Adani Wind Project in Sri Lanka: అదానీకి శ్రీలంక కొత్త ప్రభుత్వం దెబ్బ.. గందరగోళంలో రూ. 3700 కోట్ల ప్రాజెక్ట్!
- అదానీకి శ్రీలంక కొత్త ప్రభుత్వం దెబ్బ
- గందరగోళంలో రూ.3700 కోట్ల ప్రాజెక్ట్
- ఈప్రాజెక్ట్ కు గత ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
- తాజాగా కొత్త ప్రభుత్వం ఏర్పాటు
- మరోసారి ఆలోచించి నిర్ణయం తీసుకుంటామన్న శ్రీలంక ప్రభుత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీలంకలో ప్రారంభించనున్న గౌతమ్ అదానీ ప్రాజెక్టుపై గందరగోళంలో చిక్కుకుంది. 440 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 3700 కోట్లు) ఈ ప్రాజెక్ట్ పవన విద్యుత్కు సంబంధించినది. ఈ ప్రాజెక్ట్ గురించి మరోసారి ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని శ్రీలంక కొత్త పరిపాలన తెలిపింది. అంతకుముందు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం కూడా అదానీ గ్రూప్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవలే శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా అనుర కుమార దిసానాయకే బాధ్యతలు చేపట్టారు. ఆయన నేతృత్వంలోని ప్రభుత్వం అదానీకి చెందిన ఈ ప్రాజెక్ట్లో మార్పులు చేస్తుందని సూచించింది.
గత ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..
గత శ్రీలంక ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ కొత్త ప్రభుత్వం ప్రస్తుతం రెడ్ సిగ్నల్ చూపించింది. అటువంటి పరిస్థితిలో, అదానీ యొక్క ఈ ప్రాజెక్ట్ ప్రమాదంలో పడింది. ఈ ప్రాజెక్టును అదానీ గ్రీన్ ఎనర్జీ పూర్తి చేయనుంది. గత ప్రభుత్వం ఇచ్చిన ఆమోదాన్ని కొత్త ప్రభుత్వం పునఃపరిశీలిస్తుందని శ్రీలంక అటార్నీ జనరల్ కార్యాలయం సోమవారం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ఈ విషయాన్ని ఉటంకిస్తూ ఓ జాతీయ వార్తా పత్రిక వివరాలు వెల్లడించింది. అక్టోబర్ 7న కొత్త మంత్రివర్గం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పునరాలోచనపై నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచంలో అదానీ తన వ్యాపారాన్ని విస్తరిస్తున్న ఈ తరుణంలో శ్రీలంక కొత్త నిర్ణయం అదానీకి అడ్డంకిగా మారవచ్చు.
Also Read
- 50/30/20 Rule: పొదుపు ఖాతాలో ఎంత డబ్బు ఉంచాలి? 50/30/20 గోల్డెన్ రూల్ తెలుసుకోండి!
- Fortune Sunflower Oil FSSAI: ఈ వంట నూనె వాడుతున్నారా?.. ఫార్చ్యూన్ సన్ఫ్లవర్ ఆయిల్ శాంపిల్ ల్యాబ్ పరీక్షలో విఫలం..!
- US LPG Supplier to India: భారత్కు 67% LPG అమెరికా నుంచే.. అతిపెద్ద సరఫరాదారుగా యూఎస్
- Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
- శ్రీలంక ప్రభుత్వం ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది?
శ్రీలంక విదేశాంగ మంత్రి విజిత హెరాత్ ప్రకారం.. ప్రాజెక్ట్ దాని ధర నిర్మాణానికి సంబంధించి సమస్యలను ఎదుర్కొంది. కేబినెట్ సమావేశం అనంతరం హెరాత్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టుకు గత ప్రభుత్వం ఆమోదించిన విద్యుత్ ఛార్జీల విషయంలో కొంత సమస్య ఉందన్నారు. ఇది చాలా ఎక్కువని తెలిపారు. నవంబర్ 14న జరగనున్న పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ ప్రాజెక్టుపై ప్రభుత్వం తాజాగా పరిశీలన జరుపుతుందని చెప్పారు. - అదానీ ఒప్పందం ముప్పు..
గత నెలలో జరిగిన అధ్యక్ష ఎన్నికల సందర్భంగా శ్రీలంక ఇంధన సార్వభౌమత్వాన్ని పరిరక్షిస్తామని దిసానాయకే ప్రతిజ్ఞ చేశారు. అదానీ ఒప్పందాన్ని సంభావ్య ముప్పుగా ఆయన అభివర్ణించారు. ఒప్పందంలోని నిబంధనలపై మళ్లీ చర్చలు జరపాలని ఆయన చెప్పారు. ఈ ప్రాజెక్ట్ను రద్దు చేసుకోవడమే మంచిదని కూడా చెప్పాడు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
PM Modi: భవిష్యత్ భారత్ నిర్మాతలు మీరే.. యువతకు ప్రధాని మోడీ స్ఫూర్తిదాయక సందేశం..
-
APJAC: డీఏలు ఎందుకు ప్రకటించడం లేదు.? ప్రభుత్వ శ్వేతపత్రంపై ఏపీజేఏసీ ఫైర్.!
-
Rishabh Pant: అర్ధరాత్రి సీఎం సాయం కోరిన రిషబ్ పంత్.. స్పందించిన పుష్కర్ సింగ్ ధామి
-
Bharat Bhhagya Viddhaata: తుపాకుల మోతలో ప్రాణాలను పణంగా పెట్టిన రియల్ హీరోలు.. ఓటీటీలోకి ‘భారత్ భాగ్య విధాత’
-
Harish Rao: నిరుద్యోగులపై ఎందుకింత కక్ష? సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్
ట్రెండింగ్
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!