Tim Cook: ఆపిల్ లేఆఫ్స్పై సీఈఓ టిమ్ కుక్ కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tim Cook: ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులు టెక్ సంస్థల్ని, దాని ఉద్యోగులను కలవరపెడుతున్నాయి. ఆర్థికమాంద్యం భయాలు, ఆర్థిక మందగమనం పలు కంపెనీల ఆదాయాలు తగ్గేందుకు కారణం అయ్యాయి. దీంతో ఖర్చులను తగ్గించుకునేందుకు కంపెనీలు పెద్ద ఎత్తు ఉద్యోగాలను తొలగిస్తున్నాయి. ఇప్పటికే దిగ్గజ ఐటీ కంపెనీలు మాస్ లేఆఫ్స్ ను ప్రకటించాయి. గూగుల్, ట్విట్టర్, మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్ తో పాటు అనేక ఐటీ కంపెనీలు నిర్ధాక్షిణ్యంగా ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి.
Read Also: Currency Notes In Drain : మురికి కాల్వలో కరెన్సీ నోట్లు.. వీడియో చూస్తే మీరు షాకే..
Also Read
- MS Dhoni: ఎంఎస్ ధోనీ కొత్త బిజినెస్కు బంపర్ బూస్ట్.. కోట్లలో నిధులు సమీకరణ!
- Gold and Silver Price: ఆషాడంలో కూడా తగ్గట్లేవుగా బంగారం.. భారీగా పెరిగిన ధరలు
- LIC Smart Pension Plan: ఒక్కసారి పెట్టుబడి.. జీవితాంతం పింఛన్.. స్మార్ట్ పెన్షన్ ప్లాన్ పూర్తి వివరాలు
- PM Kisan Yojana: పీఎం కిసాన్ యోజన మొత్తం పెంపుపై కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ క్లారిటీ.. 24వ వాయిదాకు ముందు కీలక అప్డేట్
ఇదిలా ఉంటే ఆపిల్ సంస్థ కూడా త్వరలో లేఆఫ్స్ ప్రకటిస్తుందనే వార్తల నేపథ్యంలో ఆ సంస్థ సీఈఓ టిక్ కుక్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ సంస్థ ఉద్యోగులను తొలగించే ఆలోచన లేదని స్పష్టం చేశారు. అయితే కంపెనీ చివరి ప్రయత్నంలో మాత్రమే ఉద్యోగులను తొలగిస్తుందని ఆయన తెలిపారు. CNBCకి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను వెల్లడించారు. ఆపిల్ కంపెనీ ఖర్చలను తగ్గించుకునేందుకు మార్గాలను అన్వేషిస్తోందని వివరించారు. ఉద్యోగులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగులను తీసేసే బదులు ఇటీవల కాలంలో నియామక ప్రక్రియను తగ్గించుకున్నట్లు వెల్లడించారు.
కరోనా సమయంలో ఇతర టెక్ కంపెనీలు చేసిన విధంగా పెద్ద ఎత్తున ఉద్యోగులును నియమించుకోలేదు. దీంతోనే ప్రస్తుతం ఇది మెరుగైన స్థితిలో ఉంది. ఏప్రిల్ నెలలో మాత్రం తక్కువ సంఖ్యలో కార్పొరేట్ రిటైల్ డివిజన్ ఉద్యోగులను తొలగించింది. ఇలాంటి సవాళ్ల మధ్య యాపిల్ మార్చి త్రైామాసికంలో 98.8 బిలియన్ డాలర్ల రికార్డు ఆదాయాన్ని నమోదు చేసింది. ఇందులో ఎక్కువగా ఐఫోన్ అమ్మకాల ద్వారానే వచ్చాయి. వీటి వల్లే 51.3 బిలియన్ డాలర్లు వచ్చాయి. భారత్ లో కూడా కంపెనీ రికార్డ్ ఆదాయాన్ని నమోదు చేసింది. ఇటీవల భారత్ వచ్చిన టిమ్ కుక్, ముంబై, ఢిల్లీలో రిటైల్ స్టోర్లను ప్రారంభించారు. ప్రధాని మోదీతో పాటు మంత్రి అశ్విని వైష్ణవ్ తో భేటీ అయ్యారు. భారత్ లో ఆపిల్ పెట్టుబడుల గురించి చర్చించారు.
తాజావార్తలు
-
Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
-
Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
-
Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
-
Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
-
Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్..
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!