Tim Cook: ఆపిల్ లేఆఫ్స్పై సీఈఓ టిమ్ కుక్ కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tim Cook: ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులు టెక్ సంస్థల్ని, దాని ఉద్యోగులను కలవరపెడుతున్నాయి. ఆర్థికమాంద్యం భయాలు, ఆర్థిక మందగమనం పలు కంపెనీల ఆదాయాలు తగ్గేందుకు కారణం అయ్యాయి. దీంతో ఖర్చులను తగ్గించుకునేందుకు కంపెనీలు పెద్ద ఎత్తు ఉద్యోగాలను తొలగిస్తున్నాయి. ఇప్పటికే దిగ్గజ ఐటీ కంపెనీలు మాస్ లేఆఫ్స్ ను ప్రకటించాయి. గూగుల్, ట్విట్టర్, మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్ తో పాటు అనేక ఐటీ కంపెనీలు నిర్ధాక్షిణ్యంగా ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి.
Read Also: Currency Notes In Drain : మురికి కాల్వలో కరెన్సీ నోట్లు.. వీడియో చూస్తే మీరు షాకే..
Also Read
- Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా 'Rupee'.. పతనానికి అసలు కారణం ఇదే..
- CarryMen: 'మీరు షాపింగ్ చేయండి, మీ బ్యాగులు మేము మోస్తాం'.. మార్కెట్లలో షాపింగ్ అసిస్టెన్స్ సర్వీస్..
- Meta layoffs: మెటాలో భారీగా ఉద్యోగాల కోతలు.. తెల్లవారుజామున 4 గంటలకు మెయిల్స్!
- New Labor Laws India: వారానికి 4 రోజులే పని.. 3 రోజులు సెలవులు! కానీ కండిషన్స్ అప్లై..
ఇదిలా ఉంటే ఆపిల్ సంస్థ కూడా త్వరలో లేఆఫ్స్ ప్రకటిస్తుందనే వార్తల నేపథ్యంలో ఆ సంస్థ సీఈఓ టిక్ కుక్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ సంస్థ ఉద్యోగులను తొలగించే ఆలోచన లేదని స్పష్టం చేశారు. అయితే కంపెనీ చివరి ప్రయత్నంలో మాత్రమే ఉద్యోగులను తొలగిస్తుందని ఆయన తెలిపారు. CNBCకి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను వెల్లడించారు. ఆపిల్ కంపెనీ ఖర్చలను తగ్గించుకునేందుకు మార్గాలను అన్వేషిస్తోందని వివరించారు. ఉద్యోగులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగులను తీసేసే బదులు ఇటీవల కాలంలో నియామక ప్రక్రియను తగ్గించుకున్నట్లు వెల్లడించారు.
కరోనా సమయంలో ఇతర టెక్ కంపెనీలు చేసిన విధంగా పెద్ద ఎత్తున ఉద్యోగులును నియమించుకోలేదు. దీంతోనే ప్రస్తుతం ఇది మెరుగైన స్థితిలో ఉంది. ఏప్రిల్ నెలలో మాత్రం తక్కువ సంఖ్యలో కార్పొరేట్ రిటైల్ డివిజన్ ఉద్యోగులను తొలగించింది. ఇలాంటి సవాళ్ల మధ్య యాపిల్ మార్చి త్రైామాసికంలో 98.8 బిలియన్ డాలర్ల రికార్డు ఆదాయాన్ని నమోదు చేసింది. ఇందులో ఎక్కువగా ఐఫోన్ అమ్మకాల ద్వారానే వచ్చాయి. వీటి వల్లే 51.3 బిలియన్ డాలర్లు వచ్చాయి. భారత్ లో కూడా కంపెనీ రికార్డ్ ఆదాయాన్ని నమోదు చేసింది. ఇటీవల భారత్ వచ్చిన టిమ్ కుక్, ముంబై, ఢిల్లీలో రిటైల్ స్టోర్లను ప్రారంభించారు. ప్రధాని మోదీతో పాటు మంత్రి అశ్విని వైష్ణవ్ తో భేటీ అయ్యారు. భారత్ లో ఆపిల్ పెట్టుబడుల గురించి చర్చించారు.
తాజావార్తలు
-
Twisha Sharma: దేహమంతా గాయాలే.. తెలుగు నటి పోస్ట్మార్టంలో షాకింగ్ విషయాలు
-
Dhurandhar-2: ‘ధురంధర్ 2’ దేశ భద్రతకు ముప్పా? కేంద్రానికి హై కోర్టు కీలక ఆదేశాలు..
-
Indian Railways: రైళ్లలో వరుస అగ్నిప్రమాదాలు.. కుట్రదారులెవరో బయటపెట్టిన రైల్వే శాఖ
-
AP Crime: ప్రేమ పేరుతో వివాహితకు వేధింపులు.. యువకుడికి గుండు కొట్టి ఊరేగించిన స్థానికులు..!
-
NTR: ఎన్టీఆర్ ఇంట్లోకి కొత్త అతిథులు.. జపాన్ పేర్లు ఎందుకు పెట్టారో తెలుసా?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!