Radha Vembu: దేశంలోనే అత్యంత సంపన్న మహిళ.. నికర విలువ 47000 కోట్లు!
- హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2024 విడుదల
- సంపన్నుల ర్యాంకింగ్లో మార్పు
- దేశంలోనే అత్యంత సంపన్న మహిళగా రాధా వెంబు
- నికర విలువ 47000 కోట్లు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2024 విడుదలైంది. చాలా మంది సంపన్నుల ర్యాంకింగ్లో మార్పు వచ్చింది. అయితే వారి సంపదలో భారీ పెరుగుదలతో అగ్రస్థానానికి చేరుకున్న చాలా మంది పేర్లు ఉన్నాయి. వారిలో ఒకరి పేరు రాధా వెంబు. ఆమె భారతదేశం యొక్క అత్యంత ధనిక స్వీయ-నిర్మిత మహిళగా మారింది. లైమ్లైట్కు దూరంగా ఉంటూ సాదాసీదా జీవితాన్ని గడుపుతున్న రాధా వెంబు బహుళజాతి సాంకేతిక సంస్థ జోహో సహ వ్యవస్థాపకురాలు. ఆమె గురించి పూర్తిగా తెలుసుకుందాం.
READ MORE: Actor Jayasurya: లైంగిక వేధింపుల ఆరోపణలు.. నటుడు జయసూర్యపై రెండో కేసు నమోదు!
Also Read
- Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
- Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
- International Credit Cards: భారతీయులకు క్రెడిట్ కార్డులు ఇచ్చేందుకు నిరాకరిస్తున్న గ్లోబల్ బ్యాంక్స్.. ఎందుకంటే?
- Ethanol in Diesel: డీజిల్లో ఇథనాల్కు బ్రేక్.. వెనక్కి తగ్గిన కేంద్రం.. అసలు కారణం ఇదే..!
రాధా వెంబుకు దేశంలోనే అత్యంత సంపన్న మహిళగా మారారు. ఆమె బహుళజాతి టెక్ సంస్థ జోహో కార్ప్ సహ వ్యవస్థాపకురాలిగా ఉన్నారు. ఆమె నాయకత్వంలో.. జోహో యొక్క ఉత్పత్తి పోర్ట్ఫోలియో బలమైన వృద్ధిని సాధించింది. ప్రస్తుతం దాని వ్యాపారం అనేక దేశాలకు విస్తరించింది. ఇప్పుడు ఆమె హురున్ యొక్క రిచ్ లిస్ట్లో అత్యంత ధనిక స్వీయ-నిర్మిత భారతీయ మహిళగా చేర్చబడింది. హురున్ జాబితా ప్రకారం… జోహో సహ వ్యవస్థాపకుడి నికర విలువ రూ.47,500 కోట్లు. తొలిసారిగా హురున్ ఇండియా రిచ్ లిస్టులో భారత్ నుంచి 300 మందికి పైగా బిలియనీర్లు చేరి అందులో మహిళల ఆధిపత్యం కూడా కనిపించింది. రాధా వెంబు సహ-వ్యవస్థాపకురాలిగా ఉన్న జోహో కార్ప్.. ఒక బహుళజాతి సంస్థ. క్లౌడ్-ఆధారిత సాఫ్ట్వేర్, టెక్, ఇంటర్నెట్ వెబ్ సంబంధిత సాధనాలను ఉత్పత్తి చేస్తుంది. ఇది సాఫ్ట్వేర్ అప్లికేషన్లను అందిస్తుంది.
READ MORE:Jagga Reddy: సీఎం రేవంత్ అపాయింట్మెంట్ తీసుకోండి.. కేసీఆర్ కు జగ్గారెడ్డి సూచన
రాధా వెంబు 1972లో మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఐఐటీ మద్రాస్ నుంచి ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్లో పట్టభద్రులయ్యారు. ఆమె అన్నయ్య శ్రీధర్ వెంబుతో కలిసి జోహో కార్పొరేషన్ను స్థాపించారు. ఈ సంస్థ 1996లో స్థాపించబడింది. మొదట్లో అడ్వెనెట్ అని పేరు పెట్టారు. అయితే తర్వాత దానిని జోహో కార్పొరేషన్గా మార్చారు. రాధా వెంబు 1997లో పాట్నర్ గా చేరారు. దీని ప్రధాన కార్యాలయం చెన్నైలో ఉంది. ప్రస్తుతం రాధ ఇందులో అతిపెద్ద వాటాదారుగా ఉన్నారు. నివేదికల ప్రకారం.. కంపెనీలో రాధా వెంబుకు దాదాపు 47-50 శాతం వాటా ఉంది. రాధా వెంబు నాయకత్వంలో ఈ కంపెనీలు కార్యకలపాలు సాగిస్తున్నాయి. జోహో ప్రపంచంలోని టాప్-5 వ్యాపార ఇమెయిల్ ప్రొవైడర్లలో ఒకటిగా నిలిచింది. జోహోతో పాటు మరో రెండు కంపెనీల బాధ్యతలను కూడా ఆమె నిర్వర్తిస్తున్నారు. వీటిలో మొదటిది జానకి హైటెక్ ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్, రెండవది హైలాండ్ వ్యాలీ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీలకు ఆమె డైరెక్టర్ గా కొనసాగుతున్నారు.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..