Khawaja Asif: పాక్ రక్షణ మంత్రి గొప్పలు.. భారత్తో యుద్ధం తర్వాత హాట్ కేకుల్లా జెట్లు కొంటున్నారు
- పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ గొప్పలు
- పాకిస్థాన్ జెట్లపై ప్రగల్భాలు
- భారత్తో యుద్ధం తర్వాత హాట్ కేకుల్లా కొంటున్నారని వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆపరేషన్ సిందూర్తో హడలెత్తిపోయిన పాకిస్థాన్.. అమెరికా ద్వారా తీవ్ర లాబీయింగ్కు పాల్పడింది. అంతేకాకుండా ప్రస్తుతానికి సైనిక చర్య ఆపేసినా.. భవిష్యత్లో మళ్లీ ఆపరేషన్ సిందూర్ చేపట్టొ్చ్చని భయాందోళన వ్యక్తం చేసింది. అలాంటిది ఇప్పుడు ప్రగల్భాలు పలుకుతోంది.
తాజాగా పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించేలా వ్యాఖ్యలు చేశారు. భారతదేశంతో యుద్ధం తర్వాత హాట్ కేకుల్లా తమ జెట్లు అమ్ముడైపోతున్నాయని.. ఇకపై తమకు ఐఎంఎఫ్ రుణం అవసరం లేదని పేర్కొన్నారు. ఇస్లామాబాద్ యుద్ధ విమానాల కోసం రికార్డ్ స్థాయిలో ఆర్డర్లు వస్తున్నాయని చెప్పుకొచ్చారు. తమకు 6 నెలల తర్వాత ఐఎంఎఫ్ ఆర్థిక సహాయం అవసరం ఉండదని చెప్పారు. భారతదేశంతో నాలుగు రోజుల చిన్న యుద్ధం జరిగిందని పేర్కొన్నారు.
Also Read
- Vladimir Putin: "భారత్ను భయపెట్టాలని చూస్తే మీకే నష్టం".. ఆ దేశాలకు పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్!
- ISS Air Leak: అంతరిక్షంలో ఆందోళన.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గాలి లీక్ కలకలం
- Iran-US Tensions: మరోసారి భగ్గుమన్న పశ్చిమాసియా.. ఇరాన్ డ్రోన్లను కూల్చేసిన అమెరికా, రాడార్ కేంద్రాలపై దాడులు
- Niger: సహారా ఎడారిలో ఘోర విషాదం.. నీరు దొరక్క తీవ్ర దాహంతో 49 మంది నరకయాతన అనుభవిస్తూ మృతి!
ఇది కూడా చదవండి: Gold Rates: గోల్డ్ లవర్స్కు గుడ్న్యూస్.. తగ్గిన వెండి, బంగారం ధరలు
మంగళవారం కరాచీకి చెందిన జియో టీవీతో ఖవాజా ఆసిఫ్ మాట్లాడారు. మే 2025లో భారతదేశంతో నాలుగు రోజుల మినీ యుద్ధం తర్వాత పాకిస్థాన్కు రక్షణ ఆర్డర్లు పెరిగాయన్నారు. ఆరు నెలల తర్వాత పాకిస్థాన్ అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) నుంచి రుణాలను వదులుకుంటుందని తెలిపారు. మే నెలలో భారత్తో మినీ యుద్ధాన్ని తట్టుకునే సామర్థ్యం పాకిస్థాన్కు ఉండటం వల్ల సైనిక హార్డ్వేర్కు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరిగిందని తెలిపారు. మా విమానాలను పరీక్షించారని.. బాగుండడంతో చాలా ఆర్డర్లు వస్తున్నట్లు వెల్లడించారు. అంతే పాకిస్థాన్ సైనిక సామర్థ్యాలను ప్రపంచం గుర్తించిందని గొప్పలు చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: Trump-Colombia: కొలంబియాపై మారిన స్వరం.. గుస్తావోను వైట్హౌస్కు ఆహ్వానించిన ట్రంప్
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య రక్షణ సంబంధాలు బలపడుతున్నట్లుగా సంకేతాలు కనిపిస్తున్నాయి. బంగ్లాదేశ్ వైమానిక దళానికి జేఎఫ్–17 థండర్ యుద్ధ విమానాలు సరఫరా చేసే అంశంపై రెండు దేశాల వైమానిక దళాధిపతులు చర్చలు జరిపినట్టు పాకిస్థాన్ సైన్యం వెల్లడించింది. అయితే ఈ విమానాల కొనుగోలు అంశంపై బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
తాజావార్తలు
-
Maruti Suzuki Jimny: కొత్త జిమ్నీ వేరియంట్లు విడుదల.. 6 ఎయిర్బ్యాగ్లు, ADAS ఫీచర్లతో మరింత సురక్షితం
-
Aadhaar Update: ఆధార్లో ఈ తప్పులు ఉంటే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు.. ఇప్పుడే చెక్ చేసుకోండి
-
Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
-
Malkajgiri: ఎట్టకేలకు చిక్కిన నేపాలీ గ్యాంగ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
-
Dream Numbers Lottery: కలలో వచ్చిన నంబర్లలే జీవితాన్ని మార్చేశాయి.. కూరగాయలు అమ్మే మహిళకు రూ.2 కోట్ల లాటరీ!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!