Jagga Reddy: సీఎం రేవంత్ అపాయింట్మెంట్ తీసుకోండి.. కేసీఆర్ కు జగ్గారెడ్డి సూచన
- ప్రభుత్వానికి- బ్యాంకర్లకు మధ్య ఆన్లైన్ సిస్టం దెబ్బ తీశారు కేసీఆర్..
- అందుకే రుణమాఫీ ఆలస్యం అవుతుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jagga Reddy: సీఎం రేవంత్ నీ కేసీఆర్ అపాయింట్ మెంట్ అడుగు.. ఇవ్వడా.. సచివాలయం వెళ్లి సమస్యలపై చర్చ చెయ్ అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ప్రకటన చేస్తే.. వాటికి ఎప్పుడైనా విలువ ఉందా? అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ తన రాజకీయ జీవితంలో ఎప్పుడైనా మాటకు కట్టుబడి ఉన్నారా..? అని మండిపడ్డారు. చెప్పిన మాటకు కట్టుబడి ఉంటే.. మాకెందుకు అధికారం ఇస్తారు ప్రజలు అని తెలిపారు. సీఎం రేవంత్… కేసీఆర్ నీ అసెంబ్లీ కి రండి.. మాకు సలహాలు సూచనలు ఇవ్వండి అని అడిగారు.. అయినా రాలేదన్నారు. తెలంగాణలో రివర్స్ పాలిటిక్స్ నడుస్తున్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ పెడితే… ప్రతిపక్ష నాయకుడు వస్తారు.. సీఎంలు సరిగా రారన్నారు. కానీ తెలంగాణలో సీఎం రేవంత్… ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ నీ సభకు రండి అని పిలిచే పరిస్థితి వచ్చిందన్నారు. బయట మాట్లాడే కేసీఆర్.. సభలోకి వచ్చి రుణమాఫీ గురించి మాట్లాడొచ్చు కదా? అని ప్రశ్నించారు. అసెంబ్లీ పెట్టండి సమస్యలపై మాట్లాడాలి అని ప్రతిపక్ష నాయకుడు అడగాలి.. కానీ సీఎం అసెంబ్లీ పెట్టీ ప్రతిపక్ష నాయకుడి నీ సభకు రండి అని పిలిచే పరిస్థితి వచ్చిందన్నారు.
Read also: CM Revanth Reddy: సచివాలయంలో సీఎం రేవంత్ కు వేములవాడ అర్చకుల ఆశీర్వాదం..
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Hyderabad: నిత్యం వాడే మసాలాల్లో విషపూరిత కేమికల్స్.. 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం..
- Hyderabad: ఆ మార్గాల్లో వెళ్లేవారు రూట్ మార్చాల్సిందే.. ఈ ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ జామ్..
- Hyderabad Rains : హైదరాబాద్ను ముంచెత్తిన వర్షం.. ట్రాఫిక్ టోటల్ జామ్..!
సీఎం గా సచివాలయం రాలేదు..ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీ కి కూడా రావడం లేదన్నారు. రేవంత్ నీ కేసీఆర్ అపాయింట్ మెంట్ అడుగు.. ఇవ్వడా.. సచివాలయం వెళ్లి సమస్యలపై చర్చ చెయ్ అన్నారు. సీఎం అందుబాటులో లేరా? అని ప్రశ్నించారు. మీ హయంలో ప్రతిపక్ష నాయకులకు అపాయింట్ మెంట్ ఇవ్వలేని పరిస్థితి.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. రుణమాఫీ మేము ఇచ్చిన మాట ప్రకారం 9 నెలల్లో చేశామన్నారు. రుణమాఫీ కోసం 12 వేల కోట్లు నిధులు రెడీగా ఉన్నాయన్నారు. సమస్య 2 లక్షల రుణాల విషయంలోనే.. కేసీఆర్ తొమ్మిదిన్నర యేండ్లలో సిస్టం అంతా ఖరాభ్ చేశారని కీలక వ్యాక్యలు చేశారు. ప్రభుత్వానికి.. బ్యాంకర్లకు మధ్య ఆన్లైన్ సిస్టం దెబ్బ తీశారు కేసీఆర్ అంటూ మండిపడ్డారు. అందుకే ఆలస్యం అవుతుందని తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారుల విధానం కూడా దెబ్బతిశారు కేసీఆర్ అన్నారు. ఇంటింటి సర్వే చేస్తున్నది సర్కార్..సెప్టెంబర్ నెలాఖరు వరకు అందరికీ మాఫీ ఐపోతుందన్నారు. హరీష్ రావు అధికారం మజా లో ఉన్నాడన్నారు. హరీష్ కి లెక్కలే రావు.. ఫైనాన్స్ మినిస్టర్ అయ్యాడన్నారు. మేన మామ చెప్పింది చేయడమే హరీష్ రావు పని అన్నారు. రాహుల్ గాంధీ వరంగల్ వస్తారు..అసలు సంబరాలు అక్కడ చేస్తామన్నారు.
Harish Rao: ముఖ్యమంత్రి సారుకు ఇవేవీ పట్టవు.. హరీష్ రావ్ ట్వీట్ వైరల్..
తాజావార్తలు
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
IND vs SL Test: శ్రీలంకలో టీమిండియా ల్యాండ్.. స్టార్ ప్లేయర్ మిస్సింగ్.. మొదటి టెస్ట్ డౌటే!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
Varanasi: మహేష్ పుట్టినరోజుకు ‘వారణాసి’ గిఫ్ట్ ఉంటుందా?.. 80% షూటింగ్ పూర్తయినా పోస్టర్ తో సరిపెట్టుకుంటారా ?
ట్రెండింగ్
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!