Vinayaka chavithi: వినాయకుని నిమజ్జనం ఇంట్లోనే ఇలా చెయ్యండి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ganesh chathurdhi: హిందువులు జరుపుకునే పండుగల్లో వినాయక చవితి కూడా ఒకటి. వినాయక చవితి రోజున భక్తులు వేకువ జామునే లేచి ఇల్లు శుభ్రం చేసుకుంటారు. తల స్నానం చేసి వినాయకుని మండపాన్ని అలంకరిస్తారు. ఆ విగ్నేశ్వరునికి ఇష్టమైన నైవేద్యాలను తాయారు చేస్తారు. భక్తి శ్రద్దలతో ఆ గణనాధుణ్ని పూజిస్తారు. అయితే వినాయకుని ప్రతిమని ప్రతిష్టించడంతో ప్రారంభమైన ఈ పండుగ నిమజ్జనంతో పూర్తవుతుంది. నది, కాలువ, చెరువు ఇలా నీటివనరులు దగ్గరగా ఉన్న వాళ్ళు గణేష్ ప్రతిమని నీరు ఉన్న వనరుల దగ్గరకి తీసుకెళ్లి నిమజ్జనం చేస్తారు. మరి ఆ అవకాశం లేని వాళ్ళు నిమజ్జనం చేయడానికి ఎంతగానో ఇబ్బందులను ఎదుర్కొంటుంటారు. కానీ అలా వ్యయప్రయాసలకు గురి కాకుండా ఇంట్లోనే వినాయకుని ప్రతిమను నిమజ్జనం చేయొచ్చు. ఎలా చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Read also:Ganesh chathurthi: ఈ మంత్రం చెప్తూ గణేష్ నిమజ్జనం చేస్తే 100 శాతం పూజాఫలం
Also Read
- Thursday Horoscope: ఆ రాశివారు అనుకున్న పనుల అంచనాలు తారుమారతాయి.. జాగ్రత్త సుమీ..!
- Daily Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఆకస్మిక ఆర్థిక నష్టాలు తప్పవు!
- Daily Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభవార్తలే!
- Ram Mandir CEO Vacancy: రామ మందిరం సీఈవో పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం.. అర్హతలు ఏంటి..? ఎలాంటి సౌకర్యాలు లభిస్తాయో తెలుసా?
విగ్నేశ్వరున్ని నిమజ్జనం చేసే రోజు కూడా యధావిధిగా పూజ చేసి నైవేద్యం సమర్పించాలి. అనంతరం ఇంట్లో అందరూ తీర్ధ ప్రసాదాలు సేవించాలి. ఇప్పుడు 5 తమాలపాలకులు తీసుకుని ఒక పసుపు పూసిన దారానికి కట్టాలి. ఆ దారాన్ని నిమజ్జనం చేసే వాళ్ళు చేతికి కట్టుకోవాలి. కాగా ఇంట్లో నిమజ్జనం చెయ్యాలి అనుకున్నప్పుడు దీపం కొండకెక్కక ముందే చెయ్యాలి. అందుకు ముందుగా ఇంటి ఆవరణలో ముగ్గు వెయ్యాలి. శుచిగా ఉన్న ఒక బకెట్ లేదా టబ్బు ని తీసుకోవాలి. తరువాత బకెట్ లేదా టబ్బుని ముగ్గులో పెట్టాలి. ఇప్పుడు ఆ బకెట్ లేదా టబ్బులో నీళ్లు పొయ్యాలి. అనంతరం ఆ నీళ్లలో పసుపు, కుంకుమ, అక్షంతలు వెయ్యాలి.
Read also:Immersion of Ganesh idol : వినాయకుని విగ్రహాలు ఎందుకు నిమజ్జనం చేస్తారో తెలుసా..?
ఇప్పుడు గణేశునికి నమస్కరించి మండపంలో నుండి ప్రతిమని తీసుకోవాలి. “శ్రీ గణేశం ఉద్వాసయామి.. శోభనార్థం పునరాగమనాయచ” అనే మంత్రాన్ని జపిస్తూ రెండు చేతులతో వినాయకుని ప్రతిమని నీటిలో వదలాలి. ఎప్పుడు వినాయకుని ప్రతిమని విసిరేయకూడదు. నిదానంగా రెండు చేతులతో నీటిలో కలపాలి. అలా నిమజ్జనం చేసాక ప్రతిమ పూర్తిగా నీటిలో కరిగిపోయాక రావి చెట్టుకి లేదా మారేడు చెట్టుకి పోయాలి. పసుపు గణపతిని ఏదైనా చెట్టు మొదట్లో పెట్టాలి. కానీ తులసి చెట్టు మొదట్లో పెట్టకూడదు. ఎందుకంటే తులసి దేవికి విగ్నేశ్వరుడు ఇచ్చిన శాపం కారణంగా తులసిని వినాయకుని పూజకు వాడకూడదు. అలానే తులసి చెట్టు దగ్గర వినాయకుణ్ణి ఉంచకూడదు. అలానే వినాయకుని పూజలో ఉపయోగించిన ఆకులు, పువ్వులు మొదలైన వాటిని గొయ్యి తీసి పాతి పెట్టాలి.
తాజావార్తలు
-
Kallu Mama Song: 28 ఏళ్లైనా తగ్గని క్రేజ్.. అండర్వరల్డ్ యాంథమ్గా నిలిచిన ‘కల్లు మామ’ పాట
-
Peacock Mountain: ఇరాన్ పీకాక్స్ మౌంటైన్పై దాడికి ప్లాన్..ఈ అణు కేంద్రంపై అటాక్ జరిగితే అంతే సంగతి!
-
Russia Vs Ukraine: 3000కిలోల బరువున్న బాంబును విసిరింది.. యుద్ధంలో గేర్ మార్చిన రష్యా!
-
UPI MDR Charges: యూపీఐ పేమెంట్లపై ఇక ఛార్జీలు?.. కేంద్రం పరిశీలిస్తున్న కొత్త ప్రతిపాదన పూర్తి వివరాలు..!
-
El Nino: 150ఏళ్లలో తొలిసారి.. మహా విధ్వంసం తప్పదు! భయపెడుతున్న సైంటిస్టుల అంచనా
ట్రెండింగ్
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?