Varasiddhi Vinayaka: కాణిపాకం విశిష్టత.. రోజు రోజుకి పెరుగుతున్న వినాయకుని విగ్రహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bakthi: ఏ పని ప్రారంభించిన తొలి పూజ వినాయకునికి చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఇలా మొదటి పూజ వినాయకుడికి చేసి పని ప్రారంభిస్తే ఎలాంటి ఆటంకాలు లేకుండా తలపెట్టిన పని విజయవంతంగా పూర్తవుతుందని ప్రజల నమ్మకం. అయితే వినాయకుడు స్వయంభూగా వెలసిన పుణ్యక్షేత్రం కాణిపాకం. ఆకాణిపాక వినాయకుని చరిత్ర ఏమిటి? అలానే ఆ గుడిలోని వినాయకుని విశిష్టత ఏమిటి ? అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Read also:Ganesh Chathurthi: విఘ్నేశ్వరునికి తులసి ఆకులతో పూజ చేయకూడదు ఎందుకో తెలుసా..?
Also Read
- Shani Trayodashi 2026: రేపే శని త్రయోదశి.. పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయొద్దు..
- Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. వృత్తి, ఉద్యోగ రంగాల్లో మిశ్రమ ఫలితాలు!
- Thursday Astrology Predictions: గురువారం దిన ఫలాలు.. షేర్లు, పెట్టుబడుల్లో లాభాలే లాభాలు!
- ASTROLOGY: ఆశ్లేష నక్షత్రంలోకి శుక్రుడు.. జూలై వరకు ఈ 4 రాశుల వారు జాగ్రత్త!
పూర్వము విహారపురి అనే గ్రామంలో ముగ్గురు సోదరులు ఉండే వారు. వారిలో ఒకరు మూగ వాడు, మరొకడు చెవిటి వాడు, ఇంకొకరు గుడ్డి వాడు, కాగా వారికి గ్రామం సమీపంలో కొంచం పొలముంది. వాళ్ళు ముగ్గురు కలిసి ఆ పొలాన్ని సాగు చేసుకునేవారు. అయితే ఎప్పటిలానే పొలానికి వెళ్లిన ముగ్గురు పంటకి నీరు పెట్టాలని ప్రయత్నిస్తారు. కాగా బావిలో నీరు కొద్దిగానే ఉండడం చేత ఆ నీరు బయటకి రాకుండ ఉంటుంది. ఈ నేపథ్యంలో చెవిటివాడు బావిలోకి దిగి బావిని మరికొంచం లోతుగా తొవ్వాలని గడ్డపారతో తొవ్వడం ప్రారంభిస్తాడు. అలా అతను తొవ్వుతున్నప్పుడు అతని గడ్డపారకి ఒక రాయి తగిలి రక్తం అతనిపైన చిమ్ముతుంది. వెంటనే అతనికి చెవులు వినిపిస్తాయి.
Read also:Vinayaka chavithi: వినాయకుని నిమజ్జనం ఇంట్లోనే ఇలా చెయ్యండి?
వెంటనే అతను తన సోదరులను తీసుకువెళ్లి ఆ రక్తం నిండిన బావిని చూపిస్తాడు. ఇలా తన సోదరులు ఆ నీటిని తాకగానే గుడ్డివాడికి చూపు వస్తుంది. మూగ వాడికి మాట వస్తుంది. ఈ విషయం ఊర్లో తెలిసి అందరూ ఆ భావి దగ్గరకి వచ్చి చూడగా ఆ రాయి నుండి రక్తం కారుతూ ఉంటుంది. ఓ పురోహితుడు కొబ్బరి కాయలు కొడితే ఆ నీరు స్వామి మీద పడి రక్తం రావడం ఆగిపోతుంది అని చెప్తాడు. దానితో రాజు ఆజ్ఞ మేరకు ప్రజలంతా కొబ్బరికాయలు తెచ్చి బావిలో కొడతారు. ఆ కొబ్బరి నీళ్ళకి ఒకటిన్నర ఎకరాల భూమి తడుస్తుంది. అందుకే ఈ ప్రాంతానికి కాణిపాకం అనే పేరు వచ్చింది. కాణి అంటే చిత్తడి.. పాకం అంటే నీరు ప్రవహించిన ప్రాంతం అని అర్ధం . అయితే బావిలో వెలసిన వినాయకుడు ఇప్పటికి భక్తులకు బావిలోనే దర్శమిస్తున్నాడు. అంతే కాదు ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆ బావిలో నీరు ఇంకిపోదు. విశేషముగా విగ్నేశ్వరుడి విగ్రహం రోజు రోజుకి పెరుగుతుంది. ఈ వాస్తవానికి రుజువు కూడా ఉంది. కొన్ని దశాబ్దాల క్రితం ఓ భక్తుడు స్వామికి చేయించిన వెండి కవచం ప్రస్తుతం స్వామివారికి సరిపోవడం లేదు.
తాజావార్తలు
-
Beijing: బీజింగ్లో ఎత్తైన భవనాన్ని ఢీకొట్టిన విమానం.. వీడియో వైరల్
-
Bhatti Vikramarka : డ్రగ్స్పై భట్టి వార్నింగ్.. ఎంతటి వారైనా వదిలేదే లేదు.!
-
Red Chili Test: వంటగదిలో వాడే ఎండు మిర్చి కారం నకిలీదా..? అసలుదా..? సింపుల్గా తెలుసుకోండిలా..
-
Britain Heatwave: భారత్లో 45°C ఉన్నా ఏం కాదు.. బ్రిటన్లో 35°Cకే ప్రజలు ఎందుకు అల్లాడుతున్నారు?
-
NBK 112: కొరటాల సినిమా కోసం రూల్స్ బ్రేక్ చేసిన బాలయ్య
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!