Business Flash 14-07-22: గోల్డ్ రేట్లు.. స్టాక్ మార్కెట్లు.. ఇతర బిజినెస్ అప్డేట్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మన దేశంలో ‘బాష్’ భారీ పెట్టుబడి
ఆటోమొబైల్ విడి భాగాల తయారీలో పేరున్న, పెద్ద సంస్థ బాష్ లిమిటెడ్ మన దేశంలో భారీఎత్తున పెట్టుబడులు పెట్టనుంది. ఈ రంగంలో వచ్చే ఐదేళ్లలో రూ.200 కోట్లకు పైగానే (25.12 మిలియన్ డాలర్లు) ఖర్చుచేయనున్నట్లు అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే స్థానికులకు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కూడా లభిస్తాయి.
Also Read
- Adani Aluminium: అదానీ నెక్ట్స్ టార్గెట్ ఆ రెండు పెద్ద కంపెనీలేనా? ఏకంగా రూ. 1.1 లక్షల కోట్లతో గౌతమ్ అదానీ సరికొత్త ప్లాన్!
- Microsoft LayOff: మైక్రోసాఫ్ట్లో భారీ ఉద్యోగాల కోత.. AI కోసం 4,800 మందికి ఉద్వాసన..
- ITR Filing AY 2026-27: ఆదాయం తక్కువ ఉన్నా సరే.. ఈ 5 కారణాలతో ITR తప్పనిసరి
- OPEC+ Oil Production: వాహనదారులకు పండగే.. OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే ఛాన్స్?
తెలంగాణలో అత్యధిక ద్రవ్యోల్బణం
దేశంలోనే అత్యధిక ద్రవ్యోల్బణం (10 శాతం) తెలంగాణ రాష్ట్రంలో నమోదైంది. బీహార్లో అతి తక్కువ (4.7 శాతం) ఉండటం గమనార్హం. ఆహార ధరల్లో సాధారణ (7.7) పెరుగుదల నెలకొనగా కూరగాయల రేట్లు మాత్రం ఆకాశ్నంటాయి. దీంతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. ఆర్థిక ప్రగతి సహా దాదాపు అన్ని సూచీల్లో మెరుగైన స్థానంలో ఉండే తెలంగాణ.. ద్రవ్యోల్బణం విషయంలో అనూహ్య ఫలితాలను చవిచూడాల్సి వచ్చింది.
కంపెనీ న్యూస్
మైండ్ట్రీ తొలి త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది. సంస్థకు స్థిరంగా ఆర్డర్లు వెల్లువెత్తుతున్నట్లు పేర్కొంది. ఏడాదిలో 36.2 శాతం రెవెన్యూ పెరిగిందని, దీంతో ఏకంగా 37 శాతం నికర లాభాలను నమోదు చేసినట్లు తెలిపింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ.5000 కోట్లు సేకరించే పనిలో పడింది. ప్రైవేట్ ప్లేస్మెంట్ ప్రాతిపదికన బాండ్లును ఈ వారమే వేలం వేయనుంది. కేర్ సంస్థ రేటింగ్స్ 10 శాతం పెరిగాయి. షేర్ల బైబ్యాక్ ప్లాన్కి బోర్డ్ ఓకే చెప్పనుందనే వార్తల నేపథ్యంలో ఈ సంకేతం వెలువడింది.
స్టాక్ మార్కెట్ అప్డేట్
స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమైనా నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 50 పాయింట్లు తగ్గి 53,475కి చేరింది. నిఫ్టీ 15,900 వద్ద ట్రేడ్ అవుతోంది. హెల్త్ కేర్ సెక్టార్ షేర్లు స్వల్పంగా లాభపడ్డాయి. వీటి విలువ 1.2 శాతం పెరిగింది. ఎఫ్ఎంసీజీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ కూడా లాభాలు ఆర్జించాయి. ఈ రెండు రంగాలకు 0.5 శాతం చొప్పున ప్రాఫిట్స్ వచ్చాయి. టాటా మెటాలిక్స్ నికర లాభాలు 99 శాతం తగ్గినట్లు ప్రకటించిన నేపథ్యంలో ఆ సంస్థ షేర్లు 6 శాతం పడిపోయాయి.
బంగారం ధరలు
99.9 శాతం స్వచ్ఛమైన (24 క్యారెట్ల) తులం బంగారం ఇవాళ హైదరాబాద్లో 51,160 రూపాయలు పలుకుతోంది. నిన్నటితో పోల్చితే ఇవాళ ఈ రేటు 210 రూపాయలు పెరిగింది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.46,900 ఉంది. ఇది నిన్నటితో పోల్చితే రూ.200 పెరిగింది. గత వారం రోజులుగా పెరగని గోల్డ్ రేట్ ఇవాళే రూ.200 పెరగటం గమనార్హం.
- Tags
- bosh
- Business Flash
- care
- gold rates
- HDFC
తాజావార్తలు
-
Telangana : ఇకపై ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు వేర్వేరుగా ప్రాక్టికల్స్.!
-
Vaibhav Sooryavanshi: ‘వైభవ్ కేవలం ట్రైలర్ మాత్రమే చూపించాడు.. ముందుంది సినిమా’..
-
OTR : బీఆర్ఎస్ కు మల్లారెడ్డి దూరమైనట్టేనా..?
-
AP Government: ముగ్గురు పిల్లలున్న కుటుంబాలకు రూ.5 వేలు.. ప్రోత్సాహకాలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం..
-
Chairman’s Desk : సీఎం స్పీడుని మంత్రులు అందుకోవడం లేదా..? ప్రతిపక్షాల గళం పదునెక్కుతోందా..?
ట్రెండింగ్
-
Chanakya Neeti : చాణక్య హెచ్చరిక.. ఇలాంటి వారిని పెళ్లి చేసుకోకండి.!
-
Gardening Tips : మీ గులాబీ మొక్కలు వాడిపోతున్నాయా? మీరు చేసే ఈ 4 తప్పులే దానికి కారణం!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వచ్చే రోగాలకు బై..బై.. 5 అద్భుతమైన ఇంటి చిట్కాలు.!
-
IND Playing XI vs ENG: మూడో టీ20లో ఈ ముగ్గురు ఔట్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!
-
Ellyse Perry: లార్డ్స్లో ఇంగ్లండ్ను ఓడించాం.. ఆ మజానే వేరప్ప.. ఆస్ట్రేలియా అందం ఆనందం!