New Rules: కేంద్ర బడ్జెట్ వేళ.. రేపటి నుంచి మారనున్న రూల్స్ ఇవే!
- ఫిబ్రవరి 1 నుంచి కొత్త రూల్స్
- బ్యాంకింగ్, యూపీఐ రూల్స్ మారనున్నాయి
- గ్యాస్ ధరలను సవరించనున్న చమురు కంపెనీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ ప్రజల చూపంతా ఇప్పుడు కేంద్రం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ పైనే ఉంది. ఏయే రంగాలకు ఎంత కేటాయిస్తారు? వస్తువుల ధరలు పెరుగుతాయా? తగ్గుతాయా? బంగారం ధరల పరిస్థితి ఏంటి అంటూ చర్చలు మొదలయ్యాయి. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర బడ్జెట్ వేళ రేపటి నుంచి కొన్ని రూల్స్ మారనున్నాయి. ప్రతి నెల మాదిరిగానే ఫిబ్రవరి నెలలో కూడా బ్యాంకింగ్, యూపీఐ, గ్యాస్ వంటి వాటిల్లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఆర్థికపరమైన అంశాల్లో కొత్త నిబంధనలు ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
బ్యాంకింగ్ రూల్స్:
Also Read
- NPS Premature Exit: NPS ఖాతా నుంచి మొత్తం డబ్బు విత్డ్రా.. కేవలం 5 నిమిషాలే..! ఎవరికి అవకాశం?
- ESIC Scheme: డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లకు గుడ్న్యూస్.. గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా సహా పలు ప్రయోజనాలు!
- Family Vacation: యూరప్ను తలపించేలా నేపాల్ గ్రామాలు.. తక్కువ బడ్జెట్లో ఫ్యామిలీ ట్రిప్కు బెస్ట్!
- Rules Changes: సామాన్యుడికి జూలై షాక్.. 1వ తేదీ నుంచే ఈ 5 కీలక మార్పులు
ప్రతి నెల 1న బ్యాంకులు కొత్త రూల్స్ ను తీసుకొస్తుంటాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్ ఫిబ్రవరి 1 నుంచి కొన్ని మార్పులను తీసుకొస్తోంది. వాటిల్లో ఏటీఎం ట్రాన్సాక్షన్స్ ఉచిత పరిమితిని తగ్గించడం, ఇతర ఛార్జీలను పెంచనున్నట్లు బ్యాంక్ వర్గాలు వెల్లడించాయి.
LPG సిలిండర్ ధరలలో మార్పు:
చమురు సంస్థలు ప్రతి నెల 1వ తేదీన ధరలను సవరిస్తుంటాయి. ఈ మార్పు కోట్లాది మంది ప్రజల ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపిస్తాయి. అయితే ఎల్పీజీ గ్యాస్ ధరలు పెరగొచ్చు లేదా తగ్గొచ్చు. లేదా స్థిరంగా కూడా ఉండొచ్చు.
UPI కొత్త రూల్స్:
ఫిబ్రవరి 1 నుంచి యూపీఐ పేమెంట్స్ లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. స్పెషల్ క్యారెక్టర్లు కలిగిన యూపీఐ ఐడీలను ఆమోదించరు. @,#,$,%,,&.. ఇలాంటి ప్రత్యేక అక్షరాలు కలిగిన ట్రాన్సాక్షన్స్ ను రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఆల్ఫా-న్యూమరిక్ (అక్షరాలు, సంఖ్యలు) లావాదేవీ IDలు మాత్రమే చెల్లుబాటు అవుతాయి.
మారుతీ సుజుకీ కార్ల ధరలు పెంపు:
ఫిబ్రవరి 1 నుంచి వాహన ప్రియులకు మారుతీ సుజుకి షాకివ్వబోతోంది. రేపటి నుంచి పలు మోడళ్ల ధరలను భారీగా పెంచుతున్నట్లు ప్రకటించింది. విడిభాగాలు, నిర్వహణా వ్యయం కారణంగా మారుతీ సుజుకీ కార్ల ధరలను భారీగా పెంచుతున్నట్లు వెల్లడించింది. Alto K10, S-Presso, Celerio, Wagon R, Swift, DZire, Brezza, Ertiga, Ignis, Baleno, Ciaz, XL6, FrontX, Invicto, Jimny, Grand Vitara మోడళ్ల ధరలు మారనున్నాయి.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!