EPFO: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఇకపై యూపీఐ ద్వారా డబ్బులు విత్ డ్రా!
- పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్
- త్వరలోనే యూపీఐ ద్వారా పీఎఫ్ డబ్బులను విత్ డ్రా
- రాబోయే 2-3 నెలల్లో UPI ప్లాట్ఫామ్లో ఈ సౌకర్యం
పీఎఫ్ ఖాతాదారులకు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ గుడ్ న్యూస్ అందించింది. పీఎఫ్ డబ్బులను ఈజీగా విత్ డ్రా చేసుకునేలా కొత్త విధానాన్ని తీసుకొచ్చేందుకు రెడీ అవుతోది. త్వరలోనే యూపీఐ ద్వారా పీఎఫ్ డబ్బులను విత్ డ్రా చేసుకునే సిస్టమ్ ను మూడు నెలల్లో తీసుకురానున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇది అమల్లోకి వస్తే ఉద్యోగులు తమ పీఎఫ్ ఖాతాలో జమ చేసిన డబ్బులను యూపీఐ ద్వారా విత్ డ్రా చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ఈపీఎఫ్ఓ ఖాతాదారులు తమ డబ్బులను బ్యాంక్ అకౌంట్లకు ట్రాన్స్ ఫర్ చేయడం ద్వారా విత్ డ్రా చేసుకునేవారు. ఈ విధానంలో డబ్బులు పొందడానికి కాస్త టైమ్ పడుతుంది.
Also Read
- Salary Delay: సారీ బాస్.. ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్! ఈసారి 'ఫస్ట్'కు శాలరీ రాదు.. ఎందుకో తెలుసా?
- Sun Pharma: అమెరికా గడ్డపై భారత ఫార్మా జెండా.. లక్ష కోట్లతో దిగ్గజ కంపెనీని కొనుగోలు చేసిన సన్ ఫార్మా!
- Ola Electric Share: ఒక్కప్పుడు రారాజు.. ఇప్పుడు బికారి! ఓలా ఎలక్ట్రిక్ రూ.157 నుంచి రూ.20 కి?
- Stock Market: కోలుకున్న మార్కెట్.. భారీ లాభాల్లో సూచీలు
రాబోయే 2-3 నెలల్లో UPI ప్లాట్ఫామ్లో ఈ సౌకర్యాన్ని ప్రారంభించడానికి EPFO ఇప్పటికే ఒక ప్రణాళికను సిద్ధం చేసిందని, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)తో చర్చలు జరుపుతోందని కూడా నివేదికలు వెల్లడిస్తున్నాయి. UPIతో EPFO అనుసంధానం కార్యకలాపాలను మెరుగుపరచడమే కాకుండా 7 కోట్లకు పైగా EPFO సభ్యులకు నిధుల బదిలీ సమస్యలను కూడా తగ్గిస్తుంది. ఈపీఎఫ్ ని యూపీఐతో అనుసంధానించడం ద్వారా క్లెయిమ్ ప్రక్రియలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ట్రాన్సాక్షన్స్ సులభతరం చేయడం ప్రభుత్వ లక్ష్యం.
Also Read:Hyundai Creta : హ్యుందాయ్ క్రెటా కొనాలని చూస్తున్నారా.. మూడు నెలలు వెయిట్ చేయాల్సిందే
పీఎఫ్ ఖాతాదారులు అనుసంధానం చేసుకున్న తరువాత డిజిటల్ వాలెట్ ద్వారా క్లెయిమ్ మొత్తాన్ని ఈజీగా పొందొచ్చు. కార్మిక మంత్రత్వ శాఖ.. ఆర్బీఐ, వాణిజ్య బ్యాంకుల సహకారంతో ఈపీఎఫ్ఓ డిజిటల్ వ్యవస్థను అప్ గ్రేడ్ చేస్తోంది. దీనివల్ల డబ్బుల ఉపసంహరణ ప్రక్రియ సులభతరం అవుతుంది. కాగా ఇటీవల ఈపీఎఫ్ఓ ఏటీఎం నుంచి పీఎఫ్ మొత్తాన్ని తీసుకునే సౌకర్యాన్ని తీసుకురానున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా 2024 ఆర్థిక సంవత్సరంలో, EPFO రూ. 1.82 లక్షల కోట్ల విలువైన 44.5 మిలియన్ క్లెయిమ్లను పరిష్కరించింది.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!