మనం ఎంత కష్టపడి సంపాదించిన సరే.. చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండటం లేదని చాలా మంది అంటారు..అంటే శని ప్రభావం మన మీద ఉంటే అంతే. అని నిపుణులు చెబుతున్నారు.. ఎవరి జాతకంలోనైనా శని దోషం ఉంటే ఆ వ్యక్తి అనేక సమస్యలకు గురవుతూ ఉంటారు.. నిజానికి హిందూ మతంలో మంచి చెడుల కర్మలను శిక్షనిచ్చె దేవుడిగా శనిని పూజిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనీశ్వరుడికి రాజు, పేద అనే తేడా అసలు ఉండదు. ఏలినాటి శని ప్రభావం ప్రతి మనిషి జీవితంలో ఒక్కసారైనా వస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో సడే శని ఇబ్బందులను తొలగించడానికి సులభమైన మార్గాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
శని ప్రభావం పడిన వ్యక్తి ఆర్థిక, మానసిక, శరీరక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.ఎవరి జాతకంలోనైనా ఏలినాటి శని దోషం రెండున్నర సంవత్సరాలు ఉంటే, శని ప్రభావం ఏడున్నర సంవత్సరాలు ఉంటుంది.. ఈ శని ప్రభావాలు మూడు దశలుగా ఉంటుంది..ఒక వ్యక్తి భూమి, భవనం, ఆస్తి మొదలైన సమస్యలను ఎదుర్కొంటాడు. ఎలినాటి శని ప్రభావంతో రెండవ దశ మరింత బాధాకరమైనదిగా ఉంటుంది. రెండవ దశలో వ్యక్తికి డబ్బు కొరత ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉంటుంది.. ఈ దశలో మనిషి చనిపోయే ప్రమాదం కూడా ఉందని చెబుతున్నారు..
ఇక మూడోవ మొదటి రెండు దశల కన్నా తక్కువగా ఉంటుంది.. ఈ శని ప్రభావం నుంచి బయట పడాలంటే శనివారం నాడు కొన్ని పరిహారాలు చెయ్యాలని నిపుణులు చెబుతున్నారు..శని దేవాలయానికి వెళ్లి ఆవనూనెలో నల్ల నువ్వులు వేసి దీపం వెలిగించి ఇనుము, నూనె, నల్లగుడ్డ లేదా నల్ల ఉసిరి దానం చేయాలి. ఇంకా చెప్పాలంటే శని దేవుని అనుగ్రహం పొందడానికి శనివారం రోజు ధాతుర మూలాన్ని ధరించాలి. శనివారం ఉదయం పూట రావి చెట్టుకు నీరు సమర్పించి, సాయంత్రం చెట్టు కింద దీపం వెలిగించాలి.. నిస్సాహయ స్థితిలో ఉన్నవారికి తోచిన సాయం చెయ్యాలి.. అలాగే శని చాలీసా పటించాలి.. అప్పుడే శని ప్రభావం మన మీద తక్కువగా ఉంటుంది..