EarlySalary rebranded as ‘Fibe’: పేరు మారిన ‘ఎర్లీ శాలరీ’. ‘ఫైబ్’గా రీబ్రాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
EarlySalary rebranded as ‘Fibe’: డిజిటల్ లెండింగ్ స్టార్టప్ ఎర్లీ శాలరీ పేరు మారింది. ‘ఫైబ్’ అనే కొత్త పేరుతో రీబ్రాండింగ్ చేసుకుంటోంది. విస్తరణ ప్రణాళికను కూడా అమలుచేస్తోంది. గతంలో 18 సిటీల్లో మాత్రమే సర్వీసులు అందుబాటులో ఉండగా ఆ సంఖ్యను 150కి పెంచింది. ఇంతకుముందు ప్రతి నెలా 35 వేల మంది కొత్త వినియోగదార్లనే చేర్చుకున్న ఈ సంస్థ ఇప్పుడు కస్టమర్ బేస్ని ఏకంగా లక్షకు పెంచటం విశేషం. తద్వారా వచ్చే ఐదేళ్లలో రెండున్నర బిలియన్ డాలర్ల విలువైన ‘నిర్వహణలో ఉన్న ఆస్తులను’ సాధించటం ద్వారా తన ఉనికిని పటిష్టం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఉద్యోగులు ఈమధ్య ఇలాంటి యాప్ బేస్డ్ లోన్లు ఎక్కువగా తీసుకుంటున్న సంగతి తెలిసిందే. దీంతో.. ఎర్లీ శాలరీ (ఫైబ్) బాగా పాపులర్ అయిన లోన్ యాప్ల్లో ఒకటిగా నిలిచింది.
టీవీఎస్ స్కాలర్షిప్లు
Also Read
- Success Story: రూ.37 వేల జీతంతో మొదలైన ప్రయాణం..11 ఏళ్లలో రూ.2.2 కోట్లకు.. ఎలా అంటే..
- Gold Coins: మురికి కాలువలో బంగారు నాణేలు.. తవ్వుతున్న కొద్దీ దొరుకుతూనే ఉన్నాయ్..
- Gen Z Lifestyle: 'జెన్ జీ' లైఫ్స్టైల్ వెనుక అసలు నిజం.. టూర్లు కావు.. 70% డబ్బు దేనికి పోతోందో తెలుసా..?
- Vishal Garg: ఒక్క వీడియో కాల్తో 900 మంది ఉద్యోగాలు ఊడగొట్టాడు.. ఇప్పుడు తన CEO పదవే ఊడింది!
ప్రపంచవ్యాప్తంగా ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇచ్చేందుకు టీవీఎస్ మోటార్ కంపెనీ ముందుకొచ్చింది. ఫారన్, కామన్వెల్త్ అండ్ డెవలప్మెంట్ ఆఫీస్తో ఒప్పందం కుదుర్చుకుంది. లీడర్స్గా మరియు డెసిజన్ మేకర్స్గా ఎదిగేందుకు తమలోని అత్యుత్తమ సామర్థ్యాలను ప్రదర్శించే అభ్యర్థులను దేశాల వారీగా ఎంపిక చేస్తామని సంస్థ ఎండీ సుదర్శన్ వేణు తెలిపారు. FCDOతో మరియు బ్రిటన్ ప్రభుత్వంతో కలిసి ఈ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ను నిర్వహించనున్నట్లు చెప్పారు. భవిష్యత్ నాయకులను తయారుచేసేందుకు మరియు ఆ అభ్యర్థులకు తమ జర్నీలో ససోర్ట్ చేసేందుకు నిబద్ధతతో పాటుపడతామని పేర్కొన్నారు.
read also: Hero Ramcharan for Hero Company: హీరో విత్ ‘హీరో’. కొత్త బ్రాండ్ అంబాసిడర్గా రామ్చరణ్
కేంద్రానికి పన్నుల ఊరట
కేంద్ర ప్రభుత్వానికి ఆర్థికంగా కాస్త ఊరట లభించింది. జీఎస్టీతోపాటు ఇతర పన్నుల వసూళ్లు గతేడాది కన్నా ఈసారి 30 శాతం ఎక్కువగా నమోదయ్యాయి. దీంతో మార్కెట్ నుంచి రుణాలను కొంచెం తక్కువే తీసుకోవాలని నిర్ణయించుకుంది. 14.31 లక్షల కోట్ల లోన్ తీసుకోవాలని తొలుత లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పుడు దాన్ని 14.21 లక్షల కోట్లకు తగ్గించుకుంది. వచ్చే ఏడాది మార్చితో ముగిసే అర్ధ వార్షికంలో 5.92 లక్షల కోట్లు మాత్రమే రుణం సేకరించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
తాజావార్తలు
-
Shiva Nirvana: ‘ఇరుముడి’ క్లైమాక్స్పై శివ నిర్వాణ క్రేజీ హింట్.. ఆ 40 నిమిషాలు మర్చిపోలేరట!
-
Irumudi Pre-Release: ఇరుముడి ఈవెంట్లో రవితేజ.. నక్షత్రపై షాకింగ్ కామెంట్స్.!
-
Medico Suicide: ఉప్పల్లో విషాదం.. మెడికో బలవన్మరణం.!
-
IMD Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. రేపు ఇక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు..
-
Success Story: రూ.37 వేల జీతంతో మొదలైన ప్రయాణం..11 ఏళ్లలో రూ.2.2 కోట్లకు.. ఎలా అంటే..
ట్రెండింగ్
-
Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్రేంజ్లో బెస్ట్ స్మార్ట్ఫోన్ ఏది.?