RBI Online Fraud Rule: యూపీఐ ఫ్రాడ్, బ్యాంకింగ్ స్కామ్లపై RBI బిగ్ అప్డేట్.. డబ్బు తిరిగి వచ్చే ఛాన్స్!
- సైబర్ మోసాల బాధితులకు RBI గుడ్న్యూస్
- ఆన్లైన్ మోసంలో డబ్బులు పోయాయా?
- RBI కొత్త రూల్తో తిరిగి పొందే అవకాశం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒక్క ఫోన్ కాల్.. ఒక ఫేక్ లింక్.. లేదా ఒక OTP తో క్షణాల్లో మీ బ్యాంక్ ఖాతా ఖాళీ కావచ్చు! ఇటీవల దేశవ్యాప్తంగా UPI, ఆన్లైన్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్ మోసాలు భారీగా పెరిగాయి. లక్షలాది మంది తమ కష్టార్జిత డబ్బును సైబర్ నేరగాళ్ల చేతిలో కోల్పోతున్నారు. అయితే ఇప్పుడు అలాంటి బాధితులకు ఊరటనిచ్చే కీలక నిర్ణయం తీసుకుంది భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI). ఆన్లైన్ మోసంలో డబ్బు పోయినా, కొన్ని పరిస్థితుల్లో తిరిగి పరిహారం పొందే అవకాశం కల్పించే కొత్త నిబంధనలను RBI తీసుకువచ్చింది. అసలు ఈ కొత్త రూల్ ఏమిటి? ఎవరికి వర్తిస్తుంది? ఎంత డబ్బు తిరిగి వస్తుంది? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
సైబర్ మోసాల బాధితులకు RBI రక్షణ
దేశంలో డిజిటల్ చెల్లింపులు పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆన్లైన్ మోసాలకు గురైన బ్యాంక్ ఖాతాదారులను రక్షించేందుకు RBI కొత్త ఫ్రేమ్వర్క్ను సిద్ధం చేసింది. కొత్త నిబంధనల ప్రకారం, డిజిటల్ ఫ్రాడ్ కారణంగా రూ.50,000 వరకు నష్టపోయిన బాధితులకు పరిహారం అందించే అవకాశం ఉంటుంది. అర్హత కలిగిన బాధితులకు నష్టం మొత్తంలో 85 శాతం లేదా గరిష్టంగా రూ.25,000 వరకు పరిహారం లభించవచ్చు.
Also Read
- UPI Tap & Pay and MyUPI: సరి కొత్త ఫీచర్లు.. QR స్కాన్, పిన్ ఎంట్రీకి గుడ్బై.. ఇంటర్నెట్ లేకున్నా పేమెంట్స్..!
- Gold-Silver Price Today: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. 24K, 22K, 18K రేట్లు ఎంతంటే?
- Bank Strike 2026: బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్.. నేటి నుంచి వరుసగా 4 రోజులు బ్యాంకులు బంద్..
- Samsung Roasts Apple's First Foldable: యాపిల్ ఫోల్డబుల్పై శామ్సంగ్ ఘాటు సెటైర్లు..
ఎవరికి ఈ ప్రయోజనం?
ఈ రూల్ కేవలం వ్యక్తిగత బ్యాంక్ ఖాతాదారులకు మాత్రమే కాదు. చిన్న వ్యాపారులు, సోల్ ప్రొప్రైటర్షిప్ సంస్థలు నిర్వహించే వారికి కూడా వర్తిస్తుంది. దీంతో లక్షలాది మంది డిజిటల్ బ్యాంకింగ్ వినియోగదారులకు భద్రత పెరగనుంది.
‘షాడో రివర్సల్’ అంటే ఏమిటి?
RBI తీసుకొచ్చిన మరో కీలక అంశం ‘షాడో రివర్సల్’. దీని ప్రకారం, మోసపూరిత లావాదేవీపై ఫిర్యాదు అందిన వెంటనే, విచారణ పూర్తయ్యే వరకు వివాదాస్పద మొత్తాన్ని తాత్కాలికంగా బాధితుడి ఖాతాలో జమ చేసే అవకాశం ఉంటుంది. దీంతో బాధితుడు తక్షణ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉంటాడు.
బ్యాంకు తప్పిదం అయితే పూర్తి బాధ్యత బ్యాంకుదే
మోసం బ్యాంకు భద్రతా లోపాల వల్ల జరిగితే లేదా బ్యాంకింగ్ వ్యవస్థలో వైఫల్యం ఉంటే, వినియోగదారుడికి ‘జీరో లయబిలిటీ’ వర్తిస్తుంది. అంటే నష్టం మొత్తాన్ని బ్యాంకే భరించాల్సి ఉంటుంది.
మోసం జరిగితే వెంటనే ఏం చేయాలి?
ఆన్లైన్ మోసానికి గురైన వెంటనే:
మీ బ్యాంకుకు సమాచారం ఇవ్వాలి
1930 సైబర్ హెల్ప్లైన్కు కాల్ చేయాలి
జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్లో ఫిర్యాదు నమోదు చేయాలి
లావాదేవీ వివరాలు, స్క్రీన్షాట్లు భద్రపరచాలి. ఎంత త్వరగా ఫిర్యాదు చేస్తే డబ్బు తిరిగి వచ్చే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయి.
ఎప్పుడు పరిహారం రాకపోవచ్చు?
మీరు స్వయంగా OTP, PIN, CVV, పాస్వర్డ్ వంటి ప్రైవసీ డీటెయిల్స్ ను ఇతరులతో పంచుకుంటే లేదా మోసాన్ని ఆలస్యంగా నివేదిస్తే పరిహారం పొందే అవకాశం తగ్గిపోవచ్చు.
ఎప్పుడు అమల్లోకి వస్తుంది?
RBI తుది మార్గదర్శకాలను ప్రకటించినప్పటికీ, ఈ కొత్త వ్యవస్థ 2027 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. అప్పటి నుంచి అర్హత కలిగిన డిజిటల్ మోసాల బాధితులు ఈ ప్రొటెక్షన్ పొందొచ్చు.
డిజిటల్ యుగంలో సౌకర్యాలు పెరిగినంతగా ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయి. అయితే సైబర్ మోసాల బాధితులకు RBI తీసుకొచ్చిన ఈ కొత్త నిబంధనలు కొంత భరోసాను కల్పిస్తున్నాయి. అయినప్పటికీ, OTPలు, బ్యాంక్ వివరాలు, UPI PIN వంటి సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోకుండా అప్రమత్తంగా ఉండటం ప్రతి ఒక్కరి బాధ్యత. ఒక్క నిర్లక్ష్యం మీ ఖాతాను ఖాళీ చేయవచ్చు.. కానీ ఇప్పుడు RBI కొత్త రూల్ మీకు అండగా నిలవొచ్చు!
- Tags
- Cyber fraud
- digital banking
- RBI
- UPI
తాజావార్తలు
-
Rain Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. 13 జిల్లాలకు అలర్ట్ జారీ..
-
China: బ్రిక్స్ సదస్సు భారత్ విజయవంతంగా నిర్వహించాలి.. మోడీ-జిన్పింగ్ భేటీకి ముందు చైనా కీలక వ్యాఖ్యలు
-
BRICS Summit: పుతిన్, జిన్పింగ్ ఎక్కడ బస చేస్తున్నారు? ఢిల్లీలో స్టార్ హోటళ్లన్నీ హైసెక్యూరిటీ జోన్లే!
-
Nethanna Bharosa: పెన్షన్లకు దరఖాస్తు చేసుకునే వారికి శుభవార్త.. దరఖాస్తులో ఆ నిబంధన మినహాయింపు..
-
Harish Rao : కేసీఆర్ పాలనలో పరిష్కారాలు.. రేవంత్ సర్కార్లో సమస్యలే
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?