Adani Wind Project in Sri Lanka: అదానీకి శ్రీలంక కొత్త ప్రభుత్వం దెబ్బ.. గందరగోళంలో రూ. 3700 కోట్ల ప్రాజెక్ట్!
- అదానీకి శ్రీలంక కొత్త ప్రభుత్వం దెబ్బ
- గందరగోళంలో రూ.3700 కోట్ల ప్రాజెక్ట్
- ఈప్రాజెక్ట్ కు గత ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
- తాజాగా కొత్త ప్రభుత్వం ఏర్పాటు
- మరోసారి ఆలోచించి నిర్ణయం తీసుకుంటామన్న శ్రీలంక ప్రభుత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీలంకలో ప్రారంభించనున్న గౌతమ్ అదానీ ప్రాజెక్టుపై గందరగోళంలో చిక్కుకుంది. 440 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 3700 కోట్లు) ఈ ప్రాజెక్ట్ పవన విద్యుత్కు సంబంధించినది. ఈ ప్రాజెక్ట్ గురించి మరోసారి ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని శ్రీలంక కొత్త పరిపాలన తెలిపింది. అంతకుముందు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం కూడా అదానీ గ్రూప్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవలే శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా అనుర కుమార దిసానాయకే బాధ్యతలు చేపట్టారు. ఆయన నేతృత్వంలోని ప్రభుత్వం అదానీకి చెందిన ఈ ప్రాజెక్ట్లో మార్పులు చేస్తుందని సూచించింది.
గత ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..
గత శ్రీలంక ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ కొత్త ప్రభుత్వం ప్రస్తుతం రెడ్ సిగ్నల్ చూపించింది. అటువంటి పరిస్థితిలో, అదానీ యొక్క ఈ ప్రాజెక్ట్ ప్రమాదంలో పడింది. ఈ ప్రాజెక్టును అదానీ గ్రీన్ ఎనర్జీ పూర్తి చేయనుంది. గత ప్రభుత్వం ఇచ్చిన ఆమోదాన్ని కొత్త ప్రభుత్వం పునఃపరిశీలిస్తుందని శ్రీలంక అటార్నీ జనరల్ కార్యాలయం సోమవారం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ఈ విషయాన్ని ఉటంకిస్తూ ఓ జాతీయ వార్తా పత్రిక వివరాలు వెల్లడించింది. అక్టోబర్ 7న కొత్త మంత్రివర్గం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పునరాలోచనపై నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచంలో అదానీ తన వ్యాపారాన్ని విస్తరిస్తున్న ఈ తరుణంలో శ్రీలంక కొత్త నిర్ణయం అదానీకి అడ్డంకిగా మారవచ్చు.
Also Read
- Crude Oil Prices Fall: ముడి చమురు ధరలపై గుడ్ న్యూస్.. బ్యారెల్ ధర 70 డాలర్లకు పడిపోవచ్చు..!
- Darecation Explained: డబ్బులిచ్చి మరీ భయాన్ని కొంటున్నారు.. ట్రావెలింగ్లో నయా ట్రెండ్
- Carlsberg IPO: ప్రపంచంలోనే అత్యంత పురాతన బియర్ బ్రాండ్ ఐపీఓ.. వివరాలు ఇవే!
- HDFC Bank MCLR Hike: కస్టమర్లకు షాకిచ్చిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్.. మరింత భారంగా EMIలు
- శ్రీలంక ప్రభుత్వం ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది?
శ్రీలంక విదేశాంగ మంత్రి విజిత హెరాత్ ప్రకారం.. ప్రాజెక్ట్ దాని ధర నిర్మాణానికి సంబంధించి సమస్యలను ఎదుర్కొంది. కేబినెట్ సమావేశం అనంతరం హెరాత్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టుకు గత ప్రభుత్వం ఆమోదించిన విద్యుత్ ఛార్జీల విషయంలో కొంత సమస్య ఉందన్నారు. ఇది చాలా ఎక్కువని తెలిపారు. నవంబర్ 14న జరగనున్న పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ ప్రాజెక్టుపై ప్రభుత్వం తాజాగా పరిశీలన జరుపుతుందని చెప్పారు. - అదానీ ఒప్పందం ముప్పు..
గత నెలలో జరిగిన అధ్యక్ష ఎన్నికల సందర్భంగా శ్రీలంక ఇంధన సార్వభౌమత్వాన్ని పరిరక్షిస్తామని దిసానాయకే ప్రతిజ్ఞ చేశారు. అదానీ ఒప్పందాన్ని సంభావ్య ముప్పుగా ఆయన అభివర్ణించారు. ఒప్పందంలోని నిబంధనలపై మళ్లీ చర్చలు జరపాలని ఆయన చెప్పారు. ఈ ప్రాజెక్ట్ను రద్దు చేసుకోవడమే మంచిదని కూడా చెప్పాడు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!