Stock Market: ఈనెల 15న స్టాక్ మార్కెట్కు సెలవు!.. కారణమిదే!
- ఈనెల 15న ముంబై మున్సిపల్ ఎన్నికలు
- సెలవు దినంగా ప్రకటించిన ఫడ్నవిస్ ప్రభుత్వం
- స్టాక్ మార్కెట్కు కూడా సెలవు ప్రకటించే ఛాన్స్
ఆర్థిక రాజధాని ముంబైలో మున్సిపల్ ఎన్నికల జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్కు సెలవు ప్రకటించినట్లుగా తెలుస్తోంది. క్యాలెండర్ ప్రకారం సెలవు కాకపోయినా ఎన్నికల నేపథ్యంలో సెలవు ఇచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఆర్బీఐ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇది కూడా చదవండి: Kolkata: ఎన్నికల వేళ కోల్కతాలో ఈడీ దాడులు.. సీఎం మమత హల్చల్
Also Read
- Rupee vs Dollar: మళ్లీ పతనమైన రూపాయి విలువ.. అమెరికన్ డాలర్తో 95.23కి.. కారణాలు ఏమిటి?
- Stock Market: హార్ముజ్ డెడ్లాక్ ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో సూచీలు
- Rule Change: మే 1 నుండి న్యూ రూల్స్.. ఎల్పీజీ ధరల నుండి క్రెడిట్ కార్డుల వరకు ఏవేం మారనున్నాయంటే?
- Mark Zuckerberg: ఫేస్బుక్ను సృష్టించిన ‘డ్రాపౌట్’.. వేల కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించిన జుకర్బర్గ్కు డిగ్రీ లేదు తెలుసా!
ఈనెల 15న బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్తో పాటు 29 మున్సిపల్ కార్పొరేషన్లలో ఎన్నికలు జరగనున్నాయి. కీలకమైన ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం జనవరి 15న ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించింది. 1881 నాటి నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ చట్టంలోని సెక్షన్ 25 కింద ఈ ఉత్తర్వు జారీ చేశారు. 1968 హోం మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాలు అప్పగించబడ్డాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం 15న సెలవు ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించడంతో జనవరి 15న BSE, NSE కూడా మూసేయవచ్చని సమాచారం.
ఇది కూడా చదవండి: Khawaja Asif: పాక్ రక్షణ మంత్రి గొప్పలు.. భారత్తో యుద్ధం తర్వాత హాట్ కేకుల్లా జెట్లు కొంటున్నారు
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రూ.74,000 కోట్లకు పైగా భారీ వార్షిక బడ్జెట్ను కలిగి ఉంది. అనేక సంవత్సరాలు శివసేన పాలించింది. ఈసారి ప్రధాన పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. మేయర్ పీఠం కోసం థాక్రే సోదరులు చేతులు కలిపారు. ఇంకోవైపు మహాయతి కూటమి బరిలోకి దిగింది. ముంబై ప్రజలు ఈసారి ఎవరికి పట్టం కడతారో చూడాలి. ఎన్నికల ఫలితాలు మాత్రం జనవరి 16న విడుదల కానున్నాయి.
ముంబైలో మొత్తం 1,03,44,315 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 55,16,707 మంది పురుష ఓటర్లు, 48,26,509 మంది మహిళా ఓటర్లు, 1,099 మంది ఇతర ఓటర్లు ఉన్నారు. 2017 స్థానిక సంస్థల ఎన్నికల్లో శివసేన 84 సీట్లు గెలుచుకుంది.
తాజావార్తలు
-
West Bengal Exit Poll 2026: బెంగాల్ లేటెస్ట్ ఎగ్జిట్ పోల్.. బీజేపీదే అధికారం..
-
Mangli: వివాదాల నడుమ మంగ్లీ కొత్త సాంగ్ రిలీజ్
-
IPL 2026 సీజన్లో 41 మ్యాచ్ల్లోనే 10 సార్లు 200+ రన్ ఛేజ్.. ఐపీఎల్ స్వరూపాన్నే మార్చేసిన ఒకే ఒక్క రూల్ ఇదే..
-
Sorakaya Paratha Recipe : మెత్తని సొరకాయ జొన్న పరాటాలు.. బరువు తగ్గాలనుకునే వారికి పర్ఫెక్ట్ హెల్తీ బ్రేక్ఫాస్ట్.!
-
Abhishek-Travis Head: అభిషేక్ ఆటతీరుపై ట్రావిస్ హెడ్ సంచలన వ్యాఖ్యలు.. ఇలా ఎప్పుడూ ఆడలేదంటూ..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!