New Rules: కేంద్ర బడ్జెట్ వేళ.. రేపటి నుంచి మారనున్న రూల్స్ ఇవే!
- ఫిబ్రవరి 1 నుంచి కొత్త రూల్స్
- బ్యాంకింగ్, యూపీఐ రూల్స్ మారనున్నాయి
- గ్యాస్ ధరలను సవరించనున్న చమురు కంపెనీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ ప్రజల చూపంతా ఇప్పుడు కేంద్రం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ పైనే ఉంది. ఏయే రంగాలకు ఎంత కేటాయిస్తారు? వస్తువుల ధరలు పెరుగుతాయా? తగ్గుతాయా? బంగారం ధరల పరిస్థితి ఏంటి అంటూ చర్చలు మొదలయ్యాయి. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర బడ్జెట్ వేళ రేపటి నుంచి కొన్ని రూల్స్ మారనున్నాయి. ప్రతి నెల మాదిరిగానే ఫిబ్రవరి నెలలో కూడా బ్యాంకింగ్, యూపీఐ, గ్యాస్ వంటి వాటిల్లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఆర్థికపరమైన అంశాల్లో కొత్త నిబంధనలు ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
బ్యాంకింగ్ రూల్స్:
Also Read
- RBI MPC 2026: ఆర్బీఐ కీలక నిర్ణయం.. రెపో రేటు 5.25 శాతం వద్దే కొనసాగింపు.. హోమ్, పర్సనల్ లోన్స్ EMIలపై ఎలాంటి ప్రభావం?
- UPI Charges: రూ.2,000 దాటిన UPI చెల్లింపులపై ఛార్జీలు? ఎవరు చెల్లించాలి.. ఎలాంటి లావాదేవీలకు వర్తిస్తాయంటే?
- Liquor Ban: ఏంటి! ఇన్ని రోజులు "బ్రాండెడ్ విషం" తాగారా? ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్ సహా ఈ బ్రాండ్ల గుట్టు రట్టు..
- FSSAI Action Against Dabur: 145 ఏళ్ల డాబర్కు షాక్.. ఎఫ్ఎస్ఎస్ఏఐ కఠిన చర్యలు..! కుప్పకూలిన షేర్లు..
ప్రతి నెల 1న బ్యాంకులు కొత్త రూల్స్ ను తీసుకొస్తుంటాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్ ఫిబ్రవరి 1 నుంచి కొన్ని మార్పులను తీసుకొస్తోంది. వాటిల్లో ఏటీఎం ట్రాన్సాక్షన్స్ ఉచిత పరిమితిని తగ్గించడం, ఇతర ఛార్జీలను పెంచనున్నట్లు బ్యాంక్ వర్గాలు వెల్లడించాయి.
LPG సిలిండర్ ధరలలో మార్పు:
చమురు సంస్థలు ప్రతి నెల 1వ తేదీన ధరలను సవరిస్తుంటాయి. ఈ మార్పు కోట్లాది మంది ప్రజల ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపిస్తాయి. అయితే ఎల్పీజీ గ్యాస్ ధరలు పెరగొచ్చు లేదా తగ్గొచ్చు. లేదా స్థిరంగా కూడా ఉండొచ్చు.
UPI కొత్త రూల్స్:
ఫిబ్రవరి 1 నుంచి యూపీఐ పేమెంట్స్ లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. స్పెషల్ క్యారెక్టర్లు కలిగిన యూపీఐ ఐడీలను ఆమోదించరు. @,#,$,%,,&.. ఇలాంటి ప్రత్యేక అక్షరాలు కలిగిన ట్రాన్సాక్షన్స్ ను రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఆల్ఫా-న్యూమరిక్ (అక్షరాలు, సంఖ్యలు) లావాదేవీ IDలు మాత్రమే చెల్లుబాటు అవుతాయి.
మారుతీ సుజుకీ కార్ల ధరలు పెంపు:
ఫిబ్రవరి 1 నుంచి వాహన ప్రియులకు మారుతీ సుజుకి షాకివ్వబోతోంది. రేపటి నుంచి పలు మోడళ్ల ధరలను భారీగా పెంచుతున్నట్లు ప్రకటించింది. విడిభాగాలు, నిర్వహణా వ్యయం కారణంగా మారుతీ సుజుకీ కార్ల ధరలను భారీగా పెంచుతున్నట్లు వెల్లడించింది. Alto K10, S-Presso, Celerio, Wagon R, Swift, DZire, Brezza, Ertiga, Ignis, Baleno, Ciaz, XL6, FrontX, Invicto, Jimny, Grand Vitara మోడళ్ల ధరలు మారనున్నాయి.
తాజావార్తలు
-
Karikala First Look: సందీప్ కిషన్ ‘కరికాల’ ఫస్ట్ లుక్ అదిరింది!.. ఇలాంటి అవతార్లో ఎప్పుడూ చూడలే..
-
Mohammad Amir-IPL 2027: పాక్ స్టార్ మహ్మద్ అమీర్కు లైన్ క్లియర్.. ఇక ఐపీఎల్ 2027లో ఆడతాడా?
-
Telangana Launches Dial 112: 100కు గుడ్బై! ఇక పోలీస్, అంబులెన్స్, ఫైర్.. అన్నింటికీ ఒకే నంబర్..
-
Tamil Nadu Budget 2026: జెన్-జెడ్ విద్యార్థులపై ప్రభుత్వం వరాల జల్లు.. గోల్డ్ కాయిన్స్, పట్టు చీరలు, సైకిళ్ల పంపిణీ..!
-
రికార్డుల మోత..! The Hundredలో పరుగుల సునామీ.. ఒక్క మ్యాచ్లో 31 సిక్సర్లు, 445 పరుగులు..
ట్రెండింగ్
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!