దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలతో పాటు.. వివిధ వస్తువల ధరలు, వంటనూనె ధరలు భారీగా పెరిగిపోతున్నాయి.. అన్నింటి పెరుగుదలపై పెట్రో ధరల ఎఫెక్ట్ స్పష్టంగా కనిపిస్తుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నమాట… పెట్రో ధరలు పైకి ఎగబాకడంతో.. రవాణా ఛార్జీలు పెరిగి.. దాని ప్రభావం అన్నింటిపై పడుతుందని వెల్లడిస్తున్నారు.. అయితే, ఈ నెలలో ఇంధన వినియోగం బాగా తగ్గినట్టు గణాంకాలు చెబుతున్నాయి.. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెరుగడమే ఇందుకు కారణంగా విశ్లేషిస్తున్నారు.. మార్చి 2022 తొలి 16 రోజులతో పోల్చితే.. ఏప్రిల్ (ఈ నెల)లో అదే సమయంలో.. 10 శాతం పెట్రోల్ వినియోగం తగ్గిపోయింది.. ఇదే సమయంలో డీజిల్ వినియోగం 15.6 శాతం పడిపోగా.. వంటగ్యాస్ వినియోగం కూడా 1.7 శాతం డ్రాప్ అయ్యింది.
Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో వంట గ్యాస్ వినియోగం బాగా పెరిగిపోయింది.. ఈ మధ్య వంటగ్యాస్పై వడ్డన పెరగడంతో.. దానికి కూడా డిమాండ్ తగ్గిపోయింది.. ఏప్రిల్ 1 నుండి 15 వరకు ప్రాథమికంగా, ప్రభుత్వ ఆధీనంలోని చమురు సంస్థల పెట్రోలు అమ్మకాలు 1.12 మిలియన్ టన్నులుగా ఉన్నాయి.. గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే దాదాపు 12.1 శాతం అధికం, అలాగే 2019 కాలంతో పోలిస్తే 19.6 శాతం ఎక్కువ.. అయితే, మార్చి 2022 మొదటి పదిహేను రోజుల్లో నమోదైన 1.24 మిలియన్ టన్నుల అమ్మకాలతో పోలిస్తే పెట్రోల్ వినియోగం 9.7 శాతం తగ్గింది. ఇక, దేశంలో అత్యధికంగా ఉపయోగించే ఇంధనం డీజిల్ ఏప్రిల్ మొదటి అర్ధ భాగంలో 7.4 శాతం అమ్మకాలను నమోదు చేసి సుమారు 3 మిలియన్ టన్నులకు చేరుకుంది, ఇది కూడా 2019లో ఇదే కాలం కంటే 4.8 శాతం ఎక్కువ. అయితే, ఈ ఇంధన వినియోగం మార్చి 1-15 మధ్య లాగిన్ అయిన 3.53 మిలియన్ టన్నుల వినియోగంతో పోలిస్తే 15.6 శాతం పడిపోయింది.. దీనికి ప్రధాన కారణం.. ధరల పెరుగుదలగా విశ్లేషిస్తున్నారు ఆర్థిక నిపుణులు.