Vinayaka chavithi: వినాయకుని నిమజ్జనం ఇంట్లోనే ఇలా చెయ్యండి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ganesh chathurdhi: హిందువులు జరుపుకునే పండుగల్లో వినాయక చవితి కూడా ఒకటి. వినాయక చవితి రోజున భక్తులు వేకువ జామునే లేచి ఇల్లు శుభ్రం చేసుకుంటారు. తల స్నానం చేసి వినాయకుని మండపాన్ని అలంకరిస్తారు. ఆ విగ్నేశ్వరునికి ఇష్టమైన నైవేద్యాలను తాయారు చేస్తారు. భక్తి శ్రద్దలతో ఆ గణనాధుణ్ని పూజిస్తారు. అయితే వినాయకుని ప్రతిమని ప్రతిష్టించడంతో ప్రారంభమైన ఈ పండుగ నిమజ్జనంతో పూర్తవుతుంది. నది, కాలువ, చెరువు ఇలా నీటివనరులు దగ్గరగా ఉన్న వాళ్ళు గణేష్ ప్రతిమని నీరు ఉన్న వనరుల దగ్గరకి తీసుకెళ్లి నిమజ్జనం చేస్తారు. మరి ఆ అవకాశం లేని వాళ్ళు నిమజ్జనం చేయడానికి ఎంతగానో ఇబ్బందులను ఎదుర్కొంటుంటారు. కానీ అలా వ్యయప్రయాసలకు గురి కాకుండా ఇంట్లోనే వినాయకుని ప్రతిమను నిమజ్జనం చేయొచ్చు. ఎలా చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Read also:Ganesh chathurthi: ఈ మంత్రం చెప్తూ గణేష్ నిమజ్జనం చేస్తే 100 శాతం పూజాఫలం
Also Read
- Thursday Astrology Predictions: గురువారం దిన ఫలాలు.. షేర్లు, పెట్టుబడుల్లో లాభాలే లాభాలు!
- ASTROLOGY: ఆశ్లేష నక్షత్రంలోకి శుక్రుడు.. జూలై వరకు ఈ 4 రాశుల వారు జాగ్రత్త!
- Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి సమస్యలు, ఆటంకాలు తప్పవు1
- Monday Horoscope: ఆ రాశి వారికి నేడు డబ్బే డబ్బు.! నేటి రాశిఫలాలు ఇలా..
విగ్నేశ్వరున్ని నిమజ్జనం చేసే రోజు కూడా యధావిధిగా పూజ చేసి నైవేద్యం సమర్పించాలి. అనంతరం ఇంట్లో అందరూ తీర్ధ ప్రసాదాలు సేవించాలి. ఇప్పుడు 5 తమాలపాలకులు తీసుకుని ఒక పసుపు పూసిన దారానికి కట్టాలి. ఆ దారాన్ని నిమజ్జనం చేసే వాళ్ళు చేతికి కట్టుకోవాలి. కాగా ఇంట్లో నిమజ్జనం చెయ్యాలి అనుకున్నప్పుడు దీపం కొండకెక్కక ముందే చెయ్యాలి. అందుకు ముందుగా ఇంటి ఆవరణలో ముగ్గు వెయ్యాలి. శుచిగా ఉన్న ఒక బకెట్ లేదా టబ్బు ని తీసుకోవాలి. తరువాత బకెట్ లేదా టబ్బుని ముగ్గులో పెట్టాలి. ఇప్పుడు ఆ బకెట్ లేదా టబ్బులో నీళ్లు పొయ్యాలి. అనంతరం ఆ నీళ్లలో పసుపు, కుంకుమ, అక్షంతలు వెయ్యాలి.
Read also:Immersion of Ganesh idol : వినాయకుని విగ్రహాలు ఎందుకు నిమజ్జనం చేస్తారో తెలుసా..?
ఇప్పుడు గణేశునికి నమస్కరించి మండపంలో నుండి ప్రతిమని తీసుకోవాలి. “శ్రీ గణేశం ఉద్వాసయామి.. శోభనార్థం పునరాగమనాయచ” అనే మంత్రాన్ని జపిస్తూ రెండు చేతులతో వినాయకుని ప్రతిమని నీటిలో వదలాలి. ఎప్పుడు వినాయకుని ప్రతిమని విసిరేయకూడదు. నిదానంగా రెండు చేతులతో నీటిలో కలపాలి. అలా నిమజ్జనం చేసాక ప్రతిమ పూర్తిగా నీటిలో కరిగిపోయాక రావి చెట్టుకి లేదా మారేడు చెట్టుకి పోయాలి. పసుపు గణపతిని ఏదైనా చెట్టు మొదట్లో పెట్టాలి. కానీ తులసి చెట్టు మొదట్లో పెట్టకూడదు. ఎందుకంటే తులసి దేవికి విగ్నేశ్వరుడు ఇచ్చిన శాపం కారణంగా తులసిని వినాయకుని పూజకు వాడకూడదు. అలానే తులసి చెట్టు దగ్గర వినాయకుణ్ణి ఉంచకూడదు. అలానే వినాయకుని పూజలో ఉపయోగించిన ఆకులు, పువ్వులు మొదలైన వాటిని గొయ్యి తీసి పాతి పెట్టాలి.
తాజావార్తలు
-
Nitish Kumar Reddy: నాలుగేళ్ల తర్వాత స్వగ్రామంకు.. నానమ్మకు బంగారు గాజులు తొడిగిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!
-
Hindu Culture : శుభకార్యాల్లో రూ. 101, రూ. 501 ఎందుకు ఇస్తారు? ఈ ఒక్క రూపాయి సెంటిమెంట్ ఎందుకో తెలుసా ?
-
Hyderabad: ప్రజల ప్రాణాలతో చెలగాటం.. ఎలుకల మధ్య తయారైన ఫుడ్.. కుళ్లిన బిర్యానీ, కూరగాయలు..
-
Plastic Water Bottle: ప్లాస్టిక్ వాటర్ బాటిల్ను ఎంతకాలం వాడొచ్చు? వాటి కింద ఉన్న నంబర్ల అర్థం ఏమిటి?
-
Honda Vario EVO 160: హోండా వారియో ఇవో 160 స్కూటర్ విడుదల.. యమహా ఏరోక్స్ 155కు గట్టి పోటీ!
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!