Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News As Deadline To Run Bullet Train Is Coming Near India Has A Deadlock With Japan

Bullet Train Project: మోడీ కలల ప్రాజెక్ట్ “బుల్లెట్ రైలు”కు.. జపాన్ అడ్డంకి!

Published Date :October 1, 2024 , 4:05 pm
By RAMAKRISHNA KENCHE
  • మోడీ కలల ప్రాజెక్ట్ "బుల్లెట్ రైలు"
  • ముంబై - అహ్మదాబాద్ మధ్య నిర్మిస్తున్న బుల్లెట్ రైలు ప్రాజెక్టు
  • దగ్గరపడుతున్న గడువు
  • భారత్‌-జపాన్ మధ్య పలు అంశాల్లో ప్రతిష్టంభన
Bullet Train Project: మోడీ కలల ప్రాజెక్ట్ “బుల్లెట్ రైలు”కు.. జపాన్ అడ్డంకి!
  • Follow Us :
  • google news
  • dailyhunt

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కలల ప్రాజెక్టుకు చిక్కులు తప్పేలా కనిపిస్తున్నాయి. ముంబై – అహ్మదాబాద్ మధ్య నిర్మిస్తున్న బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు సంబంధించి జపాన్, భారతదేశంలో చాలా విషయాలపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. “ది హిందూ”లో వచ్చిన కథనం ప్రకారం.. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ నేతృత్వంలోని అధికారుల బృందం ఇటీవల జపాన్‌కు మూడు రోజుల పర్యటనకు వెళ్లింది. ఈ సందర్భంగా పలు అంశాలు చర్చకు వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ ప్రాజెక్ట్ కోసం జపాన్ తన కంపెనీల నుంచి రైలు సెట్లు, సిగ్నలింగ్ వ్యవస్థలను కొనుగోలు చేయాలని కోరుతోంది. అలాగే.. ప్రాజెక్టు వ్యయం, పూర్తి చేసే సమయానికి సంబంధించి ఇరుపక్షాల మధ్య ఏకాభిప్రాయం లేదని సమాచారం. 2027లో ముంబై-అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలు నడపాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

జపాన్‌కు అధికారుల పరుగులు..
రైల్వే బోర్డు సభ్యుడు అనిల్ కుమార్ ఖండేల్వాల్, నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ వివేక్ కుమార్ గుప్తా కూడా వైష్ణవ్‌తో పాటు జపాన్ వెళ్లారు. వార్షిక సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోడీ కూడా ఈ ఏడాది చివర్లో టోక్యోలో పర్యటించనున్నారు. 508 కిలోమీటర్ల పొడవునా బుల్లెట్ ప్రాజెక్టు కోసం గుజరాత్, మహారాష్ట్రల్లో భూసేకరణ పనులు పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. 215 కిలోమీటర్ల మేర వయాడక్ట్ పనులు కూడా పూర్తయ్యాయి. కానీ.. భారతదేశం, జపాన్ మధ్య రోలింగ్ స్టాక్ అంటే రైలు సెట్లు, సిగ్నల్ సిస్టమ్‌లను సరఫరా చేయడానికి అయ్యే ఖర్చుకు సంబంధించి చర్యలు మందగించాయని సమాచారం.

Also Read

  • Salary Delay: సారీ బాస్.. ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్! ఈసారి 'ఫస్ట్'కు శాలరీ రాదు.. ఎందుకో తెలుసా?
  • Sun Pharma: అమెరికా గడ్డపై భారత ఫార్మా జెండా.. లక్ష కోట్లతో దిగ్గజ కంపెనీని కొనుగోలు చేసిన సన్ ఫార్మా!
  • Ola Electric Share: ఒక్కప్పుడు రారాజు.. ఇప్పుడు బికారి! ఓలా ఎలక్ట్రిక్ రూ.157 నుంచి రూ.20 కి?
  • Stock Market: కోలుకున్న మార్కెట్.. భారీ లాభాల్లో సూచీలు

ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుంది..
ఈ ప్రాజెక్ట్ కోసం జపాన్ అన్ని రకాల సాంకేతిక మద్దతు, సాంకేతికతను అందిస్తోంది. అయితే దాని షరతు ఏమిటంటే సిగ్నలింగ్ సిస్టమ్, రైలు సెట్‌లను జపాన్ కంపెనీల నుంచి మాత్రమే కొనుగోలు చేయాలి. జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ యొక్క రుణ నిబంధనల ప్రకారం.. కవాసకి, హిటాచీ వంటి జపాన్ కంపెనీలు మాత్రమే ఈ టెండర్లు వేసేందుకు అవకాశం ఉంది. పెరుగుతున్న ప్రాజెక్ట్ వ్యయంపై ఏకాభిప్రాయం లేదు. దీని కోసం మొత్తం బడ్జెట్ రూ.1.08 లక్షల కోట్లు కాగా అందులో ఇప్పటికే రూ.60,372 కోట్లు ఖర్చు చేశారు.

వ్యయం పెరిగే అవకాశం..
ఇందులో ఎక్కువ భాగం మౌలిక సదుపాయాల కల్పనకే వెచ్చించారు. ఇది రైలు సెట్‌లను కొనుగోలు చేయడానికి, సిగ్నలింగ్ సిస్టమ్‌ల ఇన్‌స్టాలేషన్‌కు ఖర్చులు పెరగనున్నట్లు సమాచారం. దీన్ని బట్టి ప్రాజెక్టు వ్యయం మరింత పెరిగే అవకాశం ఉందని స్పష్టమవుతోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. షింకన్‌సెన్ టెక్నాలజీపై ఆధారపడిన జపాన్ రైలు సరిగ్గా 60 సంవత్సరాల క్రితం అక్టోబర్ 1, 1964న ప్రారంభించబడింది. ఇది ముంబయి నుంచి అహ్మదాబాద్‌కు దాదాపు మూడు గంటల్లో దూరాన్ని చేరుతుందని అంచనా. ఈ ఏడాది ప్రారంభంలో… సూరత్- బిలిమోరా మధ్య బుల్లెట్ రైలు 2026లో ప్రారంభమవుతుందని వైష్ణవ్ పేర్కొన్నారు. అయితే ఈ గడువు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bullet Train
  • bullet train project
  • Business
  • deadline
  • deadlock

తాజావార్తలు

  • Mohini: దర్శకుడి బలవంతం.. భర్తే చేతబడి చేయించాడు ‘ఆదిత్య 369’ నటి మోహిని కన్నీటి గాథ!

  • Moringa Chutney Recipe: క్షణాల్లో కారం కారంగా మునగ చట్నీ తయారు చేయండి.. రుచితో పాటు పుష్కలమైన విటమిన్లు మీ సొంతం!

  • Raghav Chadha vs AAP: ఎంపీని చేయకపోతే పెళ్లి అయ్యేదా? రాఘవ్ చద్దాపై ఆప్ ధ్వజం

  • Rava Paratha Recipe: రెగ్యులర్ బ్రేక్‌ఫాస్ట్ బోర్ కొట్టిందా..? 10 నిమిషాల్లో మెత్తటి రవ్వ పరాఠాలు ఇలా తయారు చేయండి

  • KING 100 : దాదాపు 20 ఏళ్ల తర్వాత నాగ్ సరసన టబు.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషి

ట్రెండింగ్‌

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions