్నా చేతిలో డబ్బు మిగలడం లేదా? మధ్యతరగతి ఎక్కువగా చేసే పొరపాటు ఇదే!
కాగా.. ఛైర్మన్ అంబానీ ప్రసంగం అనంతరం రిలయన్స్ ఏజీఎంలో రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ నీతా అంబానీ మాట్లాడారు. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక యువతను కలిగిన దేశం భారతదేశమని, ఇది దేశాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు సహాయ పడుతుందన్నారు. అయితే వారికి సాధికారత కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. మన చరిత్రను గౌరవిస్తూ.. వర్తమానాన్ని కాపాడుకుంటూ, భవిష్యత్తును తీర్చిదిద్దుకున్నప్పుడే అభివృద్ధి చెందిన భారతదేశ కల నెరవేరుతుందని తెలిపారు.
READ MORE: IMD Warning: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. ఈ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
నీతా అంబానీ రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా విద్యార్థులకు సహాయం చేస్తామన్నారు. సుమారు 25 కోట్ల మంది పాఠశాల పిల్లలకు సహాయం చేస్తానని ప్రకటించారు. గతేడాది ప్రారంభించిన స్వదేశ్ గురించి ప్రస్తావిస్తూ.. ఇది మన హృదయానికి దగ్గరగా ఉందని, దేశ సంస్కృతికి అనుసంధానమై ఉందన్నారు. స్వదేశ్ ద్వారా మేక్ ఇన్ ఇండియాను ప్రోత్సహిస్తున్నట్లు రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్ పర్సన్ తెలిపారు. అభివృద్ధి చెందిన భారతదేశ కలను నెరవేర్చడంలో కూడా ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుందన్నారు.
తాజావార్తలు
-
June 2026 Movie Releases: ‘పెద్ది’ తర్వాత థియేటర్లలోకి వచ్చే సినిమాలు ఇవే..
-
Elon Musk: ప్రపంచ చరిత్రలో ఒకే ఒక్కడు.. ఎలాన్ మస్క్కు అడుగు దూరంలో అరుదైన ఘనత!
-
Pawan Kalyan : యాక్టింగ్’కు దూరంగా పవన్?
-
Manav Suthar: ఒక్క టెస్ట్ మ్యాచ్తో ఊహించని ఆఫర్ కొట్టేసిన మానవ్ సుతార్.. ఇక దూకుడే..
-
Mamata Banerjee: దీదీనే దేశ ప్రధాని అన్నది, ఇప్పుడు షాక్ ఇచ్చిన సాయోని ఘోష్..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!