Varasiddhi Vinayaka: కాణిపాకం విశిష్టత.. రోజు రోజుకి పెరుగుతున్న వినాయకుని విగ్రహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bakthi: ఏ పని ప్రారంభించిన తొలి పూజ వినాయకునికి చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఇలా మొదటి పూజ వినాయకుడికి చేసి పని ప్రారంభిస్తే ఎలాంటి ఆటంకాలు లేకుండా తలపెట్టిన పని విజయవంతంగా పూర్తవుతుందని ప్రజల నమ్మకం. అయితే వినాయకుడు స్వయంభూగా వెలసిన పుణ్యక్షేత్రం కాణిపాకం. ఆకాణిపాక వినాయకుని చరిత్ర ఏమిటి? అలానే ఆ గుడిలోని వినాయకుని విశిష్టత ఏమిటి ? అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Read also:Ganesh Chathurthi: విఘ్నేశ్వరునికి తులసి ఆకులతో పూజ చేయకూడదు ఎందుకో తెలుసా..?
Also Read
- Hindu Rituals: హిందూ సంప్రదాయంలో అందరికీ దహన సంస్కారమేనా? ఈ 5 మందిని కాల్చొద్దని ఎందుకు చెబుతారు?
- Dreaming: మీరు చనిపోయినట్లు కల వస్తుందా? షాక్ అయ్యే నిజం ఇదే!
- Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు జాగ్రత్త సుమీ!
- Thursday Horoscope: ఆ రాశివారు అనుకున్న పనుల అంచనాలు తారుమారతాయి.. జాగ్రత్త సుమీ..!
పూర్వము విహారపురి అనే గ్రామంలో ముగ్గురు సోదరులు ఉండే వారు. వారిలో ఒకరు మూగ వాడు, మరొకడు చెవిటి వాడు, ఇంకొకరు గుడ్డి వాడు, కాగా వారికి గ్రామం సమీపంలో కొంచం పొలముంది. వాళ్ళు ముగ్గురు కలిసి ఆ పొలాన్ని సాగు చేసుకునేవారు. అయితే ఎప్పటిలానే పొలానికి వెళ్లిన ముగ్గురు పంటకి నీరు పెట్టాలని ప్రయత్నిస్తారు. కాగా బావిలో నీరు కొద్దిగానే ఉండడం చేత ఆ నీరు బయటకి రాకుండ ఉంటుంది. ఈ నేపథ్యంలో చెవిటివాడు బావిలోకి దిగి బావిని మరికొంచం లోతుగా తొవ్వాలని గడ్డపారతో తొవ్వడం ప్రారంభిస్తాడు. అలా అతను తొవ్వుతున్నప్పుడు అతని గడ్డపారకి ఒక రాయి తగిలి రక్తం అతనిపైన చిమ్ముతుంది. వెంటనే అతనికి చెవులు వినిపిస్తాయి.
Read also:Vinayaka chavithi: వినాయకుని నిమజ్జనం ఇంట్లోనే ఇలా చెయ్యండి?
వెంటనే అతను తన సోదరులను తీసుకువెళ్లి ఆ రక్తం నిండిన బావిని చూపిస్తాడు. ఇలా తన సోదరులు ఆ నీటిని తాకగానే గుడ్డివాడికి చూపు వస్తుంది. మూగ వాడికి మాట వస్తుంది. ఈ విషయం ఊర్లో తెలిసి అందరూ ఆ భావి దగ్గరకి వచ్చి చూడగా ఆ రాయి నుండి రక్తం కారుతూ ఉంటుంది. ఓ పురోహితుడు కొబ్బరి కాయలు కొడితే ఆ నీరు స్వామి మీద పడి రక్తం రావడం ఆగిపోతుంది అని చెప్తాడు. దానితో రాజు ఆజ్ఞ మేరకు ప్రజలంతా కొబ్బరికాయలు తెచ్చి బావిలో కొడతారు. ఆ కొబ్బరి నీళ్ళకి ఒకటిన్నర ఎకరాల భూమి తడుస్తుంది. అందుకే ఈ ప్రాంతానికి కాణిపాకం అనే పేరు వచ్చింది. కాణి అంటే చిత్తడి.. పాకం అంటే నీరు ప్రవహించిన ప్రాంతం అని అర్ధం . అయితే బావిలో వెలసిన వినాయకుడు ఇప్పటికి భక్తులకు బావిలోనే దర్శమిస్తున్నాడు. అంతే కాదు ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆ బావిలో నీరు ఇంకిపోదు. విశేషముగా విగ్నేశ్వరుడి విగ్రహం రోజు రోజుకి పెరుగుతుంది. ఈ వాస్తవానికి రుజువు కూడా ఉంది. కొన్ని దశాబ్దాల క్రితం ఓ భక్తుడు స్వామికి చేయించిన వెండి కవచం ప్రస్తుతం స్వామివారికి సరిపోవడం లేదు.
తాజావార్తలు
-
New Airport: మారబోతున్న ఉత్తర తెలంగాణ రూపురేఖలు.. రూ. 496.86 కోట్లతో ఆ విమానాశ్రయానికి ఆమోదం..
-
Naga Chaitanya : నాగార్జున నైజం బయటపెట్టిన నాగచైతన్య.. ‘లెనిన్’ సక్సెస్ మీట్లో సంచలన వ్యాఖ్యలు!
-
Indian IPL Player: బిగ్షాక్.. ఆ IPL స్టార్ ఆటగాడిని వెంటనే అరెస్ట్ చేయండి.. హైకోర్టు ఆదేశం..
-
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ కేసులో కొత్త మలుపు.. మద్యం మత్తే.. ఆత్మహత్యాయత్నం కాదంటున్న పోలీసులు!
-
Attack On Ship: ఉక్రెయిన్ ఒడెసా పోర్టులో కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయులు మృతి..
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!