Free Food Train: ఉచిత భోజనం అందించే ఏకైక రైలు… ఆ భోజనం ఎంత రుచిగా ఉంటుందంటే, ప్రయాణికులు వేళ్లు కూడా నాక్కుంటారు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Free Food Train : రైలు ప్రయాణం అంటే కేవలం ఒక చోటు నుంచి మరో చోటుకు చేరుకోవడం మాత్రమే కాదు. అది అనుభవాల సమాహారం. కిటికీ బయట మారిపోయే దృశ్యాలు, స్టేషన్ల సందడి, కొత్త ప్రయాణికులతో పరిచయాలు అన్నీ కలిసి ఒక ప్రత్యేకమైన జ్ఞాపకాన్ని మిగులుస్తాయి. అయితే ఈ ప్రయాణంలో ఆకలి వేస్తే సాధారణంగా మనం స్టేషన్లో ఆహారం కొనుగోలు చేయడం లేదా వెంట తీసుకెళ్లిన పదార్థాలను తినడం చేస్తాం. కానీ భారతదేశంలో ఒక ప్రత్యేకమైన రైలు ఉంది. ఇందులో ప్రయాణించే వారికి ప్రేమతో, సేవాభావంతో ఉచితంగా భోజనం అందిస్తారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ సేవ దాదాపు మూడు దశాబ్దాలుగా నిరంతరంగా కొనసాగుతోంది. ఇది ఒకింత ఆశ్చర్యం కలిగించే విషయమే. మరి ఇంతలా ఆశ్చర్యపరసన్న ఆ రైలు సంగతి ఏమిటో ఓ సారి చూద్దాం.
ఆ రైలు పేరు సచ్ఖండ్ ఎక్స్ప్రెస్. పంజాబ్లోని అమృత్సర్ నుంచి మహారాష్ట్రలోని నాందేడ్ వరకు సుమారు 2,000 కిలోమీటర్ల దూరాన్ని ఈ రైలు ప్రయాణిస్తుంది. మార్గమధ్యంలో మొత్తం 39 రైల్వే స్టేషన్లలో ఆగే ఈ రైలు, ఆరు ముఖ్యమైన స్టేషన్లలో ప్రయాణికులకు ఉచిత లంగర్ సేవలను అందిస్తుంది. సిక్కు మత సంప్రదాయంలో భాగమైన లంగర్ వ్యవస్థ ఆధారంగా ఈ సేవ కొనసాగుతోంది. ఇక్కడ ధనికుడు, పేదవాడు, యువకుడు, వృద్ధుడు అనే తేడా ఉండదు. మతం, కులం, ప్రాంతం అనే భేదాలు కూడా ఉండవు. రైలులో ప్రయాణిస్తున్న ప్రతి ఒక్కరికీ సమానంగా భోజనం అందిస్తారు.
Also Read
- Crude Oil Price Today: బ్యారెల్కు 100 డాలర్లకు చేరువలో ముడి చమురు.. భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభావం ఎంత?
- MS Dhoni: ఎంఎస్ ధోనీ కొత్త బిజినెస్కు బంపర్ బూస్ట్.. కోట్లలో నిధులు సమీకరణ!
- Gold and Silver Price: ఆషాడంలో కూడా తగ్గట్లేవుగా బంగారం.. భారీగా పెరిగిన ధరలు
- LIC Smart Pension Plan: ఒక్కసారి పెట్టుబడి.. జీవితాంతం పింఛన్.. స్మార్ట్ పెన్షన్ ప్లాన్ పూర్తి వివరాలు
ఈ లంగర్ వెనుక ఉన్న అసలు బలం సేవాభావం. గురుద్వారాలు, భక్తులు కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. కొందరు బియ్యం, పప్పులు, ధాన్యాలను దానం చేస్తారు. మరికొందరు వంటలో సహాయం చేస్తారు. ఇంకొందరు ప్రయాణికులకు స్వయంగా ఆహారం వడ్డిస్తారు. కర్రీ రైస్, కిచిడీ, పప్పు, శనగల వంటి పోషకాహారంతో కూడిన భోజనం అందిస్తారు. ఈ ఆహారం కేవలం ఆకలిని తీర్చడమే కాదు, మానవత్వం ఇంకా జీవించి ఉందనే భావనను కూడా కలిగిస్తుంది. ఈ సేవకు అలవాటుపడిన చాలామంది ప్రయాణికులు తమ వెంట ప్రత్యేకంగా పాత్రలు కూడా తీసుకెళ్తుంటారు. ఎందుకంటే వారికి ఈ లంగర్ ప్రసాదం అందుతుందని తెలుసు. వేగంగా మారుతున్న ఈ కాలంలో ప్రతి చిన్న సేవకూ లెక్క కడుతున్న సమయంలో, ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా వేలాది మందికి భోజనం అందించడం నిజంగా గొప్ప విషయం.
ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా, మథుర, ఝాన్సీ, లలిత్పూర్ వంటి స్టేషన్లలో కూడా ఈ రైలు ఆగుతుంది. దీంతో ఉత్తర భారతదేశం నుంచి ప్రయాణించే వారు కూడా ఈ సేవను అనుభవించే అవకాశం పొందుతున్నారు. ప్రయాణంలో నీళ్లు, భోజనం కోసం అధిక ధరలు చెల్లించాల్సిన రోజుల్లో సచ్ఖండ్ ఎక్స్ప్రెస్ ఒక భిన్నమైన సందేశాన్ని ఇస్తోంది. సేవ, సోదరభావం, సమానత్వం అనే విలువలు ఇంకా సమాజంలో బలంగా ఉన్నాయని ఈ రైలు ప్రతిరోజూ నిరూపిస్తోంది. అందుకే సచ్ఖండ్ ఎక్స్ప్రెస్ కేవలం ఒక రైలు మాత్రమే కాదు, మానవత్వం పట్టాలపై పరుగెత్తుతున్న అరుదైన ఉదాహరణగా నిలిచింది.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: ప్రపంచ రికార్డుపై వైభవ్ సూర్యవంశీ కన్ను.. ఇంకెవ్వరూ బ్రేక్ చేయలేరేమో!
-
Danish Kaneria: “రాముడు, మోడీ, హిందుత్వాన్ని తిట్టడమే నిరసనా?”.. సీజేపీ ఆందోళనలపై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..
-
Vaibhav Sooryavanshi: టీ20ల్లో చరిత్ర సృష్టించే ఛాన్స్.. వైభవ్ సూర్యవంశీ ఆ రికార్డు బద్దలు కొడతాడా?
-
RAW NTR: ఊహించని ట్విస్ట్.. ‘రా ఎన్టీఆర్’కు గుడ్బై.. అసలు ఏమైంది?
-
Abhijit Deepke: అభిజిత్ దీప్కే సంచలన ఆరోపణలు.. “బీజేపీ కార్యకర్తలు రాళ్లు విసిరారు, ముందే రాళ్లు తెచ్చుకున్నరు”
ట్రెండింగ్
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!