SBI: గుడ్న్యూస్ చెప్పిన ఎస్బీఐ.. వారికి మాత్రమే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది.. ఇప్పటి వరకు వరుసగా వడ్డీ రేట్లు పెంచుతూ.. నెలవారి చెల్లించే.. గృహ, వాహన, ఇతర రుణాలపై భారం మోపుతూ వచ్చిన ఎస్బీఐ.. ఇప్పుడు సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్లపై వడ్డీ రేటును పెంచింది.. అయితే, అందులో కూడా ఓ మెలిక ఉంది.. వేలు, లక్షల్లో కాకుండా కోట్లలో పొదుపు చేసేవారికే లబ్ధిచేకూరనుంది.. రూ.10 కోట్ల లేదా అంతకన్నా ఎక్కువగా ఉన్న సేవింగ్ డిపాజిట్లపై 0.30 శాతం(30 బీపీఎస్) ఇంట్రెస్ట్ రేటును పెంచుతూ నిర్ణయాన్ని ప్రకటించింది ఎస్బీఐ.. ఇక, రూ.10 కోట్ల కన్నా తక్కువగా ఉన్న డిపాజిట్లపై మాత్రం వడ్డీ రేటులో ఎలాంటి మార్పులేదని స్పష్టం చేసింది.. కాగా, రూ.10 కోట్ల కన్నా తక్కువ డిపాజిట్లపై ప్రస్తుతం 2.70 శాతం ఇంట్రెస్ట్ రేట్ ఉండగా.. ఇప్పుడు అది 0.30 బీపీఎస్ పెరగనుంది.. పెంచిన వడ్డీరేట్లు అక్టోబర్ 15వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు ఎస్బీఐ పేర్కొంది.
Read Also: Gujarat: షాకింగ్ ఘటన.. డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో వ్యక్తి మృతి
Also Read
- Gold and Silver Price: ఇన్వెస్టర్లకు షాక్.. వచ్చే వారం భారీగా మారనున్న గోల్డ్, సిల్వర్ ధరలు! ఎందుకో తెలుసా?
- Bank Holidays: జూలైలో బ్యాంక్లకు ఏకంగా 12 రోజులు హాలిడేస్.. ఏ ఏ రోజుల్లో సెలవులు ఉన్నాయో క్లియర్గా తెలుసుకోండి!
- Zero Income Tax: జీతం రూ.20 లక్షలు.. అయినా ట్యాక్స్ కట్టేది సున్నా.. సీఏ చెప్పిన సీక్రెట్ ఇదే..
- Stock market: 4 రోజులు.. రూ.88,000 కోట్ల ప్రాఫిట్! స్టాక్ మార్కెట్ను షేక్ చేసిన ఆరు టాప్ కంపెనీలు ఇవే..
కాగా, రెండు రోజుల క్రితం, ఎస్బీఐ హోమ్ లోన్ విభాగంలో అగ్రస్థానంలో కొనసాగుతోందని మరియు నిర్వహణలో 6 ట్రిలియన్ల ఆస్తులు ఉన్నాయని… ఈ మైలురాయిని చేరుకున్న సమయంలో పండుగ బొనాంజాను ప్రకటించింది ఎస్బీఐ.. అందులో భాగంగా ఎస్బీఐ గృహ రుణాలపై 0.25 శాతం, టాప్ అప్ లోన్లపై 0.15 శాతం మరియు ఆస్తిపై రుణంపై 0.30 శాతం వరకు రాయితీని అందిస్తుంది. 31 జనవరి 2023 వరకు గృహ రుణాలపై ప్రాసెసింగ్ రుసుములను మాఫీ చేయడం ద్వారా మరో తీపికబురు చెప్పింది.. జూన్ 30, 2022 నాటికి, బ్యాంక్ డిపాజిట్ బేస్ రూ. 40.46 లక్షల కోట్లు సీఏఎస్ఏ నిష్పత్తి 45.33 శాతం మరియు అడ్వాన్స్లు రూ. 29 లక్షల కోట్లు. గృహ రుణాలు మరియు వాహన రుణాలలో ఎస్బీఐ వరుసగా 33.3 శాతం మరియు 19.3 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. ఎస్బీఐ భారతదేశంలో 67,735 బీసీ అవుట్లెట్లతో 22,294 శాఖలు మరియు 65,561 ఏటీఎంలు.. ఇలా అతిపెద్ద నెట్వర్క్ను కలిగి ఉన్న విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!