Varasiddhi Vinayaka: కాణిపాకం విశిష్టత.. రోజు రోజుకి పెరుగుతున్న వినాయకుని విగ్రహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bakthi: ఏ పని ప్రారంభించిన తొలి పూజ వినాయకునికి చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఇలా మొదటి పూజ వినాయకుడికి చేసి పని ప్రారంభిస్తే ఎలాంటి ఆటంకాలు లేకుండా తలపెట్టిన పని విజయవంతంగా పూర్తవుతుందని ప్రజల నమ్మకం. అయితే వినాయకుడు స్వయంభూగా వెలసిన పుణ్యక్షేత్రం కాణిపాకం. ఆకాణిపాక వినాయకుని చరిత్ర ఏమిటి? అలానే ఆ గుడిలోని వినాయకుని విశిష్టత ఏమిటి ? అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Read also:Ganesh Chathurthi: విఘ్నేశ్వరునికి తులసి ఆకులతో పూజ చేయకూడదు ఎందుకో తెలుసా..?
Also Read
- Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభవార్తలే, పండగే ఇవాళ!
- Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఆకస్మిక ధన లాభాలు!
- Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. అప్పులు అస్సలు ఇవ్వొద్దు, తీసుకోవద్దు సుమీ!
- Today Astrology: మంగళవారం దిన ఫలాలు.. కలిసి రానున్న ఆర్థిక లావాదేవీలు!
పూర్వము విహారపురి అనే గ్రామంలో ముగ్గురు సోదరులు ఉండే వారు. వారిలో ఒకరు మూగ వాడు, మరొకడు చెవిటి వాడు, ఇంకొకరు గుడ్డి వాడు, కాగా వారికి గ్రామం సమీపంలో కొంచం పొలముంది. వాళ్ళు ముగ్గురు కలిసి ఆ పొలాన్ని సాగు చేసుకునేవారు. అయితే ఎప్పటిలానే పొలానికి వెళ్లిన ముగ్గురు పంటకి నీరు పెట్టాలని ప్రయత్నిస్తారు. కాగా బావిలో నీరు కొద్దిగానే ఉండడం చేత ఆ నీరు బయటకి రాకుండ ఉంటుంది. ఈ నేపథ్యంలో చెవిటివాడు బావిలోకి దిగి బావిని మరికొంచం లోతుగా తొవ్వాలని గడ్డపారతో తొవ్వడం ప్రారంభిస్తాడు. అలా అతను తొవ్వుతున్నప్పుడు అతని గడ్డపారకి ఒక రాయి తగిలి రక్తం అతనిపైన చిమ్ముతుంది. వెంటనే అతనికి చెవులు వినిపిస్తాయి.
Read also:Vinayaka chavithi: వినాయకుని నిమజ్జనం ఇంట్లోనే ఇలా చెయ్యండి?
వెంటనే అతను తన సోదరులను తీసుకువెళ్లి ఆ రక్తం నిండిన బావిని చూపిస్తాడు. ఇలా తన సోదరులు ఆ నీటిని తాకగానే గుడ్డివాడికి చూపు వస్తుంది. మూగ వాడికి మాట వస్తుంది. ఈ విషయం ఊర్లో తెలిసి అందరూ ఆ భావి దగ్గరకి వచ్చి చూడగా ఆ రాయి నుండి రక్తం కారుతూ ఉంటుంది. ఓ పురోహితుడు కొబ్బరి కాయలు కొడితే ఆ నీరు స్వామి మీద పడి రక్తం రావడం ఆగిపోతుంది అని చెప్తాడు. దానితో రాజు ఆజ్ఞ మేరకు ప్రజలంతా కొబ్బరికాయలు తెచ్చి బావిలో కొడతారు. ఆ కొబ్బరి నీళ్ళకి ఒకటిన్నర ఎకరాల భూమి తడుస్తుంది. అందుకే ఈ ప్రాంతానికి కాణిపాకం అనే పేరు వచ్చింది. కాణి అంటే చిత్తడి.. పాకం అంటే నీరు ప్రవహించిన ప్రాంతం అని అర్ధం . అయితే బావిలో వెలసిన వినాయకుడు ఇప్పటికి భక్తులకు బావిలోనే దర్శమిస్తున్నాడు. అంతే కాదు ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆ బావిలో నీరు ఇంకిపోదు. విశేషముగా విగ్నేశ్వరుడి విగ్రహం రోజు రోజుకి పెరుగుతుంది. ఈ వాస్తవానికి రుజువు కూడా ఉంది. కొన్ని దశాబ్దాల క్రితం ఓ భక్తుడు స్వామికి చేయించిన వెండి కవచం ప్రస్తుతం స్వామివారికి సరిపోవడం లేదు.
తాజావార్తలు
-
Gautam Gambhir: టెస్టుల్లో నంబర్-3పై కోచ్ గంభీర్ క్లారిటీ.. రిషభ్ పంత్పై కీలక వ్యాఖ్యలు!
-
Jhanvi Kapoor : ఇన్స్టాగ్రామ్లో పెద్ది నెగిటివ్ రివ్యూ పోస్ట్ను లైక్ చేసిన జాన్వీ.. ఫీలైనట్టుంది?
-
Rama Nandana: లగ్జరీ లైఫ్స్టైల్ వెనుక “గలీజ్ దందా”.. యూట్యూబర్ రమానందన, మధుకర్కు లుకౌట్ నోటీసులు!
-
OnePlus Community Sale 2026: వన్ప్లస్ కమ్యూనిటీ సేల్ ప్రారంభం.. ఫ్లాగ్షిప్ ఫోన్లు, ట్యాబ్లెట్లపై భారీ డిస్కౌంట్లు
-
KS Bharat Retirement: ఇట్స్ అఫీషియల్.. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన తెలుగు క్రికెటర్
ట్రెండింగ్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!