Garuda Purana: చనిపోయిన తర్వాత 13 రోజులు ఆత్మ ఎక్కడ ఉంటుంది? గరుడ పురాణం చెప్పిన నిజం!!
Garuda Purana: గరుడ పురాణం హిందూ మతంలోని 18 మహాపురాణాలలో ఒకటి. విష్ణుమూర్తికి, ఆయన వాహనమైన గరుడునికి మధ్య జరిగిన సంభాషణను ఇందులో రాశారు. ఈ పురాణం, జీవితం, మరణం, కర్మ, మరణానంతర జీవితానికి సంబంధించిన లోతైన విషయాలను చర్చిస్తుంది. ఓ వ్యక్తి మరణించిన తర్వాత సాధారణంగా గరుడ పురాణాన్ని పఠిస్తారు. ఇది ఆత్మకు శాంతిని చేకూరుస్తుందని నమ్ముతారు. గరుడ పురాణం ప్రకారం, మరణం అనేది కేవలం శరీరానికి మాత్రమే, ఆత్మకు కాదు. మరణానంతరం ఆత్మ ఒక అద్భుతమైన, అదే సమయంలో క్లిష్టమైన ప్రయాణాన్ని ప్రారంభిస్తుందని ఈ పురాణం వివరిస్తుంది. ఇక ప్రయాణంలో మొదటి 13 రోజులు అత్యంత కీలకమని శాస్త్రం చెబుతోంది.
READ MORE: AK47 : ఆదర్శ కుటుంబం’ టీమ్ నుంచి వెదొలగిన హర్షవర్ధన్ రమేశ్వర్.
Also Read
- Today Astrology: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఆకస్మిక ధన లాభం!
- Lucky Zodiac Signs : మీన రాశిలోకి శని.. రేపటి నుంచి ఈ రాశుల వారికి అదృష్టం పట్టబోతోంది..!
- Hindu Funeral Traditions: హిందూమతంలో పసిబిడ్డలను ఎందుకు దహనం చేయరో తెలుసా? అసలు కారణం ఇదేనా!
- Kedarnath: కేదార్నాథ్కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? స్కంద పురాణంలో ఉన్న అసలు రహస్యం ఇదే!
ఆ 13 రోజులు ఆత్మ ఎక్కడ ఉంటుంది?
మరణించిన వెంటనే ఆత్మ ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోదట. గరుడ పురాణం ప్రకారం.. ఓ మనిషి ప్రాణం పోయిన తర్వాత యమదూతలు ఆత్మను యమలోకానికి తీసుకువెళతారట. అక్కడ ఆ వ్యక్తి చేసిన పాపపుణ్యాల లెక్కలు చూసి తిరిగి ఆ ఆత్మను వారి ఇంటి వద్దే వదిలేస్తారట. 13 రోజుల పాటు ఆత్మ తన కుటుంబ సభ్యుల మధ్యే తిరుగుతూ ఉంటుంది. కుటుంబీకుల ఏడుపు, బాధను గమనిస్తుందట. కానీ వారితో మాట్లాడలేక, తాకలేక ఓ విధమైన వేదనకు గురవుతుందట. ఈ 13 రోజుల్లో పెట్టే పిండం ఆత్మకు ఆహారంగా మారుతుందని నమ్ముతారు. సుదీర్ఘమైన పరలోక ప్రయాణానికి కావాల్సిన శక్తిని ఈ కర్మకాండల ద్వారా ఆ ఆత్మ పొందుతుందట. మరణించిన 13వ రోజున చేసే సంస్కారమే ఆత్మ అంతిమ వీడ్కోలని ఈ పురాణం వివరిస్తోంది. ఈ రోజుతో ఆ ఆత్మకు ఈ ప్రపంచంతో ఉన్న లౌకిక బంధాలు తెగిపోతాయట. 13వ రోజు చేసే కార్యక్రమాల వల్ల ఆత్మకు ఒక సూక్ష్మ శరీరం ఏర్పడుతుందని, అది యమలోక మార్గంలో ప్రయాణించడానికి సిద్ధమవుతుందని గరుడ పురాణం వివరిస్తుంది. ఈ రోజు తర్వాతే ఆత్మ తన కర్మల ఆధారంగా వైతరణి నదిని దాటుతూ యమధర్మరాజు దర్బారుకు చేరుకుంటుందట. అందుకే 13వ రోజు చేసే దానధర్మాలు, బ్రాహ్మణ భోజనాలు ఆ ఆత్మకు మార్గమధ్యంలో ఉపశమనాన్ని కలిగిస్తాయని నమ్మకం. గరుడ పురాణం మనకు నేర్పే గొప్ప సత్యం ఏమిటంటే.. మనిషి జీవించి ఉన్నప్పుడు చేసే మంచి పనులే మరణం తర్వాత అతడిని నీడలా వెన్నాడుతాయి.
తాజావార్తలు
-
Garuda Purana: చనిపోయిన తర్వాత 13 రోజులు ఆత్మ ఎక్కడ ఉంటుంది? గరుడ పురాణం చెప్పిన నిజం!!
-
Varanasi :మెక్సికోలో రాజమౌళి మేజిక్ షురూ.. CCXP వేదికపై ‘వారణాసి’ ఎక్స్క్లూజివ్ గ్లింప్స్!
-
AK47 : ఆదర్శ కుటుంబం’ టీమ్ నుంచి వెదొలగిన హర్షవర్ధన్ రమేశ్వర్.
-
Tamil Nadu Election: 9 గంటలకే తమిళనాడులో భారీ పోలింగ్.. కారణమిదేనా?
-
8-Week OTT: ఓటీటీ రిలీజ్ గ్యాప్పై సౌత్ నిర్మాతల సంచలన నిర్ణయం..
ట్రెండింగ్
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?