SBI: గుడ్న్యూస్ చెప్పిన ఎస్బీఐ.. వారికి మాత్రమే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది.. ఇప్పటి వరకు వరుసగా వడ్డీ రేట్లు పెంచుతూ.. నెలవారి చెల్లించే.. గృహ, వాహన, ఇతర రుణాలపై భారం మోపుతూ వచ్చిన ఎస్బీఐ.. ఇప్పుడు సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్లపై వడ్డీ రేటును పెంచింది.. అయితే, అందులో కూడా ఓ మెలిక ఉంది.. వేలు, లక్షల్లో కాకుండా కోట్లలో పొదుపు చేసేవారికే లబ్ధిచేకూరనుంది.. రూ.10 కోట్ల లేదా అంతకన్నా ఎక్కువగా ఉన్న సేవింగ్ డిపాజిట్లపై 0.30 శాతం(30 బీపీఎస్) ఇంట్రెస్ట్ రేటును పెంచుతూ నిర్ణయాన్ని ప్రకటించింది ఎస్బీఐ.. ఇక, రూ.10 కోట్ల కన్నా తక్కువగా ఉన్న డిపాజిట్లపై మాత్రం వడ్డీ రేటులో ఎలాంటి మార్పులేదని స్పష్టం చేసింది.. కాగా, రూ.10 కోట్ల కన్నా తక్కువ డిపాజిట్లపై ప్రస్తుతం 2.70 శాతం ఇంట్రెస్ట్ రేట్ ఉండగా.. ఇప్పుడు అది 0.30 బీపీఎస్ పెరగనుంది.. పెంచిన వడ్డీరేట్లు అక్టోబర్ 15వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు ఎస్బీఐ పేర్కొంది.
Read Also: Gujarat: షాకింగ్ ఘటన.. డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో వ్యక్తి మృతి
Also Read
- PM Kisan Yojana: పీఎం కిసాన్ యోజన మొత్తం పెంపుపై కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ క్లారిటీ.. 24వ వాయిదాకు ముందు కీలక అప్డేట్
- CKYC: బ్యాంకు కస్టమర్స్ కు అలర్ట్.. మీ CKYC నంబర్ తెలుసా?.. ఇలా తెలుసుకోండి
- Stock Market: TCS దూకుడు మామూలుగా లేదుగా.. ఒక్క వారంలోనే రూ.72,000 కోట్ల లాభం!
- Upcoming IPO 2026: వచ్చే వారం 7 ఐపీఓలు ప్రారంభం.. ఏ కంపెనీ IPOలో పెట్టుబడి అవకాశాలు ఎక్కువ?
కాగా, రెండు రోజుల క్రితం, ఎస్బీఐ హోమ్ లోన్ విభాగంలో అగ్రస్థానంలో కొనసాగుతోందని మరియు నిర్వహణలో 6 ట్రిలియన్ల ఆస్తులు ఉన్నాయని… ఈ మైలురాయిని చేరుకున్న సమయంలో పండుగ బొనాంజాను ప్రకటించింది ఎస్బీఐ.. అందులో భాగంగా ఎస్బీఐ గృహ రుణాలపై 0.25 శాతం, టాప్ అప్ లోన్లపై 0.15 శాతం మరియు ఆస్తిపై రుణంపై 0.30 శాతం వరకు రాయితీని అందిస్తుంది. 31 జనవరి 2023 వరకు గృహ రుణాలపై ప్రాసెసింగ్ రుసుములను మాఫీ చేయడం ద్వారా మరో తీపికబురు చెప్పింది.. జూన్ 30, 2022 నాటికి, బ్యాంక్ డిపాజిట్ బేస్ రూ. 40.46 లక్షల కోట్లు సీఏఎస్ఏ నిష్పత్తి 45.33 శాతం మరియు అడ్వాన్స్లు రూ. 29 లక్షల కోట్లు. గృహ రుణాలు మరియు వాహన రుణాలలో ఎస్బీఐ వరుసగా 33.3 శాతం మరియు 19.3 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. ఎస్బీఐ భారతదేశంలో 67,735 బీసీ అవుట్లెట్లతో 22,294 శాఖలు మరియు 65,561 ఏటీఎంలు.. ఇలా అతిపెద్ద నెట్వర్క్ను కలిగి ఉన్న విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
NBK : ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్కు బాలయ్య.. షూటింగ్ కు బ్రేక్
-
India Test Squad: శ్రీలంకతో టెస్టు సిరీస్.. టీమిండియాలోకి మరో కొత్త ప్లేయర్!
-
CM Vijay and Trisha Controversy: ఆలయ ఉత్సవాల్లో త్రిష, విజయ్ ఫొటోలతో వివాదాస్పద ఫ్లెక్సీ.. ఇద్దరిపై కేసు
-
Yamaha Electric Scooter: యమహా నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. కీ-లెస్ ఇగ్నిషన్, మార్చుకోగల బ్యాటరీతో త్వరలో ఎంట్రీ?
-
Lalit Kumar Modi: ఐపీఎల్ 2009 ఫెమా కేసులో క్లీన్ చిట్.. ఆనందంతో డాన్స్ చేస్తూ రచ్చ రచ్చ.!
ట్రెండింగ్
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్టాప్లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!