బ్యాంకుల పని వేళలు కుదించేశారు..!
కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తున్న సమయంలో.. నియంత్రణ చర్యలకు పూనుకున్న ఆయా రాష్ట్రాలు.. లాక్డౌన్ అమలు చేస్తున్నాయి.. మరికొన్ని రాష్ట్రాలు.. కర్ఫ్యూ, కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి.. దీంతో.. బ్యాంకింగ్ సేవలకు అంతరాయం ఏర్పడుతోంది.. ఈ సమయంలో.. దేశీయ బ్యాంకులు పని వేళలు కుదించాయి.. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) మార్గదర్శకాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాయి బ్యాంకులు.. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకే బ్యాంకింగ్ సమయం ఉండాలని ఐబీఏ సూచించిచగా.. ఈ మార్గదర్శకాలు ఈ నెలాఖరు వరకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులకు వర్తింపజేయనున్నారు.. అయితే, వినియోగదారులకు క్యాష్ విత్ డ్రాయల్స్, డిపాజిట్లు, ప్రభుత్వ బిజినెస్లు, చెల్లింపులు అనే నాలుగు తప్పనిసరి సేవలను అందించాలని ఐబీఏ పేర్కొంది.. పరిస్థితులకు అనుగుణంగా ఖాతాదారులకు అదనపు సేవలను అందించే విషయంలో.. రాష్ట్ర స్థాయి లేదా కేంద్ర పాలిత ప్రాంతాల స్థాయీ బ్యాంకింగ్ కమిటీలు నిర్ణయం తీసుకోవచ్చని సూచిచింది.
మరోవైపు.. కరోనా సమయంలో.. బ్యాంకింగ్ సిబ్బందిని కూడా తగ్గించాలని సూచించింది.. రొటేషనల్ ప్రాతిపతికన విధులకు హాజరు కావాలని పేర్కొన్న ఐబీఏ… వర్క్ ఫ్రం హోం అనుమతించాలని సూచిచింది.. 50 శాతం ఉద్యోగులు రొటేషనల్ ప్రాతిపదికన విధులకు హాజరు కావాలని స్పష్టం చేసింది.. కాగా, ఇప్పటికే ప్రభుత్వ రంగ అతిపెద్ద బ్యాంక్ ఎస్బీఐ.. తన శాఖల పని వేళలను మార్చేసింది. తమ ఖాతాదారులు తప్పనిసరి అవసరమైతేనే బ్యాంకు శాఖలను సందర్శించాలని సూచిచింది.. ఈనెలాఖరు వరకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బ్యాంకింగ్ సేవలను అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.
Also Read
- Today Gold and Silver Prices: బంగారం ధరల మంటలు.. నేడు మళ్లీ భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్
- Bank Holiday May 2026: మే నెలలో భారీగా బ్యాంకు సెలవులు.. మొత్తం ఎన్నిరోజులంటే?
- Aadhaar Card: మీకు ఇది తెలుసా? మీ ఆధార్ కార్డు మీ పుట్టిన తేదీకి గ్యారెంటీ కాదట! ఎందుకో తెలుసా..
- Stock Market Crash: రెండు గంటల్లోనే రూ.3.7 లక్షల కోట్లు లాస్.. ఇన్వెస్టర్లను ముంచేసిన మంగళవారం!
తాజావార్తలు
-
Ramya Krishna : రేపు పెళ్లి అనంగా.. రాత్రి 2 వరకు ఎన్టీఆర్ తోనే ఉన్న..!
-
Donald Trump: ట్రంప్ను రోస్ట్ చేసిన కింగ్ చార్లెస్.. మేము లేకపోతే మీరు ఫ్రెంచ్ మాట్లాడేవారంటూ ఎగతాళి
-
KTR: కేసీఆర్ అప్పుడే చిలుకకు చెప్పినట్టు చెప్పారు.. కల్వకుర్తి సభను గుర్తు చేసిన కేటీఆర్..
-
Uttam Kumar Reddy: ప్రాణహిత-చేవెళ్లపై వెనక్కి తగ్గేదే లేదు! తుమ్మిడిహట్టి ప్రతిపాదనలపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన
-
Malla Reddy: పార్టీ మార్పుపై మాజీ మంత్రి మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో