Business Flash 14-07-22: గోల్డ్ రేట్లు.. స్టాక్ మార్కెట్లు.. ఇతర బిజినెస్ అప్డేట్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మన దేశంలో ‘బాష్’ భారీ పెట్టుబడి
ఆటోమొబైల్ విడి భాగాల తయారీలో పేరున్న, పెద్ద సంస్థ బాష్ లిమిటెడ్ మన దేశంలో భారీఎత్తున పెట్టుబడులు పెట్టనుంది. ఈ రంగంలో వచ్చే ఐదేళ్లలో రూ.200 కోట్లకు పైగానే (25.12 మిలియన్ డాలర్లు) ఖర్చుచేయనున్నట్లు అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే స్థానికులకు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కూడా లభిస్తాయి.
Also Read
- Sugar Price Hike: షుగర్ ధరల్లో రికార్డు జంప్.. 18 రోజుల్లో ఇంత పెరిగిందా?
- SBI New Withdrawal Rules: మీకు SBIలో ఈ ఖాతా ఉందా..? విత్డ్రాయల్పై కొత్త ఛార్జీలు.. నయా రూల్స్ ఇవే
- RBI New Rules 2027: 2027 నుంచి RBI న్యూ రూల్స్.. హోమ్ లోన్, పర్సనల్ లోన్ EMIలు ఎలా మారతాయంటే?
- Banking for Youth Campaign: నిర్మలా సీతారామన్ కీలక ఆదేశాలు.. యువత కోసం ప్రభుత్వ బ్యాంకుల్లో ప్రత్యేక కార్యక్రమాలు
తెలంగాణలో అత్యధిక ద్రవ్యోల్బణం
దేశంలోనే అత్యధిక ద్రవ్యోల్బణం (10 శాతం) తెలంగాణ రాష్ట్రంలో నమోదైంది. బీహార్లో అతి తక్కువ (4.7 శాతం) ఉండటం గమనార్హం. ఆహార ధరల్లో సాధారణ (7.7) పెరుగుదల నెలకొనగా కూరగాయల రేట్లు మాత్రం ఆకాశ్నంటాయి. దీంతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. ఆర్థిక ప్రగతి సహా దాదాపు అన్ని సూచీల్లో మెరుగైన స్థానంలో ఉండే తెలంగాణ.. ద్రవ్యోల్బణం విషయంలో అనూహ్య ఫలితాలను చవిచూడాల్సి వచ్చింది.
కంపెనీ న్యూస్
మైండ్ట్రీ తొలి త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది. సంస్థకు స్థిరంగా ఆర్డర్లు వెల్లువెత్తుతున్నట్లు పేర్కొంది. ఏడాదిలో 36.2 శాతం రెవెన్యూ పెరిగిందని, దీంతో ఏకంగా 37 శాతం నికర లాభాలను నమోదు చేసినట్లు తెలిపింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ.5000 కోట్లు సేకరించే పనిలో పడింది. ప్రైవేట్ ప్లేస్మెంట్ ప్రాతిపదికన బాండ్లును ఈ వారమే వేలం వేయనుంది. కేర్ సంస్థ రేటింగ్స్ 10 శాతం పెరిగాయి. షేర్ల బైబ్యాక్ ప్లాన్కి బోర్డ్ ఓకే చెప్పనుందనే వార్తల నేపథ్యంలో ఈ సంకేతం వెలువడింది.
స్టాక్ మార్కెట్ అప్డేట్
స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమైనా నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 50 పాయింట్లు తగ్గి 53,475కి చేరింది. నిఫ్టీ 15,900 వద్ద ట్రేడ్ అవుతోంది. హెల్త్ కేర్ సెక్టార్ షేర్లు స్వల్పంగా లాభపడ్డాయి. వీటి విలువ 1.2 శాతం పెరిగింది. ఎఫ్ఎంసీజీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ కూడా లాభాలు ఆర్జించాయి. ఈ రెండు రంగాలకు 0.5 శాతం చొప్పున ప్రాఫిట్స్ వచ్చాయి. టాటా మెటాలిక్స్ నికర లాభాలు 99 శాతం తగ్గినట్లు ప్రకటించిన నేపథ్యంలో ఆ సంస్థ షేర్లు 6 శాతం పడిపోయాయి.
బంగారం ధరలు
99.9 శాతం స్వచ్ఛమైన (24 క్యారెట్ల) తులం బంగారం ఇవాళ హైదరాబాద్లో 51,160 రూపాయలు పలుకుతోంది. నిన్నటితో పోల్చితే ఇవాళ ఈ రేటు 210 రూపాయలు పెరిగింది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.46,900 ఉంది. ఇది నిన్నటితో పోల్చితే రూ.200 పెరిగింది. గత వారం రోజులుగా పెరగని గోల్డ్ రేట్ ఇవాళే రూ.200 పెరగటం గమనార్హం.
- Tags
- bosh
- Business Flash
- care
- gold rates
- HDFC
తాజావార్తలు
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
-
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!