Hyderabad : ఒక్క అక్టోబర్ నెలలో రూ.3,170 కోట్ల విలువ గల నివాస ఆస్తుల రిజిస్ట్రేషన్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్లో రెసిడెన్షియల్ ప్రాపర్టీల రిజిస్ట్రేషన్ సంవత్సరానికి 25% (YoY) పెరిగింది . అక్టోబర్ 2023లో 5,787 రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయని నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక తెలిపింది..నైట్ ఫ్రాంక్ ఇండియా తాజా నివేదిక ప్రకారం.. ఏడాది ప్రాతిపదికన 25% పెరుగుదల గమనించబడింది. నెలలో నమోదైన ఆస్తుల మొత్తం విలువ 3,170 కోట్లు గా ఉంది. ఇది కూడా 41% పెరిగింది, ఇది అధిక విలువ ఉన్న గృహాల అమ్మకం వైపు మొగ్గు చూపిస్తుంది.. హైదరాబాద్ రెసిడెన్షియల్ మార్కెట్లో హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి అనే నాలుగు జిల్లాలు ఉన్నాయి.
అక్టోబర్ 2023లో, హైదరాబాద్లో అత్యధిక ఆస్తి రిజిస్ట్రేషన్లు 25 నుంచి 50 లక్షల రూపాయిలు ధర పరిధిలో జరిగాయని తెలుస్తుంది.. మొత్తం రిజిస్ట్రేషన్లలో 50% వాటా ఉంది. 25 లక్షల రూపాయిలు కంటే తక్కువ ధర గల ప్రాపర్టీలు మొత్తం రిజిస్ట్రేషన్లో 16% ఉన్నాయి. ఇది అక్టోబర్ 2022లో నమోదైన 22% షేర్ నుండి పడిపోయింది. రూ. ఒక కోటి రూపాయిలు, అంతకంటే ఎక్కువ టిక్కెట్ పరిమాణాలు ఉన్న ఆస్తుల అమ్మకాల రిజిస్ట్రేషన్ల వాటా అక్టోబర్ 2023లో 10% ఎక్కువ. ఇది అక్టోబర్ 2022లో ఉన్న 8%తో పోలిస్తే ఎక్కువ..
Also Read
- Nita Ambani: దేశంలోని అత్యంత శక్తివంతమైన మహిళగా నీతా అంబానీ.. ఫార్చ్యూన్ ఇండియా జాబితాలో తొలి స్థానం
- Cyber Fraud: ఓటీపీ చెప్పకపోయినా డబ్బు పోతుందా? సైబర్ నేరగాళ్లు ఇప్పుడు ఇలా మోసం చేస్తున్నారు
- PhonePe ITR filing: కేవలం రూ.24తోనే ITR ఫైల్ చేయొచ్చు.. PhonePe, JioFinance కొత్త ట్యాక్స్ ఫైలింగ్ సేవలు ప్రారంభం
- Digital Train Ticket: వాట్సాప్ టిక్కెట్లకు చెల్లుచీటి.. రైల్వే శాఖ తెచ్చిన సరికొత్త రూల్స్..
జిల్లా స్థాయిలో నిర్వహించిన అధ్యయనం ప్రకారం, మేడ్చల్-మల్కాజిగిరి స్థిరంగా 43% గృహ విక్రయాల రిజిస్ట్రేషన్లతో అగ్రస్థానంలో ఉండగా, రంగారెడ్డి జిల్లా 42% విక్రయాల రిజిస్ట్రేషన్తో దగ్గరగా ఉంది. దీనికి విరుద్ధంగా, అక్టోబర్ 2023లో మొత్తం రిజిస్ట్రేషన్లలో హైదరాబాద్ జిల్లా వాటా 14%.. నివేదికల ప్రకారం, అక్టోబర్ 2023లో, లావాదేవీలు జరిగిన రెసిడెన్షియల్ ప్రాపర్టీల సగటు ధరలు 6.8% పెరుగుదలను నమోదు చేశాయి. హైదరాబాద్, మేడ్చల్-మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాల్లో ఆస్తుల ధరలు వరుసగా 6% పెరిగాయి.
అక్టోబర్ లో హైదరాబాద్లో నివాస విక్రయాలు ప్రధానంగా 1,000-2,000 చదరపు అడుగుల ప్రాపర్టీలో ఉన్నాయి, అయితే ధర రూ. 25 – 50 లక్షలు, అత్యధిక రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఏదేమైనా గానీ బల్క్ లావాదేవీల కేంద్రీకరణకు మించి గృహ కొనుగోలుదారులు ఖరీదైన ఆస్తులను కూడా కొనుగోలు చేశారు, ఇవి పరిమాణంలో పెద్దవి మరియు మెరుగైన సౌకర్యాలను అందిస్తాయి. ఈ డీల్లలో కొన్ని హైదరాబాద్ మరియు రంగారెడ్డి వంటి మార్కెట్లలో జరిగాయి, వీటిలో ఆస్తులు 3,000 చదరపు అడుగుల కంటే ఎక్కువ పరిమాణంలో ఉన్నాయి. వాటి విలువ రూ. 4.5 కోట్లు అని అధ్యయనం సూచించింది..
తాజావార్తలు
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Congress: తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!
-
National Mourning: ఖతార్ మాజీ ఎమిర్ కన్నుమూత.. భారత్ కీలక నిర్ణయం..
-
Varanasi: రూమరా? నిజమా? రాజమౌళి – మహేష్ బాబు సినిమాతో ఎన్టీఆర్ కొడుకు ఎంట్రీ!
-
Bihar: లవ్ ఎఫైర్.. మహిళా కానిస్టేబుల్ కిడ్నాప్, అత్యాచారం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..