Sam Altman: మాట్లాడితే ప్రతీకారం ఉంటుందని “ముస్లింలు” భయపడుతున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sam Altman: ఒపెన్ఏఐ చీఫ్ సామ్ ఆల్ట్మన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయిల్-గాజా యుద్ధం నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. టెక్ పరిశ్రమలో ముస్లిం, అరబ్ కమ్యూనిటీ సభ్యులు ఇటీవల తన అనుభవాల గురించి మాట్లాడేందుకు అసౌకర్యంగా ఉన్నారని ఆయన గురువారం అన్నారు. ‘‘ టెక్ కమ్యూనిటీలో ముస్లిం, అరబ్(ముఖ్యంగా పాలస్తీనియన్స్) సహోద్యోగులు కెరీర్ అవకాశాలు దెబ్బతింటాయని, ప్రతీకార చర్యలు ఉంటాయనే భయంతో ఇటీవల కాలంలో వారి అనుభవాల గురించి మాట్లాడేందుకు అసౌకర్యంగా ఉన్నారు.’’ అంటూ ఎక్స్(ట్విట్టర్)లో ఆల్ట్మాన్ వ్యాఖ్యానించారు. ఉద్యోగుల మద్దతుతో మన పరిశ్రమ ఐక్యంగా ఉండాలి, నిజమైన శాశ్వతమైన శాంతి కోసం ఆశిస్తున్నానని అన్నారు.
Read Also: Gyanvapi mosque case: నేడు జ్ఞాన్వాపీ మసీదులో సర్వే నివేదిక బహిర్గతంపై తుది తీర్పు
Also Read
- Plastic Currency Notes: ఆర్బీఐ కీలక నిర్ణయం.. మార్కెట్లోకి ప్లాస్టిక్ రూ.10, రూ.20 నోట్లు..! మరి పాత నోట్ల పరిస్థితి ఏంటి..?
- RBI MPC 2026: ఆర్బీఐ కీలక నిర్ణయం.. రెపో రేటు 5.25 శాతం వద్దే కొనసాగింపు.. హోమ్, పర్సనల్ లోన్స్ EMIలపై ఎలాంటి ప్రభావం?
- UPI Charges: రూ.2,000 దాటిన UPI చెల్లింపులపై ఛార్జీలు? ఎవరు చెల్లించాలి.. ఎలాంటి లావాదేవీలకు వర్తిస్తాయంటే?
- Liquor Ban: ఏంటి! ఇన్ని రోజులు "బ్రాండెడ్ విషం" తాగారా? ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్ సహా ఈ బ్రాండ్ల గుట్టు రట్టు..
తాను యూదుడినని, యాంటి సెమిటిజం అనేది ప్రపంచంలో ఒక ముఖ్యమైన, పెరుగుతున్న సమస్య అని నమ్ముతున్నానని, మా పరిశ్రమలో చాలా మంది వ్యక్తులు నాకు మద్దతుగా నిలిచారని, దానికి నేను ఎంతో అభినందిస్తున్నానని అన్నారు. అయితే ముస్లిం కమ్యూనిటీకి మద్దతు లేకపోవడాన్ని ఆయన ప్రస్తావించారు. జూయిష్ కమ్యూనిటీ అనుభవాలను, ఆల్ట్మాన్ దృక్పథాన్ని ఎక్స్లో యూజర్ ప్రశ్నించిన సందర్భంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
అక్టోబర్ 7న పాలస్తీనా హమాస్ ఇజ్రాయిల్పై దాడి చేసింది. దీని తర్వాత ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం ప్రారంభమైంది. ఇటీవల కాలంలో అమెరికాలో సెమిటిజం, ఇస్లామోఫోబియా భయాలు పెరిగాయి. అమెరికాలో ఇస్లామోఫోబియా, పాలస్తీనియర్లు, అరబ్బుల పట్ల పక్షపాత ధోరణి సంఘటనలు 172 శాతం పెరిగినట్లు కౌన్సిల్ ఆన్ అమెరికన్-ఇస్లామిక్ రిలేషన్స్ నివేదించింది. ఇజ్రాయిల్పై హమాస్ జరిపిన దాడుల్లో 1200 మంది మరణించారు. ఇజ్రాయిల్ దాడుల్లో 20 వేల మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు.
muslim and arab (especially palestinian) colleagues in the tech community i've spoken with feel uncomfortable speaking about their recent experiences, often out of fear of retaliation and damaged career prospects.
our industry should be united in our support of these colleagues;…
— Sam Altman (@sama) January 5, 2024
తాజావార్తలు
-
High Court: కోడలి ఇల్లైనా అత్తగారికి హక్కుంటుంది.. హైకోర్టు కీలక తీర్పు
-
ICC Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో దూసుకొచ్చిన నెదర్లాండ్ ఆటగాళ్లు.. టాప్ 10లో ఎవరెవరంటే..
-
CJP: నా కుటుంబానికి ప్రాణహని.. సీజేపీ నేత సౌరవ్ దాస్ సంచలన ఆరోపణలు..
-
Google Top Employer: భారత్లో టాప్-10 ఎంప్లాయర్ బ్రాండ్స్ ఇవే.. గూగుల్కు నంబర్-1 ర్యాంక్
-
RGV: ఆర్జీవీకి జేడీ షాకింగ్ ప్రశ్న.. “పిచ్చోళ్లందరినీ మీరు పెట్టుకుంటారా? లేక వాళ్లే వస్తారా?”
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!