Garuda Purana: చనిపోయిన తర్వాత 13 రోజులు ఆత్మ ఎక్కడ ఉంటుంది? గరుడ పురాణం చెప్పిన నిజం!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Garuda Purana: గరుడ పురాణం హిందూ మతంలోని 18 మహాపురాణాలలో ఒకటి. విష్ణుమూర్తికి, ఆయన వాహనమైన గరుడునికి మధ్య జరిగిన సంభాషణను ఇందులో రాశారు. ఈ పురాణం, జీవితం, మరణం, కర్మ, మరణానంతర జీవితానికి సంబంధించిన లోతైన విషయాలను చర్చిస్తుంది. ఓ వ్యక్తి మరణించిన తర్వాత సాధారణంగా గరుడ పురాణాన్ని పఠిస్తారు. ఇది ఆత్మకు శాంతిని చేకూరుస్తుందని నమ్ముతారు. గరుడ పురాణం ప్రకారం, మరణం అనేది కేవలం శరీరానికి మాత్రమే, ఆత్మకు కాదు. మరణానంతరం ఆత్మ ఒక అద్భుతమైన, అదే సమయంలో క్లిష్టమైన ప్రయాణాన్ని ప్రారంభిస్తుందని ఈ పురాణం వివరిస్తుంది. ఇక ప్రయాణంలో మొదటి 13 రోజులు అత్యంత కీలకమని శాస్త్రం చెబుతోంది.
READ MORE: AK47 : ఆదర్శ కుటుంబం’ టీమ్ నుంచి వెదొలగిన హర్షవర్ధన్ రమేశ్వర్.
Also Read
- Thursday Astrology Predictions: గురువారం దిన ఫలాలు.. షేర్లు, పెట్టుబడుల్లో లాభాలే లాభాలు!
- ASTROLOGY: ఆశ్లేష నక్షత్రంలోకి శుక్రుడు.. జూలై వరకు ఈ 4 రాశుల వారు జాగ్రత్త!
- Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి సమస్యలు, ఆటంకాలు తప్పవు1
- Monday Horoscope: ఆ రాశి వారికి నేడు డబ్బే డబ్బు.! నేటి రాశిఫలాలు ఇలా..
ఆ 13 రోజులు ఆత్మ ఎక్కడ ఉంటుంది?
మరణించిన వెంటనే ఆత్మ ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోదట. గరుడ పురాణం ప్రకారం.. ఓ మనిషి ప్రాణం పోయిన తర్వాత యమదూతలు ఆత్మను యమలోకానికి తీసుకువెళతారట. అక్కడ ఆ వ్యక్తి చేసిన పాపపుణ్యాల లెక్కలు చూసి తిరిగి ఆ ఆత్మను వారి ఇంటి వద్దే వదిలేస్తారట. 13 రోజుల పాటు ఆత్మ తన కుటుంబ సభ్యుల మధ్యే తిరుగుతూ ఉంటుంది. కుటుంబీకుల ఏడుపు, బాధను గమనిస్తుందట. కానీ వారితో మాట్లాడలేక, తాకలేక ఓ విధమైన వేదనకు గురవుతుందట. ఈ 13 రోజుల్లో పెట్టే పిండం ఆత్మకు ఆహారంగా మారుతుందని నమ్ముతారు. సుదీర్ఘమైన పరలోక ప్రయాణానికి కావాల్సిన శక్తిని ఈ కర్మకాండల ద్వారా ఆ ఆత్మ పొందుతుందట. మరణించిన 13వ రోజున చేసే సంస్కారమే ఆత్మ అంతిమ వీడ్కోలని ఈ పురాణం వివరిస్తోంది. ఈ రోజుతో ఆ ఆత్మకు ఈ ప్రపంచంతో ఉన్న లౌకిక బంధాలు తెగిపోతాయట. 13వ రోజు చేసే కార్యక్రమాల వల్ల ఆత్మకు ఒక సూక్ష్మ శరీరం ఏర్పడుతుందని, అది యమలోక మార్గంలో ప్రయాణించడానికి సిద్ధమవుతుందని గరుడ పురాణం వివరిస్తుంది. ఈ రోజు తర్వాతే ఆత్మ తన కర్మల ఆధారంగా వైతరణి నదిని దాటుతూ యమధర్మరాజు దర్బారుకు చేరుకుంటుందట. అందుకే 13వ రోజు చేసే దానధర్మాలు, బ్రాహ్మణ భోజనాలు ఆ ఆత్మకు మార్గమధ్యంలో ఉపశమనాన్ని కలిగిస్తాయని నమ్మకం. గరుడ పురాణం మనకు నేర్పే గొప్ప సత్యం ఏమిటంటే.. మనిషి జీవించి ఉన్నప్పుడు చేసే మంచి పనులే మరణం తర్వాత అతడిని నీడలా వెన్నాడుతాయి.
తాజావార్తలు
-
EPFO: పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. జూన్లో 3 రోజులు సేవలకు అంతరాయం
-
Nitish Kumar Reddy: నాలుగేళ్ల తర్వాత స్వగ్రామంకు.. నానమ్మకు బంగారు గాజులు తొడిగిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!
-
Hindu Culture : శుభకార్యాల్లో రూ. 101, రూ. 501 ఎందుకు ఇస్తారు? ఈ ఒక్క రూపాయి సెంటిమెంట్ ఎందుకో తెలుసా ?
-
Hyderabad: ప్రజల ప్రాణాలతో చెలగాటం.. ఎలుకల మధ్య తయారైన ఫుడ్.. కుళ్లిన బిర్యానీ, కూరగాయలు..
-
Plastic Water Bottle: ప్లాస్టిక్ వాటర్ బాటిల్ను ఎంతకాలం వాడొచ్చు? వాటి కింద ఉన్న నంబర్ల అర్థం ఏమిటి?
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!