Aluminium Foil: చైనాకు భారత్ గట్టి దెబ్బ! ఈ లోహంపై యాంటీ-డంపింగ్ సుంకం పొడిగింపు..’మేక్ ఇన్ ఇండియా’కు బలం
- చైనాకు భారత్ గట్టి షాక్
- అల్యూమినియం ఫాయిల్పై యాంటీ-డంపింగ్ సుంకం పొడిగింపు
- 'మేక్ ఇన్ ఇండియా'కు బలం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చైనా నుంచి చౌకగా దిగుమతి అవుతున్న అల్యూమినియం ఫాయిల్పై భారత ప్రభుత్వం మరోసారి కఠిన వైఖరిని ప్రదర్శించింది. దేశీయ పరిశ్రమల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, చైనా, మలేషియా, థాయ్లాండ్, ఇండోనేషియా దేశాల నుంచి దిగుమతి అయ్యే అల్యూమినియం ఫాయిల్పై విధిస్తున్న యాంటీ-డంపింగ్ సుంకాన్ని 2026 డిసెంబర్ 15 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయం దేశీయ అల్యూమినియం తయారీ సంస్థలకు పెద్ద ఊరటనివ్వగా, చైనాకు గట్టి ఎదురుదెబ్బగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
ఆర్థిక మంత్రిత్వ శాఖ 2026 జూన్ 10న జారీ చేసిన నోటిఫికేషన్ ద్వారా ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించింది. 2021 సెప్టెంబర్ 16న జారీ చేసిన నోటిఫికేషన్ నెం. 51/2021-కస్టమ్స్ (ADD) ను సవరిస్తూ ఈ పొడిగింపును అమల్లోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం అమలులో ఉన్న యాంటీ-డంపింగ్ సుంకాన్ని ముందుగానే ఉపసంహరించుకోకపోతే లేదా సవరించకపోతే, అది 2026 డిసెంబర్ 15 వరకు కొనసాగుతుంది.
Also Read
- EPFO కొత్త పథకం.. 6 నెలలే అందుబాటులో ఉండే ఈ కొత్త స్కీమ్తో ఎవరికి లబ్ధి..? పూర్తి వివరాలు..
- Rupee: సంక్షోభం సమయంలో ఆర్బీఐ మాస్టర్ ప్లాన్.. భారీగా పుంజుకున్న రూపాయి విలువ
- PayPal Layoffs: పేపాల్లో భారీ లేఆఫ్స్.. భారత్లో వందలాది మంది ఉద్యోగులకు పింక్ స్లిప్స్..
- Stock Market: అమెరికా నుంచి ముంచుకొస్తున్న బిగ్ డేంజర్.. ఈ ఒక్క కారణంతో మళ్లీ షేర్ మార్కెట్ కుప్పకూలుతుందా?
ఏ దేశాల నుంచి దిగుమతులపై ఈ సుంకం?
ఈ నిర్ణయం చైనా, ఇండోనేషియా, మలేషియా, థాయ్లాండ్ నాలుగు దేశాల నుంచి దిగుమతి అయ్యే అల్యూమినియం ఫాయిల్కు వర్తిస్తుంది. ఈ దేశాల నుంచి దిగుమతి అయ్యే 80 మైక్రాన్లు లేదా అంతకంటే తక్కువ మందం ఉన్న అల్యూమినియం ఫాయిల్ పై యాంటీ-డంపింగ్ సుంకం అమలులో ఉంటుంది.
DGTR సన్సెట్ రివ్యూ కొనసాగుతోంది
చౌక దిగుమతుల ప్రభావంపై దర్యాప్తు చేస్తున్న డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్ (DGTR) 2025 సెప్టెంబర్ 29న సన్సెట్ రివ్యూను ప్రారంభించింది. ఈ సమీక్ష ప్రధాన ఉద్దేశ్యం ఏమిటంటే.. ప్రస్తుతం అమలులో ఉన్న సుంకాన్ని తొలగిస్తే దేశీయ పరిశ్రమ మరోసారి నష్టపోయే ప్రమాదం ఉందా అనే అంశాన్ని పరిశీలించడం. సమీక్ష ప్రక్రియలో భాగంగా, 2026 ఏప్రిల్ 28న విచారణ నిర్వహించగా, పరిశ్రమ ప్రతినిధులు, దిగుమతిదారులు, ఇతర వాటాదారులు తమ అభిప్రాయాలను వెల్లడించారు.
దేశీయ కంపెనీల డిమాండ్ ఇదే
భారతీయ తయారీ సంస్థలు చౌక దిగుమతుల వల్ల తీవ్రంగా నష్టపోతున్నాయని వాదించాయి. ముఖ్యంగా హిండాల్కో ఇండస్ట్రీస్ (Hindalco Industries), SRF Altech వంటి సంస్థలు యాంటీ-డంపింగ్ సుంకాన్ని కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరాయి. విదేశాల నుంచి తక్కువ ధరలకు వస్తున్న అల్యూమినియం ఫాయిల్ కారణంగా దేశీయ ఉత్పత్తిదారులు పోటీలో వెనుకబడుతున్నారని, స్థానిక పరిశ్రమల మనుగడకు ముప్పు ఏర్పడుతోందని అవి పేర్కొన్నాయి.
యాంటీ-డంపింగ్ సుంకం అంటే ఏమిటి?
ఒక దేశం తన ఉత్పత్తులను మరో దేశంలో అసాధారణంగా తక్కువ ధరలకు విక్రయించడం ద్వారా అక్కడి స్థానిక పరిశ్రమలను దెబ్బతీసే పరిస్థితిని ‘డంపింగ్’ అంటారు. ఇలాంటి అన్ ఫెయిర్ పోటీని అరికట్టేందుకు దిగుమతి ఉత్పత్తులపై అదనపు పన్ను విధించడాన్ని యాంటీ-డంపింగ్ సుంకంగా పిలుస్తారు. దీని ద్వారా దేశీయ తయారీదారులకు రక్షణ లభిస్తుంది.
‘మేక్ ఇన్ ఇండియా’కు బలం
ప్రభుత్వ తాజా నిర్ణయం దేశీయ అల్యూమినియం పరిశ్రమకు మద్దతుగా నిలుస్తుందని నిపుణులు భావిస్తున్నారు. అలాగే, చౌక దిగుమతులను నియంత్రించడం ద్వారా ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమానికి మరింత బలం చేకూరనుంది. అంతేకాకుండా, విదేశీ కంపెనీల అన్ ఫెయిర్ ధరల వ్యూహాల నుంచి భారతీయ పరిశ్రమలను రక్షించేందుకు ఇది కీలక చర్యగా పరిగణిస్తున్నారు.
తాజావార్తలు
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
-
Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
-
Smriti Mandhana: మిథాలీ రాజ్ను పక్కకు నెట్టిన స్మృతి.. ఆసియా కప్లో సరికొత్త చరిత్ర..
-
OTR: రాజగోపాల్ రెడ్డి రాజన్న రాగం ఎందుకు వినిపిస్తున్నారు..?
-
Chatgpt: చాట్ జీపీటీలో అంతరాయం.. వినియోగదారుల్లో ఆందోళన
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!