Vocal for Local: ఈ దీపావళికి చైనాకు రూ.1.25 లక్షల కోట్ల నష్టం..
- ఈ దీపావళికి చైనాకు భారీ షాక్
- దేశీయ వస్తువులకు ప్రాధాన్యత ఇస్తున్న జనాలు
- చిరు వ్యాపారుల వద్ద పెరిగిన కొనుగోళ్లు
- చైనాకు రూ.1.25 లక్షల కోట్ల నష్టం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత కొన్ని సంవత్సరాలుగా.. దీపావళి, ధన్తేరస్లలో భారతీయ మార్కెట్లలో చైనా ఉత్పత్తులకు డిమాండ్ తగ్గుతోంది. ముఖ్యంగా అలంకరణ వస్తువుల విక్రయాలు గతంతో పోలిస్తే ఈ సారి గణనీయంగా తగ్గాయి. తక్కువ డిమాండ్ కారణంగా.. దిగుమతులు కూడా తగ్గుతున్నాయి. దీని కారణంగా దేశీయ వస్తువుల అమ్మకాలు పెరుగుతున్నాయి. నిజానికి ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టిన ‘వోకల్ ఫర్ లోకల్’ ప్రచార ప్రభావం ఇప్పుడు దేశంలో కనిపిస్తోంది. దేశీయ వస్తువులనే కొనుగోలు చేయాలన్న ఆయన నినాదం చైనాపై తీవ్ర ప్రభావం చూయించింది. ఈ ఏడాది దీపావళిన ముఖ్యంగా ‘మేడ్ ఇన్ ఇండియా’ చూసిన తర్వాతే ఎలక్ట్రానిక్స్, డెకరేషన్ వస్తువులను కొనుగోలు చేస్తున్నారు.
READ MORE: Somy Ali: ‘‘సల్మాన్ ఖాన్ కన్నా లారెన్స్ బిష్ణోయ్ నయం’’.. స్టార్ హీరో మాజీ ప్రేయసి..
Also Read
- LPG Supply: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఇక కష్టాలు తీరినట్లే..
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. జూన్లో 3 రోజులు సేవలకు అంతరాయం
- IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
- RBI Online Fraud Rule: యూపీఐ ఫ్రాడ్, బ్యాంకింగ్ స్కామ్లపై RBI బిగ్ అప్డేట్.. డబ్బు తిరిగి వచ్చే ఛాన్స్!
చైనా ఉత్పత్తులకు వ్యతిరేకత:
ఓ నివేదిక ప్రకారం.. దీపావళికి సంబంధించి చైనా వస్తువుల విక్రయాలు భారీగా క్షీణించడంతో చైనా దాదాపు రూ.1 లక్షా 25 వేల కోట్ల మేర నష్టాన్ని చవిచూస్తోంది. ఎందుకంటే గతంలో చైనా వస్తువుల డిమాండ్ భారీగా ఉండేది. కానీ ప్రస్తుతం వాటికి ఆదరణ కరువైంది. మట్టి దీపాలు, అలంకార వస్తువులను కుమ్మరుల నుంచి కొనుగోలు చేస్తూ.. మంచి సందేశాన్ని అందిస్తున్నారు. దీపావళికి సంబంధించిన వస్తువులను తయారు చేసే తమ ప్రాంతంలోని మహిళలు, కుమ్మరులు, చేతివృత్తులు, ఇతరులకు సహాయం చేయాలని దేశవ్యాప్తంగా వ్యాపార సంస్థలను సీఏఐటీ (CAIT) కోరింది. దీంతో ప్రజల్లో అవగాహన పెరిగి ఇప్పుడు దేశీయ ఉత్పత్తులకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆయా కార్మికుల ఇళ్లలో కూడా దీపావళి వెలుగులు నింపుతున్నారు.
READ MORE:Naga Vamsi: అందుకే లక్కీ భాస్కర్ ప్రీమియర్ షోలు.. నాగవంశీ కీలక వ్యాఖ్యలు
ఇదిలా ఉండగా.. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (క్యాట్) ప్రకారం.. ఈ ఏడాది ధన్తేరస్పై దాదాపు రూ.60 వేల కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా. దీపావళి నాటికి ఈ సంఖ్య లక్ష కోట్లు దాటుతుంది. ఈ కాలంలో బంగారం, వెండితో పాటు ఇత్తడితో చేసిన పాత్రల కొనుగోలు కూడా భారీగానే జరిగింది. ఈసారి దాదాపు రూ.2500 కోట్ల విలువైన వెండిని కొనుగోలు చేశారు. ఒక్కరోజులో రూ.20 వేల కోట్ల విలువైన బంగారం అమ్ముడుపోయింది.
తాజావార్తలు
-
Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. వృత్తి, ఉద్యోగ రంగాల్లో మిశ్రమ ఫలితాలు!
-
Ranabaali : ‘రణబాలి’ వివాదంపై మైత్రి రవిశంకర్ స్పందన.. విజయ్పై కీలక వ్యాఖ్యలు
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
8849 Tank 5: ప్రొజెక్టర్తో 8849 ట్యాంక్ 5 స్మార్ట్ఫోన్ విడుదల.. 17,600mAh భారీ బ్యాటరీ, 3K డిస్ప్లే
-
Billa Ranga Baasha : 2209 ప్రపంచంలో కిచ్చా సుదీప్ యాక్షన్.. ‘బిల్లా రంగ బాషా’ నుంచి బిగ్ అప్డేట్!
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!