GST: జీవిత, ఆరోగ్య బీమా ప్రీమియంపై జీఎస్టీ మినహాయింపు..!
- ఆరోగ్య బీమా.. జీవిత బీమా ప్రీమియంపై జీఎస్టీ మినహాయింపు..!
- హెల్త్.. లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియంలపై జీఎస్టీ విధించే అంశంపై..
- శనివారం మంత్రివర్గ ఉపసంఘం భేటీ
- రూ. 5 లక్షల వరకు కవరేజీతో కూడిన ఆరోగ్య బీమా కోసం చెల్లించే..
- ప్రీమియంను జీఎస్టీ నుంచి మినహాయించాలని నిర్ణయం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పూర్తి స్థాయిలో బీమా కవరేజీ అందించే టర్మ్ పాలసీలతో పాటు, సీనియర్ సిటిజన్ల కోసం తీసుకునే ఆరోగ్య బీమా పాలసీలకు వస్తు, సేవల పన్ను (GST) నుంచి ఊరట లభించే అవకాశం ఉంది. రాష్ట్ర మంత్రివర్గ ప్యానెల్లోని చాలా మంది సభ్యులు సామాన్యులకు ప్రయోజనం చేకూర్చేలా పన్నులను తగ్గించడాన్ని సమర్థించారు. జీవిత, ఆరోగ్య బీమాపై జీఎస్టీ రేటుపై నిర్ణయం తీసుకునేందుకు మంత్రుల బృందం శనివారం సమావేశమైంది. ఇందులో సీనియర్ సిటిజన్లు జీవిత బీమా, ఆరోగ్య బీమా కోసం చెల్లించే ప్రీమియం పన్ను నుండి మినహాయించే అవకాశం ఉంది. అంతే కాకుండా.. టర్మ్ ఇన్సూరెన్స్తో పాటు రూ. 5 లక్షల వరకు కవరేజీతో కూడిన ఆరోగ్య బీమా కోసం చెల్లించే ప్రీమియంను జీఎస్టీ నుంచి మినహాయించాలని నిర్ణయించారు. ఈ విషయంలో మంత్రుల బృందం ఏకాభిప్రాయానికి వచ్చినట్లు బీహార్ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌధరి తెలిపారు.
Read Also: Wayanad: వయనాడ్లో ప్రియాంక వర్సెస్ నవ్య హరిదాస్.. పేరు ప్రకటించిన బీజేపీ
Also Read
- Crude Oil Prices Fall: ముడి చమురు ధరలపై గుడ్ న్యూస్.. బ్యారెల్ ధర 70 డాలర్లకు పడిపోవచ్చు..!
- Darecation Explained: డబ్బులిచ్చి మరీ భయాన్ని కొంటున్నారు.. ట్రావెలింగ్లో నయా ట్రెండ్
- Carlsberg IPO: ప్రపంచంలోనే అత్యంత పురాతన బియర్ బ్రాండ్ ఐపీఓ.. వివరాలు ఇవే!
- HDFC Bank MCLR Hike: కస్టమర్లకు షాకిచ్చిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్.. మరింత భారంగా EMIలు
అయితే ఈ విషయంలో తుది నిర్ణయం జీఎస్టీ కౌన్సిల్ తీసుకుంటుంది. ప్రస్తుతం రూ.5 లక్షల కంటే ఎక్కువ ఆరోగ్య బీమా కవరేజీకి చెల్లించే ప్రీమియంలపై 18 శాతం జీఎస్టీ విధింపు కొనసాగుతుంది. ప్రస్తుతం, టర్మ్ పాలసీలు, ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలకు చెల్లించే జీవిత బీమా ప్రీమియంలపై 18 శాతం జీఎస్టీ విధిస్తున్నారు. అయితే దీన్ని తొలగించాలని గతకొన్ని నెలలుగా డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో గత నెల జీఎస్టీ కౌన్సిల్ సమావేశమైంది. ఈ సమావేశంలో ఆరోగ్య, జీవిత బీమా ప్రీమియంలపై పన్నును నిర్ణయించేందుకు 13 మంది సభ్యులతో కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. దీనికి కన్వీనర్గా సామ్రాట్ చౌదరిని నియమించారు. ఇందులో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, గోవా, గుజరాత్, మేఘాలయ, పంజాబ్, తమిళనాడు మరియు తెలంగాణ మంత్రులు ఉన్నారు. అక్టోబర్ నెలాఖరులోగా తన నివేదికను జీఎస్టీ కౌన్సిల్కు సమర్పించాల్సి ఉంటుంది.
Read Also: Love Reddy: “లవ్ రెడ్డి” గెలిచాడు, ఇండస్ట్రీ సపోర్ట్ కోసం ఎదురుచూస్తున్నాం!
తాజావార్తలు
-
Jayam Ravi Divorce Case : మళ్ళీ కోర్టు మెట్లెక్కిన జయంరవి భార్య… ఈసారి ఏమైందంటే ?
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Blaupunkt QLED TV: థియేటర్ లాంటి అనుభవం.. Google TV 5.0తో బ్లాపంక్ట్ కొత్త QLED స్మార్ట్ టీవీలు.. చౌక ధరకే
-
RC 17 : సుకుమార్ సినిమాలో చరణ్ ఇలా ఉంటాడా?
-
Arjun Tendulkar: అచ్చు తండ్రి మాదిరే.. అర్జున్ టెండూల్కర్ గొప్ప మనసు.. వీడియో వైరల్!
ట్రెండింగ్
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?