Adani Wind Project in Sri Lanka: అదానీకి శ్రీలంక కొత్త ప్రభుత్వం దెబ్బ.. గందరగోళంలో రూ. 3700 కోట్ల ప్రాజెక్ట్!
- అదానీకి శ్రీలంక కొత్త ప్రభుత్వం దెబ్బ
- గందరగోళంలో రూ.3700 కోట్ల ప్రాజెక్ట్
- ఈప్రాజెక్ట్ కు గత ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
- తాజాగా కొత్త ప్రభుత్వం ఏర్పాటు
- మరోసారి ఆలోచించి నిర్ణయం తీసుకుంటామన్న శ్రీలంక ప్రభుత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీలంకలో ప్రారంభించనున్న గౌతమ్ అదానీ ప్రాజెక్టుపై గందరగోళంలో చిక్కుకుంది. 440 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 3700 కోట్లు) ఈ ప్రాజెక్ట్ పవన విద్యుత్కు సంబంధించినది. ఈ ప్రాజెక్ట్ గురించి మరోసారి ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని శ్రీలంక కొత్త పరిపాలన తెలిపింది. అంతకుముందు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం కూడా అదానీ గ్రూప్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవలే శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా అనుర కుమార దిసానాయకే బాధ్యతలు చేపట్టారు. ఆయన నేతృత్వంలోని ప్రభుత్వం అదానీకి చెందిన ఈ ప్రాజెక్ట్లో మార్పులు చేస్తుందని సూచించింది.
గత ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..
గత శ్రీలంక ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ కొత్త ప్రభుత్వం ప్రస్తుతం రెడ్ సిగ్నల్ చూపించింది. అటువంటి పరిస్థితిలో, అదానీ యొక్క ఈ ప్రాజెక్ట్ ప్రమాదంలో పడింది. ఈ ప్రాజెక్టును అదానీ గ్రీన్ ఎనర్జీ పూర్తి చేయనుంది. గత ప్రభుత్వం ఇచ్చిన ఆమోదాన్ని కొత్త ప్రభుత్వం పునఃపరిశీలిస్తుందని శ్రీలంక అటార్నీ జనరల్ కార్యాలయం సోమవారం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ఈ విషయాన్ని ఉటంకిస్తూ ఓ జాతీయ వార్తా పత్రిక వివరాలు వెల్లడించింది. అక్టోబర్ 7న కొత్త మంత్రివర్గం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పునరాలోచనపై నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచంలో అదానీ తన వ్యాపారాన్ని విస్తరిస్తున్న ఈ తరుణంలో శ్రీలంక కొత్త నిర్ణయం అదానీకి అడ్డంకిగా మారవచ్చు.
Also Read
- Gold and Silver Price: ఇన్వెస్టర్లకు షాక్.. వచ్చే వారం భారీగా మారనున్న గోల్డ్, సిల్వర్ ధరలు! ఎందుకో తెలుసా?
- Bank Holidays: జూలైలో బ్యాంక్లకు ఏకంగా 12 రోజులు హాలిడేస్.. ఏ ఏ రోజుల్లో సెలవులు ఉన్నాయో క్లియర్గా తెలుసుకోండి!
- Zero Income Tax: జీతం రూ.20 లక్షలు.. అయినా ట్యాక్స్ కట్టేది సున్నా.. సీఏ చెప్పిన సీక్రెట్ ఇదే..
- Stock market: 4 రోజులు.. రూ.88,000 కోట్ల ప్రాఫిట్! స్టాక్ మార్కెట్ను షేక్ చేసిన ఆరు టాప్ కంపెనీలు ఇవే..
- శ్రీలంక ప్రభుత్వం ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది?
శ్రీలంక విదేశాంగ మంత్రి విజిత హెరాత్ ప్రకారం.. ప్రాజెక్ట్ దాని ధర నిర్మాణానికి సంబంధించి సమస్యలను ఎదుర్కొంది. కేబినెట్ సమావేశం అనంతరం హెరాత్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టుకు గత ప్రభుత్వం ఆమోదించిన విద్యుత్ ఛార్జీల విషయంలో కొంత సమస్య ఉందన్నారు. ఇది చాలా ఎక్కువని తెలిపారు. నవంబర్ 14న జరగనున్న పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ ప్రాజెక్టుపై ప్రభుత్వం తాజాగా పరిశీలన జరుపుతుందని చెప్పారు. - అదానీ ఒప్పందం ముప్పు..
గత నెలలో జరిగిన అధ్యక్ష ఎన్నికల సందర్భంగా శ్రీలంక ఇంధన సార్వభౌమత్వాన్ని పరిరక్షిస్తామని దిసానాయకే ప్రతిజ్ఞ చేశారు. అదానీ ఒప్పందాన్ని సంభావ్య ముప్పుగా ఆయన అభివర్ణించారు. ఒప్పందంలోని నిబంధనలపై మళ్లీ చర్చలు జరపాలని ఆయన చెప్పారు. ఈ ప్రాజెక్ట్ను రద్దు చేసుకోవడమే మంచిదని కూడా చెప్పాడు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
HYDRA Operation: హస్మత్పేటలో ఆపరేషన్.. రూ.750 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా!
-
Smartphone Theft: ఫోన్ పోయిందా? మొదటి 15 నిమిషాల్లో ఈ పనులు చేయకపోతే డేటా, డబ్బు రెండూ పోవచ్చు
-
Cyber Crime Recovery Mela: సైబర్ క్రైమ్ రికవరీ మేళా.. 310 మంది బాధితులకు రూ.6 కోట్ల రికవరీ చెక్కులు..
-
Tollywood First Half Results : టాలీవుడ్ ఫస్ట్ హాఫ్.. అదరగొట్టిన చిరు.. ఆదుకున్న సమంత
-
NEET Paper Leak: నీట్ పేపర్ లీకేజీపై ఎస్ఎఫ్ఐ ఆందోళన.. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్!
ట్రెండింగ్
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!