మూడు రోజుల క్రితం వరకూ స్థిరంగా ఉన్న బంగారం ధరలు ఇప్పుడు తిరిగి పెరగడం మొదలు పెట్టాయి. ఈ రోజు ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఈ విధంగా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 100 పెరిగి రూ.44,900కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 పెరిగి 48,990 కి చేరింది. గత మూడు రోజులుగా బంగారం ధరలు పెరుగుతుండటంతో బంగారం కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఆలోచిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టినా, దేశీయంగా ధరలు పెరగడం విశేషం. బంగారం ధరలు పెరిగితే వెండి ధరలు మాత్రం తగ్గాయి. కిలో వెండి ధర రూ. 5,200 పెరిగి రూ.69,200 కి చేరింది.