Khawaja Asif: పాక్ రక్షణ మంత్రి గొప్పలు.. భారత్తో యుద్ధం తర్వాత హాట్ కేకుల్లా జెట్లు కొంటున్నారు
- పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ గొప్పలు
- పాకిస్థాన్ జెట్లపై ప్రగల్భాలు
- భారత్తో యుద్ధం తర్వాత హాట్ కేకుల్లా కొంటున్నారని వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆపరేషన్ సిందూర్తో హడలెత్తిపోయిన పాకిస్థాన్.. అమెరికా ద్వారా తీవ్ర లాబీయింగ్కు పాల్పడింది. అంతేకాకుండా ప్రస్తుతానికి సైనిక చర్య ఆపేసినా.. భవిష్యత్లో మళ్లీ ఆపరేషన్ సిందూర్ చేపట్టొ్చ్చని భయాందోళన వ్యక్తం చేసింది. అలాంటిది ఇప్పుడు ప్రగల్భాలు పలుకుతోంది.
తాజాగా పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించేలా వ్యాఖ్యలు చేశారు. భారతదేశంతో యుద్ధం తర్వాత హాట్ కేకుల్లా తమ జెట్లు అమ్ముడైపోతున్నాయని.. ఇకపై తమకు ఐఎంఎఫ్ రుణం అవసరం లేదని పేర్కొన్నారు. ఇస్లామాబాద్ యుద్ధ విమానాల కోసం రికార్డ్ స్థాయిలో ఆర్డర్లు వస్తున్నాయని చెప్పుకొచ్చారు. తమకు 6 నెలల తర్వాత ఐఎంఎఫ్ ఆర్థిక సహాయం అవసరం ఉండదని చెప్పారు. భారతదేశంతో నాలుగు రోజుల చిన్న యుద్ధం జరిగిందని పేర్కొన్నారు.
Also Read
- Islamabad: ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. అగ్నికి ఆహుతైన 15 మంది నవజాత శిశువులు
- US Visa Interview Pause: అమెరికా వీసా కోసం ఎదురుచూస్తున్నవారికి షాక్.. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్వ్యూలు వాయిదా, కారణం ఇదే!
- India-Iran Trade: ఇరాన్తో చమురు వ్యాపారం.. 4 భారతీయ కంపెనీలపై అమెరికా ఆంక్షలు
- Explainer: టార్గెట్ ఇండియా? పాక్కు బాంబులు పంపుతున్న టర్కీ!
ఇది కూడా చదవండి: Gold Rates: గోల్డ్ లవర్స్కు గుడ్న్యూస్.. తగ్గిన వెండి, బంగారం ధరలు
మంగళవారం కరాచీకి చెందిన జియో టీవీతో ఖవాజా ఆసిఫ్ మాట్లాడారు. మే 2025లో భారతదేశంతో నాలుగు రోజుల మినీ యుద్ధం తర్వాత పాకిస్థాన్కు రక్షణ ఆర్డర్లు పెరిగాయన్నారు. ఆరు నెలల తర్వాత పాకిస్థాన్ అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) నుంచి రుణాలను వదులుకుంటుందని తెలిపారు. మే నెలలో భారత్తో మినీ యుద్ధాన్ని తట్టుకునే సామర్థ్యం పాకిస్థాన్కు ఉండటం వల్ల సైనిక హార్డ్వేర్కు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరిగిందని తెలిపారు. మా విమానాలను పరీక్షించారని.. బాగుండడంతో చాలా ఆర్డర్లు వస్తున్నట్లు వెల్లడించారు. అంతే పాకిస్థాన్ సైనిక సామర్థ్యాలను ప్రపంచం గుర్తించిందని గొప్పలు చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: Trump-Colombia: కొలంబియాపై మారిన స్వరం.. గుస్తావోను వైట్హౌస్కు ఆహ్వానించిన ట్రంప్
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య రక్షణ సంబంధాలు బలపడుతున్నట్లుగా సంకేతాలు కనిపిస్తున్నాయి. బంగ్లాదేశ్ వైమానిక దళానికి జేఎఫ్–17 థండర్ యుద్ధ విమానాలు సరఫరా చేసే అంశంపై రెండు దేశాల వైమానిక దళాధిపతులు చర్చలు జరిపినట్టు పాకిస్థాన్ సైన్యం వెల్లడించింది. అయితే ఈ విమానాల కొనుగోలు అంశంపై బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
తాజావార్తలు
-
Islamabad: ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. అగ్నికి ఆహుతైన 15 మంది నవజాత శిశువులు
-
US Visa Interview Pause: అమెరికా వీసా కోసం ఎదురుచూస్తున్నవారికి షాక్.. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్వ్యూలు వాయిదా, కారణం ఇదే!
-
Ravi Teja-Irumudi: బాక్సాఫీస్ను షేక్ చేస్తున్న ‘ఇరుముడి’.. రవితేజ @ 100 కోట్ల సినిమాల లిస్ట్ ఇదే!
-
Baahubali: Before the Beginning: రూ.97 కోట్లు ఖర్చు.. రెండు సీజన్లు పూర్తి.. అయినా ‘బాహుబలి’ ప్రీక్వెల్ ను నెట్ఫ్లిక్స్ ఎందుకు ఆపేసింది?
-
Nokia 300 Charge: నోకియా 300 Charge ఫీచర్ ఫోన్ వచ్చేసింది.. 10W రివర్స్ ఛార్జింగ్, 3,700mAh బ్యాటరీతో!
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!