Free Food Train: ఉచిత భోజనం అందించే ఏకైక రైలు… ఆ భోజనం ఎంత రుచిగా ఉంటుందంటే, ప్రయాణికులు వేళ్లు కూడా నాక్కుంటారు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Free Food Train : రైలు ప్రయాణం అంటే కేవలం ఒక చోటు నుంచి మరో చోటుకు చేరుకోవడం మాత్రమే కాదు. అది అనుభవాల సమాహారం. కిటికీ బయట మారిపోయే దృశ్యాలు, స్టేషన్ల సందడి, కొత్త ప్రయాణికులతో పరిచయాలు అన్నీ కలిసి ఒక ప్రత్యేకమైన జ్ఞాపకాన్ని మిగులుస్తాయి. అయితే ఈ ప్రయాణంలో ఆకలి వేస్తే సాధారణంగా మనం స్టేషన్లో ఆహారం కొనుగోలు చేయడం లేదా వెంట తీసుకెళ్లిన పదార్థాలను తినడం చేస్తాం. కానీ భారతదేశంలో ఒక ప్రత్యేకమైన రైలు ఉంది. ఇందులో ప్రయాణించే వారికి ప్రేమతో, సేవాభావంతో ఉచితంగా భోజనం అందిస్తారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ సేవ దాదాపు మూడు దశాబ్దాలుగా నిరంతరంగా కొనసాగుతోంది. ఇది ఒకింత ఆశ్చర్యం కలిగించే విషయమే. మరి ఇంతలా ఆశ్చర్యపరసన్న ఆ రైలు సంగతి ఏమిటో ఓ సారి చూద్దాం.
ఆ రైలు పేరు సచ్ఖండ్ ఎక్స్ప్రెస్. పంజాబ్లోని అమృత్సర్ నుంచి మహారాష్ట్రలోని నాందేడ్ వరకు సుమారు 2,000 కిలోమీటర్ల దూరాన్ని ఈ రైలు ప్రయాణిస్తుంది. మార్గమధ్యంలో మొత్తం 39 రైల్వే స్టేషన్లలో ఆగే ఈ రైలు, ఆరు ముఖ్యమైన స్టేషన్లలో ప్రయాణికులకు ఉచిత లంగర్ సేవలను అందిస్తుంది. సిక్కు మత సంప్రదాయంలో భాగమైన లంగర్ వ్యవస్థ ఆధారంగా ఈ సేవ కొనసాగుతోంది. ఇక్కడ ధనికుడు, పేదవాడు, యువకుడు, వృద్ధుడు అనే తేడా ఉండదు. మతం, కులం, ప్రాంతం అనే భేదాలు కూడా ఉండవు. రైలులో ప్రయాణిస్తున్న ప్రతి ఒక్కరికీ సమానంగా భోజనం అందిస్తారు.
Also Read
- Explainer: బంగారం మనది.. బిజినెస్ వాళ్లది.. ఆసియాలో గోల్డ్ హబ్గా సింగపూర్ ఎలా మారింది?
- Online House Hunting Scams: ఆన్లైన్లో ఇల్లు వెతుకుతున్నారా..? ఆకర్షణీయమైన ఫొటోల వెనుక దాగి ఉన్న మోసాలను గుర్తించండి..!
- Gold & Silver Prices Today: కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. మళ్లీ భారీగా తగ్గిన గోల్డ్ ధరలు..
- Petrol, Diesel Prices Reduced: ఇది కదా కావాల్సింది.. పెట్రోల్ ధరలు లీటరు రూ. 5, డీజిల్ ధరలు రూ. 3 తగ్గింపు
ఈ లంగర్ వెనుక ఉన్న అసలు బలం సేవాభావం. గురుద్వారాలు, భక్తులు కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. కొందరు బియ్యం, పప్పులు, ధాన్యాలను దానం చేస్తారు. మరికొందరు వంటలో సహాయం చేస్తారు. ఇంకొందరు ప్రయాణికులకు స్వయంగా ఆహారం వడ్డిస్తారు. కర్రీ రైస్, కిచిడీ, పప్పు, శనగల వంటి పోషకాహారంతో కూడిన భోజనం అందిస్తారు. ఈ ఆహారం కేవలం ఆకలిని తీర్చడమే కాదు, మానవత్వం ఇంకా జీవించి ఉందనే భావనను కూడా కలిగిస్తుంది. ఈ సేవకు అలవాటుపడిన చాలామంది ప్రయాణికులు తమ వెంట ప్రత్యేకంగా పాత్రలు కూడా తీసుకెళ్తుంటారు. ఎందుకంటే వారికి ఈ లంగర్ ప్రసాదం అందుతుందని తెలుసు. వేగంగా మారుతున్న ఈ కాలంలో ప్రతి చిన్న సేవకూ లెక్క కడుతున్న సమయంలో, ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా వేలాది మందికి భోజనం అందించడం నిజంగా గొప్ప విషయం.
ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా, మథుర, ఝాన్సీ, లలిత్పూర్ వంటి స్టేషన్లలో కూడా ఈ రైలు ఆగుతుంది. దీంతో ఉత్తర భారతదేశం నుంచి ప్రయాణించే వారు కూడా ఈ సేవను అనుభవించే అవకాశం పొందుతున్నారు. ప్రయాణంలో నీళ్లు, భోజనం కోసం అధిక ధరలు చెల్లించాల్సిన రోజుల్లో సచ్ఖండ్ ఎక్స్ప్రెస్ ఒక భిన్నమైన సందేశాన్ని ఇస్తోంది. సేవ, సోదరభావం, సమానత్వం అనే విలువలు ఇంకా సమాజంలో బలంగా ఉన్నాయని ఈ రైలు ప్రతిరోజూ నిరూపిస్తోంది. అందుకే సచ్ఖండ్ ఎక్స్ప్రెస్ కేవలం ఒక రైలు మాత్రమే కాదు, మానవత్వం పట్టాలపై పరుగెత్తుతున్న అరుదైన ఉదాహరణగా నిలిచింది.
తాజావార్తలు
-
Unused Apps: మీ ఫోన్లో ఈ యాప్స్ ఉన్నాయా? వెంటనే డిలీట్ చేయండి.. లేదంటే మీ పర్సనల్ డేటా గోవింద..!
-
Acer TravelLite TL24-54M: భారత్ లో ఏసర్ ట్రావెల్ లైట్ TL24-54M ల్యాప్టాప్ విడుదల.. DDR5 RAM సపోర్ట్, AI ఫీచర్లు
-
Tridha: బాబీ డియోల్తో బోల్డ్ సీన్లే బ్రేకప్కు కారణమా? మాజీ ప్రియుడిపై షాకింగ్ కామెంట్స్ చేసిన త్రిధా!
-
Mavigan vs Amaravati: నెక్ట్స్ ఫైట్ ‘మావిగన్ వర్సెస్ అమరావతి’.. వైఎస్ జగన్ సవాల్..
-
Kohinoor: ఈ వజ్రం కోసం యుద్ధాలు ఎందుకు జరిగాయి? శతాబ్దాలుగా వీడని మిస్టరీ!
ట్రెండింగ్
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..