EarlySalary rebranded as ‘Fibe’: పేరు మారిన ‘ఎర్లీ శాలరీ’. ‘ఫైబ్’గా రీబ్రాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
EarlySalary rebranded as ‘Fibe’: డిజిటల్ లెండింగ్ స్టార్టప్ ఎర్లీ శాలరీ పేరు మారింది. ‘ఫైబ్’ అనే కొత్త పేరుతో రీబ్రాండింగ్ చేసుకుంటోంది. విస్తరణ ప్రణాళికను కూడా అమలుచేస్తోంది. గతంలో 18 సిటీల్లో మాత్రమే సర్వీసులు అందుబాటులో ఉండగా ఆ సంఖ్యను 150కి పెంచింది. ఇంతకుముందు ప్రతి నెలా 35 వేల మంది కొత్త వినియోగదార్లనే చేర్చుకున్న ఈ సంస్థ ఇప్పుడు కస్టమర్ బేస్ని ఏకంగా లక్షకు పెంచటం విశేషం. తద్వారా వచ్చే ఐదేళ్లలో రెండున్నర బిలియన్ డాలర్ల విలువైన ‘నిర్వహణలో ఉన్న ఆస్తులను’ సాధించటం ద్వారా తన ఉనికిని పటిష్టం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఉద్యోగులు ఈమధ్య ఇలాంటి యాప్ బేస్డ్ లోన్లు ఎక్కువగా తీసుకుంటున్న సంగతి తెలిసిందే. దీంతో.. ఎర్లీ శాలరీ (ఫైబ్) బాగా పాపులర్ అయిన లోన్ యాప్ల్లో ఒకటిగా నిలిచింది.
టీవీఎస్ స్కాలర్షిప్లు
Also Read
- Apollo Micro Systems: లక్ష పెట్టుబడి.. రూ.39 లక్షల లాభం.. ఇన్వెస్టర్ల రాత మార్చిన స్టాక్!
- Success Story: అదృష్టం అంటే నీదే గురు.. రూ.4 లక్షల జీతం.. బోనస్గా థాయ్లాండ్ ట్రిప్! ఏం చేశాడో తెలుసా?
- Govt Hikes Price: ఉల్లి రైతులకు భారీ శుభవార్త.. రైతుల పంట పండినట్లే..
- Explainer: పెట్రోల్ రేట్ల దోపిడీ ఆగేదెప్పుడు..? ఇంధన ధరల మాయాజాలంపై కీలక రిపోర్ట్!
ప్రపంచవ్యాప్తంగా ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇచ్చేందుకు టీవీఎస్ మోటార్ కంపెనీ ముందుకొచ్చింది. ఫారన్, కామన్వెల్త్ అండ్ డెవలప్మెంట్ ఆఫీస్తో ఒప్పందం కుదుర్చుకుంది. లీడర్స్గా మరియు డెసిజన్ మేకర్స్గా ఎదిగేందుకు తమలోని అత్యుత్తమ సామర్థ్యాలను ప్రదర్శించే అభ్యర్థులను దేశాల వారీగా ఎంపిక చేస్తామని సంస్థ ఎండీ సుదర్శన్ వేణు తెలిపారు. FCDOతో మరియు బ్రిటన్ ప్రభుత్వంతో కలిసి ఈ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ను నిర్వహించనున్నట్లు చెప్పారు. భవిష్యత్ నాయకులను తయారుచేసేందుకు మరియు ఆ అభ్యర్థులకు తమ జర్నీలో ససోర్ట్ చేసేందుకు నిబద్ధతతో పాటుపడతామని పేర్కొన్నారు.
read also: Hero Ramcharan for Hero Company: హీరో విత్ ‘హీరో’. కొత్త బ్రాండ్ అంబాసిడర్గా రామ్చరణ్
కేంద్రానికి పన్నుల ఊరట
కేంద్ర ప్రభుత్వానికి ఆర్థికంగా కాస్త ఊరట లభించింది. జీఎస్టీతోపాటు ఇతర పన్నుల వసూళ్లు గతేడాది కన్నా ఈసారి 30 శాతం ఎక్కువగా నమోదయ్యాయి. దీంతో మార్కెట్ నుంచి రుణాలను కొంచెం తక్కువే తీసుకోవాలని నిర్ణయించుకుంది. 14.31 లక్షల కోట్ల లోన్ తీసుకోవాలని తొలుత లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పుడు దాన్ని 14.21 లక్షల కోట్లకు తగ్గించుకుంది. వచ్చే ఏడాది మార్చితో ముగిసే అర్ధ వార్షికంలో 5.92 లక్షల కోట్లు మాత్రమే రుణం సేకరించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
తాజావార్తలు
-
Siva Narayana Reddy: ప్రేమకు గుర్తుగా షాజహాన్ తాజ్ మహల్ కడితే.. ఏపీలో ఒక భర్త తన భార్య కోసం ఏం చేశాడో చూడండి!
-
Iran: ఖమేనీ అంత్యక్రియల వేళ మొజ్తబాపై కొత్త పుకార్లు.. ఇరాన్లో చర్చోపచర్చలు
-
Ketan Agarwal murder: నా కూతురు ‘‘మిడిల్ ఫింగర్’’ చూపలేదు: సియా తండ్రి వివరణ..
-
Varanasi: వారణాసిలో మహేష్ బాబు రాముడి లుక్ లీక్? నెట్టింట వైరల్ అవుతోన్న పిక్.. అసలు నిజం ఇదే!
-
Telangana Job Mela : తెలంగాణలో జాబ్ మేళా.. యువతకు గుడ్ న్యూస్.!
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!
-
Crispy Onion Pakoda Recipe: బయట చల్లటి వర్షం.. ఇంట్లో వేడి వేడి ఉల్లిపాయ పకోడీ.! హోటల్ స్టైల్లో క్రిస్పీగా చేసేయండి ఇలా..