Mobile Recharge Controversy: పార్లమెంటులో రీఛార్జ్ సెగ.. 12 నెలలకు 13 రీఛార్జ్ లా? కేంద్రంపై ఎంపీల ప్రశ్నల వర్షం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mobile Recharge Controversy: భారతదేశ టెలికాం రంగంలో ప్రీపెయిడ్ ప్లాన్ల గడువుపై ఇప్పుడు దేశవ్యాప్తంగా కొత్త చర్చ మొదలైంది. సామాన్య ప్రజలపై పడుతున్న అదనపు భారానికి వ్యతిరేకంగ ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా రాజ్యసభలో కీలక ప్రశ్నలు లేవనెత్తారు. టెలికాం కంపెనీలు అనుసరిస్తున్న ఈ విధానం వినియోగదారులను దోపిడీ చేయడమేనని ఆయన అభివర్ణించారు. సాధారణంగా మనం నెలకు ఒకసారి రీఛార్జ్ చేసుకుంటామని భావిస్తాం. కానీ, భారతదేశంలోని మెజారిటీ ప్రీపెయిడ్ ప్లాన్లు 28 రోజుల చెల్లుబాటుతోనే వస్తున్నాయి. దీని వల్ల కలిగే నష్టం ఏమిటంటే.. 28 రోజుల చొప్పున 13 సార్లు రీఛార్జ్ చేస్తే (28 * 13 = 364) రోజులు అవుతుంది. అంటే ఒక ఏడాది పూర్తి కావడానికి వినియోగదారుడు 12 సార్లు కాకుండా, 13 సార్లు రీఛార్జ్ చేసుకోవాల్సి వస్తోంది. ఒక ప్లాన్ను ‘నెలవారీ ప్లాన్’ అని పిలిచినప్పుడు, దాని గడువు కచ్చితంగా 30 లేదా 31 రోజులు ఉండాలని, అప్పుడే అది వినియోగదారులకు పారదర్శకంగా ఉంటుందని రాఘవ్ చద్దా వాదించారు.
READ ALSO: Right To Die: ‘‘మరణించే హక్కు’’పై సుప్రీంకోర్టు కీలక తీర్పు.. హరీష్ రాణా ఇక ప్రశాంతంగా చనిపోవచ్చు..
Also Read
- EPFO EEC 2026: ఉద్యోగులకు EPFO గుడ్న్యూస్.. అక్టోబర్ 31 వరకు ఛాన్స్.. మిస్ కావద్దు.!
- Food Inflation 2026: వంటగది బడ్జెట్కు బిగ్ షాక్.. వంట నూనె, పప్పులు, ఉల్లి, చక్కెర.. ధరలు పెరగడానికి అసలు కారణాలివే!
- Cheque Book New Rules 2026: చెక్బుక్ కొత్త రూల్స్.. మీ చెక్పై ఈ సెక్యూరిటీ కోడ్ ఉందా? చెక్ చేసుకోండి!
- NHAI rs350 Toll Pass: NHAI కొత్త రూ.350 టోల్ పాస్.. ఎవరికి వర్తిస్తుంది? ఎలా అప్లై చేయాలి?
ఇన్కమింగ్ కాల్స్ నిలిపివేతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం వ్యాలిడిటీ మాత్రమే కాకుండా, రీఛార్జ్ గడువు ముగిసిన వెంటనే ఇన్కమింగ్ కాల్స్ను బ్లాక్ చేయడంపై కూడా ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అవుట్గోయింగ్ కాల్స్ ఆపివేయడం సమంజసమే అయినా, ఇన్కమింగ్ కాల్స్ ఆపేయడం వల్ల సామాన్యులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. నేటి కాలంలో బ్యాంకింగ్ లావాదేవీలకు, OTPలకు, ప్రభుత్వ సేవల సమాచారానికి మొబైల్ నంబర్ ప్రాణాధారం అని అన్నారు. ఇన్కమింగ్ ఆగిపోతే పేద ప్రజలు, నిరుద్యోగులు కమ్యూనికేషన్ కోల్పోయి క్లిష్ట పరిస్థితుల్లో పడుతున్నారని ఆయన వివరించారు. టెలికాం ఆపరేటర్లు తమ బిల్లింగ్ వ్యవస్థల సౌలభ్యం కోసం 28 రోజుల ప్లాన్లను (కచ్చితంగా 4 వారాలు) ఉపయోగిస్తామని చెబుతుంటారు. అయితే, ఈ పద్ధతి ద్వారా కంపెనీలకు ఏటా కోట్లాది రూపాయల అదనపు ఆదాయం సమకూరుతోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) నిబంధనల ప్రకారం.. కంపెనీలు కనీసం ఒక ప్లాన్ నైనా 30 రోజుల గడువుతో అందించాలి. కానీ, ఇప్పుడు ఉన్న ప్లాన్లన్నీ 28 రోజులవే కావడంతో సామాన్యులకు ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో రీఛార్జ్ ప్లాన్లను క్యాలెండర్ నెలల ప్రాతిపదికన (30 రోజులు) మార్చాలని, సామాన్యుల ప్రయోజనాలను కాపాడాలని పార్లమెంటులో రాఘవ్ చద్దా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ అంశం ప్రస్తుతం సోషల్ మీడియాలో భారీ చర్చకు దారితీసింది.
READ ALSO: Adani Total Gas: LPG కొరత మధ్య.. 18% పెరిగిన అదానీ గ్యాస్ స్టాక్.. రూ. 550 దాటి భారీ లాభాలు
తాజావార్తలు
-
University of London Hyderabad Campus: హైదరాబాద్లో లండన్ యూనివర్సిటీ క్యాంపస్..
-
Abhijeet Dipke: స్కూల్లోకి ఎంట్రీ.. టీచర్లకు బెదిరింపు! అభిజీత్ దీప్కేపై కేసు
-
EPFO EEC 2026: ఉద్యోగులకు EPFO గుడ్న్యూస్.. అక్టోబర్ 31 వరకు ఛాన్స్.. మిస్ కావద్దు.!
-
Hyderabad Food Safety Raids: బిగ్బాస్కెట్, బ్లింకిట్, జెప్టోకు షాక్.. 20 డార్క్ స్టోర్లలో టీజీ సేఫ్ ఆకస్మిక తనిఖీలు
-
Mokshada: రవితేజ సక్సెస్ వెనుక కూతురి హ్యాండ్! ‘ఇరుముడి’తో మోక్షద పేరు వైరల్..
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!