దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. వరుసగా బంగారం ధరలు పెరుగుతుండటంతో పుత్తడిని కొనుగోలు చేయాలంటే ప్రజలు భయపడిపోతున్నారు. కరోనా మహమ్మారి కారణంగా చాలామంది బంగారంపై ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపుతుండటంతో ధరలు భారీగా పెరుగుతున్నాయి. అయితే, ఈరోజు బంగారం ధరలు ప్రస్తుతానికి స్థిరంగా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,600 వద్ద ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,750 వద్ద ఉన్నది. ఇక వెండి విషయానికి వస్తే.. కిలో వెండి ధర రూ. 300 పెరిగి రూ.76,000 వద్ద కొనసాగుతోంది. కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతుండటంతో బంగారం ధరలు ప్రస్తుతానికి స్థిరంగా ఉన్నాయి. ఒకవేళ కేసులు పెరిగి లాక్ డౌన్ ఆంక్షలు కఠినంగా అమలు జరుగుతూనే ఉంటె ధరలు మళ్ళీ పెరిగే అవకాశం లేకపోలేదు.