Radha Vembu: దేశంలోనే అత్యంత సంపన్న మహిళ.. నికర విలువ 47000 కోట్లు!
- హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2024 విడుదల
- సంపన్నుల ర్యాంకింగ్లో మార్పు
- దేశంలోనే అత్యంత సంపన్న మహిళగా రాధా వెంబు
- నికర విలువ 47000 కోట్లు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2024 విడుదలైంది. చాలా మంది సంపన్నుల ర్యాంకింగ్లో మార్పు వచ్చింది. అయితే వారి సంపదలో భారీ పెరుగుదలతో అగ్రస్థానానికి చేరుకున్న చాలా మంది పేర్లు ఉన్నాయి. వారిలో ఒకరి పేరు రాధా వెంబు. ఆమె భారతదేశం యొక్క అత్యంత ధనిక స్వీయ-నిర్మిత మహిళగా మారింది. లైమ్లైట్కు దూరంగా ఉంటూ సాదాసీదా జీవితాన్ని గడుపుతున్న రాధా వెంబు బహుళజాతి సాంకేతిక సంస్థ జోహో సహ వ్యవస్థాపకురాలు. ఆమె గురించి పూర్తిగా తెలుసుకుందాం.
READ MORE: Actor Jayasurya: లైంగిక వేధింపుల ఆరోపణలు.. నటుడు జయసూర్యపై రెండో కేసు నమోదు!
Also Read
- Carlsberg IPO: ప్రపంచంలోనే అత్యంత పురాతన బియర్ బ్రాండ్ ఐపీఓ.. వివరాలు ఇవే!
- HDFC Bank MCLR Hike: కస్టమర్లకు షాకిచ్చిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్.. మరింత భారంగా EMIలు
- Gas Cylinder Subsidy: గ్యాస్ వినియోగదారులకు బిగ్ షాక్.. ‘రాయితీ’కి కత్తెర.. వంటగదిలో ఇక కట్టెల పొయ్యే...
- CIBIL Score New Rules: మారిన సిబిల్ స్కోర్ రూల్స్.. తక్కువ సిబిల్ ఉంటే రుణం దొరకదా? అసలు నిజం ఏంటి?
రాధా వెంబుకు దేశంలోనే అత్యంత సంపన్న మహిళగా మారారు. ఆమె బహుళజాతి టెక్ సంస్థ జోహో కార్ప్ సహ వ్యవస్థాపకురాలిగా ఉన్నారు. ఆమె నాయకత్వంలో.. జోహో యొక్క ఉత్పత్తి పోర్ట్ఫోలియో బలమైన వృద్ధిని సాధించింది. ప్రస్తుతం దాని వ్యాపారం అనేక దేశాలకు విస్తరించింది. ఇప్పుడు ఆమె హురున్ యొక్క రిచ్ లిస్ట్లో అత్యంత ధనిక స్వీయ-నిర్మిత భారతీయ మహిళగా చేర్చబడింది. హురున్ జాబితా ప్రకారం… జోహో సహ వ్యవస్థాపకుడి నికర విలువ రూ.47,500 కోట్లు. తొలిసారిగా హురున్ ఇండియా రిచ్ లిస్టులో భారత్ నుంచి 300 మందికి పైగా బిలియనీర్లు చేరి అందులో మహిళల ఆధిపత్యం కూడా కనిపించింది. రాధా వెంబు సహ-వ్యవస్థాపకురాలిగా ఉన్న జోహో కార్ప్.. ఒక బహుళజాతి సంస్థ. క్లౌడ్-ఆధారిత సాఫ్ట్వేర్, టెక్, ఇంటర్నెట్ వెబ్ సంబంధిత సాధనాలను ఉత్పత్తి చేస్తుంది. ఇది సాఫ్ట్వేర్ అప్లికేషన్లను అందిస్తుంది.
READ MORE:Jagga Reddy: సీఎం రేవంత్ అపాయింట్మెంట్ తీసుకోండి.. కేసీఆర్ కు జగ్గారెడ్డి సూచన
రాధా వెంబు 1972లో మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఐఐటీ మద్రాస్ నుంచి ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్లో పట్టభద్రులయ్యారు. ఆమె అన్నయ్య శ్రీధర్ వెంబుతో కలిసి జోహో కార్పొరేషన్ను స్థాపించారు. ఈ సంస్థ 1996లో స్థాపించబడింది. మొదట్లో అడ్వెనెట్ అని పేరు పెట్టారు. అయితే తర్వాత దానిని జోహో కార్పొరేషన్గా మార్చారు. రాధా వెంబు 1997లో పాట్నర్ గా చేరారు. దీని ప్రధాన కార్యాలయం చెన్నైలో ఉంది. ప్రస్తుతం రాధ ఇందులో అతిపెద్ద వాటాదారుగా ఉన్నారు. నివేదికల ప్రకారం.. కంపెనీలో రాధా వెంబుకు దాదాపు 47-50 శాతం వాటా ఉంది. రాధా వెంబు నాయకత్వంలో ఈ కంపెనీలు కార్యకలపాలు సాగిస్తున్నాయి. జోహో ప్రపంచంలోని టాప్-5 వ్యాపార ఇమెయిల్ ప్రొవైడర్లలో ఒకటిగా నిలిచింది. జోహోతో పాటు మరో రెండు కంపెనీల బాధ్యతలను కూడా ఆమె నిర్వర్తిస్తున్నారు. వీటిలో మొదటిది జానకి హైటెక్ ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్, రెండవది హైలాండ్ వ్యాలీ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీలకు ఆమె డైరెక్టర్ గా కొనసాగుతున్నారు.
తాజావార్తలు
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
TMC Rebellion: మమతా బెనర్జీకి కోలుకోలేని దెబ్బ.. పక్కా ప్లాన్తో పార్టీని వీడిన ఆ 20 మంది ఎంపీలు..
-
OTT Releases This Week : తెలుగు నుంచి మలయాళం వరకు… ఈవారం ఓటీటీలో మస్ట్ వాచ్ మూవీస్
-
KING 100 : దూసుకొస్తున్న కింగ్ 100.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!