Tim Cook vs Trump: ట్రంప్ వ్యాఖ్యలను లైట్ తీసుకున్న టిమ్ కుక్.. భారత్తోనే దోస్తాన్!
- ట్రంప్ వ్యాఖ్యలను లైట్ తీసుకున్న యాపికల్ సీఈఓ టీమ్ కుక్..
- గత త్రైమాసికంలో కొనసాగిన వైఖరే భవిష్యత్ లో కూడా కొనసాగుతుంది..
- భారత్లో మరిన్ని ఫిజికల్ స్టోర్లను త్వరలో తెరవబోతున్నాం: టిమ్ కుక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tim Cook vs Trump: భారతదేశంలో ఐఫోన్లు తయారీ చేపట్టడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. మే నెలలో దోహా పర్యటన సందర్భంగా తన మనసులో మాటను అతడు బయట పెట్టాడు. ఇండియాలో తయారీ చేయడం తనకు ఏ మాత్రం ఇష్టంలేదంటూ టిమ్ కుక్ సమక్షంలోనే తెలియజేశాడు. అలాగే, ట్రేడ్ డీల్ విషయంలో కోపంగా ఉన్న ట్రంప్.. భారత్పై 25 శాతం టారీఫ్స్ విధించారు. అయితే, అందులో స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ పరికరాలకు మినహాయింపు ఇచ్చాడు. దీంతో ప్రస్తుతానికి ఐఫోన్లపై ఎలాంటి సుంకాల ఎఫెక్ట్ లేనట్లే. కానీ, మున్ముందూ పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేమని విశ్లేషకులు వెల్లడించారు.
Read Also: Tollywood: సినిమానా మజాకా.. అప్లికేషన్ దెబ్బకి సైట్ క్రాష్
Also Read
- Cyber Fraud: ఓటీపీ చెప్పకపోయినా డబ్బు పోతుందా? సైబర్ నేరగాళ్లు ఇప్పుడు ఇలా మోసం చేస్తున్నారు
- PhonePe ITR filing: కేవలం రూ.24తోనే ITR ఫైల్ చేయొచ్చు.. PhonePe, JioFinance కొత్త ట్యాక్స్ ఫైలింగ్ సేవలు ప్రారంభం
- Digital Train Ticket: వాట్సాప్ టిక్కెట్లకు చెల్లుచీటి.. రైల్వే శాఖ తెచ్చిన సరికొత్త రూల్స్..
- NPPA: సామాన్యుడికి భారీ ఉపశమనం.. రక్తపోటు నుంచి మధుమేహం వరకు.. 39 మందుల ధరలను నిర్ణయించిన ప్రభుత్వం
అయితే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలను యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ఏమాత్రం పట్టించుకోలేదు. యాపిల్ కంపెనీ రెండో త్రైమాసిక ఫలితాల సందర్భంగా కుక్ మాట్లాడుతూ.. గత త్రైమాసికంలో కొనసాగిన వైఖరే భవిష్యత్ లో కూడా కొనసాగుతుందని తెలియజేశారు. యూఎస్ లో విక్రయమయ్యే ఫోన్లు దాదాపుగా భారత్లో తయారు చేసినవే అన్నారు. న్యూయార్క్ లో ఉపయోగించే ఇతర యాపిల్ ప్రొడక్ట్స్ మ్యాక్బుక్స్, ఐప్యాడ్స్, యాపిల్ వాచ్లను వియత్నాంలో తయారు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. అలాగే, ఇతర దేశాలకు చైనా నుంచి ఎగుమతి చేస్తున్నామని టిమ్ కుక్ పేర్కొన్నారు.
Read Also: YS Jagan: అమరావతిపై జగన్ సంచలన వ్యాఖ్యలు..
ఇక, తయారీపరంగానే కాదు.. ఆదాయం పరంగానూ యాపిల్కు భారతదేశం కలిసొచ్చింది అని టిమ్ కుక్ తెలిపారు. ఐఫోన్ల విక్రయం ద్వారా భారత్లో రికార్డు రెవెన్యూ వృద్ధి నమోదు చేసిందన్నారు. భారత్, పశ్చిమాసియా, దక్షిణాసియా, బ్రెజిల్లో అద్భుతమైన ఫలితాలను నమోదు చేసినట్లు వెల్లడించారు. వరల్డ్ వైడ్ గా సగటున 10 శాతం వృద్ధి నమోదైందని తెలియజేశారు. అంతేకాదు భారత్లో రిటైల్ విక్రయాలను పెంచేందుకు మరిన్ని ఫిజికల్ స్టోర్లను త్వరలో తెరవబోతున్నట్లు అనలిస్ట్ కాల్లో యాపిల్ సీఈఓ టిమ్ కుక్ చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Harish Rao : షాబాద్ ఆరుగురి హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే
-
S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
-
Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
-
S Janaki: పెళ్లి.. పిల్లలు.. వేల పాటలు.. ఎస్.జానకి జీవితంలో తెలియని విశేషాలు!
-
Israe-Lebanon: లెబనాన్పై మరోసారి ఇజ్రాయెల్ భీకర దాడులు.. పశ్చిమాసియాలో టెన్షన్
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!