US-China trade war: అమెరికా-చైనా శత్రుత్వాన్ని భారత్ సద్వినియోగం చేసుకోలేదా?
- అమెరికా-చైనా మధ్య ట్రేడ్ వార్
- ప్రయోజనాన్ని పొందేందుకు భారత్ యత్నం
- విస్తృత ప్రయత్నాలు చేసిన మోడీ
- ఫలించని వైనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా, చైనాల మధ్య శత్రుత్వం ప్రపంచానికి దాపురించింది. వీరిద్దరి మధ్య చాలా కాలంగా ట్రేడ్ వార్ నడుస్తోంది. దీని ప్రయోజనాన్ని పొందడానికి, భారతదేశం తన తయారీ రంగాన్ని ప్రోత్సహించడానికి ప్రయత్నాలు చేసింది. కానీ, ఈ ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈ వాణిజ్య యుద్ధం వల్ల ఇతర ఆసియా దేశాలు ఎక్కువ లాభపడ్డాయి. తాజా అధ్యయనంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ ప్రకారం.. 2017 -2023 మధ్య యూఎస్ దిగుమతులలో భారతదేశం యొక్క మొత్తం వాటా 0.6 శాతం పాయింట్లు పెరిగి 2.7%కి చేరుకుంటుందని అంచనా. అదే సమయంలో.. చైనా వాటా దాదాపు 8 శాతం క్షీణించి 14% కంటే తక్కువగా ఉంది.
అత్యధికంగా లాభపడిన వియత్నాం ..
అయితే, వియత్నాం వాణిజ్య మళ్లింపులో అతిపెద్ద లబ్ధిదారుగా ఉంది. ఈ కాలంలో యూఎస్ దిగుమతులలో దాని మొత్తం వాటా 1.7 శాతం నుంచి 3.7% వరకు పెరిగింది. తైవాన్ – దక్షిణ కొరియాలు కూడా యూఎస్ దిగుమతుల్లో తమ వాటాను వరుసగా 1 శాతం, 0.7 శాతం పెంచడం ద్వారా భారతదేశాన్ని అధిగమించాయి. ఈ అధ్యయనం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎదుర్కొంటున్న సవాళ్లను కూడా తెలిపింది. దేశంలో వెనుకబడిన తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు ఆయన తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని పేర్కొంది.
Also Read
- B35 Bullet Train: 2030 నాటికి భారత్ 350KM వేగంతో బుల్లెట్ ట్రైన్.. జపాన్ E10 సిరీస్కు పోటీగా స్వదేశీ B35
- LPG Subsidy Rule: గ్యాస్ సిలిండర్ సబ్సిడీపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్
- No UPI-Only Cash: నో యూపీఐ ఓన్లీ క్యాష్.. దుకాణాల ముందు ప్రత్యక్షమవుతున్న బోర్డులు..
- Dishwasher Prices: మహిళలకు గిన్నెలు తోమే తిప్పలు తప్పినట్టే! భారీగా తగ్గిన డిష్వాషర్ల ధరలు..
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడైతే…
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడైతే, చైనా వస్తువులపై 60% సుంకాలను విధించే బెదిరింపును అమలు చేస్తే భారతదేశం గణనీయమైన లాభాలను పొందడం కష్టమని పరిశోధనలు సూచిస్తున్నాయి. “అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం ఇప్పటివరకు భారతదేశ ఎగుమతి అవకాశాలను పరిమిత స్థాయిలో మాత్రమే మెరుగుపరిచింది” అని ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ ఆర్థికవేత్త అలెగ్జాండ్రా హర్మాన్ ఒక నోట్లో రాశారు. వివాదాల తీవ్రత వెనుకబడి ఉన్న తయారీ రంగానికి ఊతమిస్తుందన్న ఆశ అడియాశలైంది. భారతదేశం యొక్క ఎగుమతి బలం ఎక్కువగా ‘పాత ఆర్థిక వ్యవస్థ’ రంగాలలో ఉంది. ఇక్కడ వృద్ధి అవకాశాలు పరిమితంగా ఉంటాయి. పోటీ తీవ్రంగా ఉంటుంది. అని పేర్కొన్నారు.
భారతదేశం ఎక్కడ వెనుకబడి ఉంది?
అమెరికాకు ఎలక్ట్రానిక్స్ ఎగుమతులను ప్రోత్సహించడంలో భారత్ గణనీయమైన పురోగతి సాధించింది. కానీ, చైనా నుంచి విడిభాగాల దిగుమతి కూడా పెరిగింది. దేశీయ తయారీలో చాలా తక్కువ విలువ జోడింపు జరిగినట్లు ఇది చూపిస్తుంది. ఆక్స్ఫర్డ్ ప్రకారం.. 2023లో భారతదేశం దిగుమతి చేసుకునే ఎలక్ట్రానిక్స్, మెషినరీ, కెమికల్స్, ఫార్మాస్యూటికల్స్లో మూడో వంతు చైనా వాటాను కలిగి ఉంటుందని అంచనా. కొన్ని సెమీకండక్టర్ పరికరాల వంటి భాగాల కోసం భారతదేశం యొక్క 67% దిగుమతులు చైనా నుంచి వచ్చాయి. ఇది భారతదేశం యూఎస్ వాణిజ్య ఆంక్షలకు లోబడే ప్రమాదంలో పడింది. వియత్నాం వంటి ఇతర మూడవ దేశాలు ఇప్పటికే యూఎస్ రక్షణవాదాన్ని ఎక్కువగా అనుభవిస్తున్నాయి. చైనాలోకి ఎఫ్డిఐ ప్రవాహం తక్కువగా ఉన్నప్పటికీ, ప్రపంచ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో భారత్ పెద్దగా వాటాను ఆకర్షించలేకపోయింది.
తాజావార్తలు
-
Girls Hair Cutting: నిద్రలో ఉండగా జడలు కత్తిరింపు.. భీమిలి కేజీబీవీలో కలకలం
-
BhagyashriBorse : ఫ్లాపుల్లో భాగ్యశ్రీ బోర్సేకు వరుస ఆఫర్స్..సక్సెస్ తర్వాత నో ఛాన్స్
-
Job Loss Benefit: ఉద్యోగం పోయిందా? డోంట్ వర్నీ.. 50% జీతం మీ అకౌంట్లోకి వస్తుంది.. ఈ స్కీమ్ గురించి తెలుసా?
-
Pooja Meri Jaan OTT: నాలుగేళ్ల తర్వాత మృణాల్ ఠాకూర్ థ్రిల్లర్కు మోక్షం.. ఇప్పుడు నేరుగా ఓటీటీలోకి!
-
IBPS RRB 2026: నిరుద్యోగులకు అలర్ట్.. 13,441 బ్యాంక్ ఉద్యోగాలు.. IBPS RRB దరఖాస్తులకు రేపే చివరి తేదీ
ట్రెండింగ్
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!