TCS: ఉద్యోగానికి గుడ్ బై చెబుతున్న మహిళా టెక్కీలు.. కారణం ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TCS: కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టింది. దీంతో చాలా ఐటీ కంపెనీలు ఇప్పటికే తమ ఉద్యోగులను ఆఫీసులకు రమ్మని పిలుస్తున్నాయి. హైబ్రీడ్ మోడ్ లో ఉద్యోగాలు చేయాలని చెబుతున్నాయి. వారానికి కనీసం మూడు రోజులు ఆఫీసులకు రావాలని ఉద్యోగులను కోరుతున్నాయి. ఇప్పటికే దేశీ ఐటీ దిగ్గజం టీసీఎస్ తన ఉద్యోగులను ఆఫీసుకలు రమ్మని కోరింది. గూగుల్ వంటి సంస్థలు కూడా ఉద్యోగులు వారానికి మూడు రోజులు కార్యాలయానికి రావాలని కోరుతున్నాయి.
ఇదిలా ఉంటే వర్క్ ఫ్రం హోం పాలసీ కారణంగా టీసీఎస్ సంస్థలో మహిళా సాఫ్ట్ వేర్ ఉద్యోగులు రిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. టీసీఎస్ తన ఉద్యోగులను ఆఫీసకు రావాల్సిందిగా కోరింది. దీంతో చాలా మంది మహిళా ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేయాలని కోరుకోవడం, ఆఫీసులకు వెళ్లే ఉద్దేశం లేకపోవడంతో రాజీనామా చేస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో 20 శాతానికి పైగా ఉద్యోగులు రాజీనామా చేశారు. వర్క్ ఫ్రం హోమ్ ని ఆపేయాలని కోరినందుకే మహిళా ఉద్యోగులు రాజీనామా చేస్తున్నారని టీసీఎస్ హెచ్ఆర్ చీఫ్ మిలింద్ లక్కడ్ కంపెనీ వార్షిక నివేదికలో వెల్లడించారు.
Also Read
- ITR Filing Benefits: ఐటీఆర్ దాఖలు చేస్తే లాభాలే లాభాలు.. తెలుసుకోవాల్సిన 5 ముఖ్య విషయాలు
- Mutual Funds Mistakes: మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టేవారు ఎక్కువగా చేసే 7 పొరపాట్లు ఇవే!
- UPI Safety: ఈ చిన్న పొరపాట్లు చేస్తే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ కావొచ్చు.. యూపీఐ వాడేవారు తప్పక తెలుసుకోవాలి.!
- Domestic LPG Cylinder Price Hiked: గృహ వినియోగదారులకు షాక్.. పెరిగిన వంటగ్యాస్ ధరలు.. ఎంతంటే?
మహిళా ఉద్యోగులు ఇంటి నుండి పని చేయాలనుకోవడం వల్ల ఎక్కువ మంది రాజీనామాలు చేశారని లక్కాడ్ నొక్కి చెప్పారు. ఇది కూడా ఒక కారణం కావచ్చని, వివక్షకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ఎంత మంది మహిళా ఉద్యోగులు కంపెనీని విడిచిపెట్టారనే దాని గురించి స్పష్టమైన సంఖ్యను టీసీఎస్ వెల్లడించలేదు. టీసీఎస్ లో మహిళా ఉద్యోగులు అట్రిషన్ రేట్ పురుషులతో సమానం లేదా కాస్త తక్కువగా ఉంది.
జెండర్ డైవర్సిటీని ప్రోత్సహించడంలో టీసీఎస్ ఎప్పుడూ వెనక్కి తగ్గదని, దీన్ని కంటిన్యూ చేస్తామని ఆ సంస్థ పేర్కొంది. ప్రస్తుతం టీసీఎస్ లో 6 లక్షల మంది పనిచేస్తున్నారు. వీరిలో 35 శాతం మంది మహిళా ఉద్యోగులు ఉన్నారు. నాలుగింట మూడోవంతు మహిళలు టాప్ పోజిషన్లలో ఉన్నట్లు నివేదిక పేర్కొంది. దాదాపుగా 20 శాతం అంటే లక్ష మంది ఉద్యోగులు ప్రస్తుతం ఆఫీసులకు వస్తున్నట్లు కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజేష్ గోపీనాథన్ తెలిపారు.
తాజావార్తలు
-
IND vs AFG Test: షాకింగ్.. మూఢనమ్మకంతో స్టేడియం నుంచి వెళ్లిపోయిన టీమిండియా క్రికెటర్ ఫ్యామిలీ!
-
Janhvi Kapoor : బాలీవుడ్లో అందాల ఆరబోస్తే నీతులు.. సౌత్లో స్కిన్ షో చేస్తే బూతులు?
-
MS Subbulakshmi Biopic : లెజెండరీ సింగర్ బయోపిక్ లో రష్మిక… సాయి పల్లవి చేజారినట్టే ?
-
Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రైల్వే బ్రిడ్జిని ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.!
-
Iran-Israel Tensions: మధ్యప్రాచ్యంలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు..
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!