Vinayaka chavithi: వినాయకుని నిమజ్జనం ఇంట్లోనే ఇలా చెయ్యండి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ganesh chathurdhi: హిందువులు జరుపుకునే పండుగల్లో వినాయక చవితి కూడా ఒకటి. వినాయక చవితి రోజున భక్తులు వేకువ జామునే లేచి ఇల్లు శుభ్రం చేసుకుంటారు. తల స్నానం చేసి వినాయకుని మండపాన్ని అలంకరిస్తారు. ఆ విగ్నేశ్వరునికి ఇష్టమైన నైవేద్యాలను తాయారు చేస్తారు. భక్తి శ్రద్దలతో ఆ గణనాధుణ్ని పూజిస్తారు. అయితే వినాయకుని ప్రతిమని ప్రతిష్టించడంతో ప్రారంభమైన ఈ పండుగ నిమజ్జనంతో పూర్తవుతుంది. నది, కాలువ, చెరువు ఇలా నీటివనరులు దగ్గరగా ఉన్న వాళ్ళు గణేష్ ప్రతిమని నీరు ఉన్న వనరుల దగ్గరకి తీసుకెళ్లి నిమజ్జనం చేస్తారు. మరి ఆ అవకాశం లేని వాళ్ళు నిమజ్జనం చేయడానికి ఎంతగానో ఇబ్బందులను ఎదుర్కొంటుంటారు. కానీ అలా వ్యయప్రయాసలకు గురి కాకుండా ఇంట్లోనే వినాయకుని ప్రతిమను నిమజ్జనం చేయొచ్చు. ఎలా చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Read also:Ganesh chathurthi: ఈ మంత్రం చెప్తూ గణేష్ నిమజ్జనం చేస్తే 100 శాతం పూజాఫలం
Also Read
- Angkor Wat: ప్రపంచంలో అతి పెద్ద గుడి ఏది.? ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే.!
- Thursday Horoscope: ఆ రాశి వారు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాల్సిందే.. లేదా తిప్పలు తప్పవ్..!
- Chanakya Niti: ఓర్వలేని చుట్టాలకు చెక్ పెట్టే చాణక్య నీతి.. రాబంధువుల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోండిలా!
- Daily Horoscope: బుధవారం రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి ఊహించని శుభవార్తలు!
విగ్నేశ్వరున్ని నిమజ్జనం చేసే రోజు కూడా యధావిధిగా పూజ చేసి నైవేద్యం సమర్పించాలి. అనంతరం ఇంట్లో అందరూ తీర్ధ ప్రసాదాలు సేవించాలి. ఇప్పుడు 5 తమాలపాలకులు తీసుకుని ఒక పసుపు పూసిన దారానికి కట్టాలి. ఆ దారాన్ని నిమజ్జనం చేసే వాళ్ళు చేతికి కట్టుకోవాలి. కాగా ఇంట్లో నిమజ్జనం చెయ్యాలి అనుకున్నప్పుడు దీపం కొండకెక్కక ముందే చెయ్యాలి. అందుకు ముందుగా ఇంటి ఆవరణలో ముగ్గు వెయ్యాలి. శుచిగా ఉన్న ఒక బకెట్ లేదా టబ్బు ని తీసుకోవాలి. తరువాత బకెట్ లేదా టబ్బుని ముగ్గులో పెట్టాలి. ఇప్పుడు ఆ బకెట్ లేదా టబ్బులో నీళ్లు పొయ్యాలి. అనంతరం ఆ నీళ్లలో పసుపు, కుంకుమ, అక్షంతలు వెయ్యాలి.
Read also:Immersion of Ganesh idol : వినాయకుని విగ్రహాలు ఎందుకు నిమజ్జనం చేస్తారో తెలుసా..?
ఇప్పుడు గణేశునికి నమస్కరించి మండపంలో నుండి ప్రతిమని తీసుకోవాలి. “శ్రీ గణేశం ఉద్వాసయామి.. శోభనార్థం పునరాగమనాయచ” అనే మంత్రాన్ని జపిస్తూ రెండు చేతులతో వినాయకుని ప్రతిమని నీటిలో వదలాలి. ఎప్పుడు వినాయకుని ప్రతిమని విసిరేయకూడదు. నిదానంగా రెండు చేతులతో నీటిలో కలపాలి. అలా నిమజ్జనం చేసాక ప్రతిమ పూర్తిగా నీటిలో కరిగిపోయాక రావి చెట్టుకి లేదా మారేడు చెట్టుకి పోయాలి. పసుపు గణపతిని ఏదైనా చెట్టు మొదట్లో పెట్టాలి. కానీ తులసి చెట్టు మొదట్లో పెట్టకూడదు. ఎందుకంటే తులసి దేవికి విగ్నేశ్వరుడు ఇచ్చిన శాపం కారణంగా తులసిని వినాయకుని పూజకు వాడకూడదు. అలానే తులసి చెట్టు దగ్గర వినాయకుణ్ణి ఉంచకూడదు. అలానే వినాయకుని పూజలో ఉపయోగించిన ఆకులు, పువ్వులు మొదలైన వాటిని గొయ్యి తీసి పాతి పెట్టాలి.
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!