Garuda Purana: చనిపోయిన తర్వాత 13 రోజులు ఆత్మ ఎక్కడ ఉంటుంది? గరుడ పురాణం చెప్పిన నిజం!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Garuda Purana: గరుడ పురాణం హిందూ మతంలోని 18 మహాపురాణాలలో ఒకటి. విష్ణుమూర్తికి, ఆయన వాహనమైన గరుడునికి మధ్య జరిగిన సంభాషణను ఇందులో రాశారు. ఈ పురాణం, జీవితం, మరణం, కర్మ, మరణానంతర జీవితానికి సంబంధించిన లోతైన విషయాలను చర్చిస్తుంది. ఓ వ్యక్తి మరణించిన తర్వాత సాధారణంగా గరుడ పురాణాన్ని పఠిస్తారు. ఇది ఆత్మకు శాంతిని చేకూరుస్తుందని నమ్ముతారు. గరుడ పురాణం ప్రకారం, మరణం అనేది కేవలం శరీరానికి మాత్రమే, ఆత్మకు కాదు. మరణానంతరం ఆత్మ ఒక అద్భుతమైన, అదే సమయంలో క్లిష్టమైన ప్రయాణాన్ని ప్రారంభిస్తుందని ఈ పురాణం వివరిస్తుంది. ఇక ప్రయాణంలో మొదటి 13 రోజులు అత్యంత కీలకమని శాస్త్రం చెబుతోంది.
READ MORE: AK47 : ఆదర్శ కుటుంబం’ టీమ్ నుంచి వెదొలగిన హర్షవర్ధన్ రమేశ్వర్.
Also Read
- Daily Horoscope: బుధవారం రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి ఊహించని శుభవార్తలు!
- Today Astrology: మే 12 దిన ఫలాలు.. తొందరపాటు నిర్ణయాలు వద్దు.. వృత్తి వ్యాపారాల్లో అనుకూల ఫలితాలు!
- Daily Horoscope: సోమవారం దిన ఫలాలు.. వ్యాపారం, షేర్ల విషయంలో తొందరపాటు వద్దు!
- Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి డబ్బే డబ్బు!
ఆ 13 రోజులు ఆత్మ ఎక్కడ ఉంటుంది?
మరణించిన వెంటనే ఆత్మ ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోదట. గరుడ పురాణం ప్రకారం.. ఓ మనిషి ప్రాణం పోయిన తర్వాత యమదూతలు ఆత్మను యమలోకానికి తీసుకువెళతారట. అక్కడ ఆ వ్యక్తి చేసిన పాపపుణ్యాల లెక్కలు చూసి తిరిగి ఆ ఆత్మను వారి ఇంటి వద్దే వదిలేస్తారట. 13 రోజుల పాటు ఆత్మ తన కుటుంబ సభ్యుల మధ్యే తిరుగుతూ ఉంటుంది. కుటుంబీకుల ఏడుపు, బాధను గమనిస్తుందట. కానీ వారితో మాట్లాడలేక, తాకలేక ఓ విధమైన వేదనకు గురవుతుందట. ఈ 13 రోజుల్లో పెట్టే పిండం ఆత్మకు ఆహారంగా మారుతుందని నమ్ముతారు. సుదీర్ఘమైన పరలోక ప్రయాణానికి కావాల్సిన శక్తిని ఈ కర్మకాండల ద్వారా ఆ ఆత్మ పొందుతుందట. మరణించిన 13వ రోజున చేసే సంస్కారమే ఆత్మ అంతిమ వీడ్కోలని ఈ పురాణం వివరిస్తోంది. ఈ రోజుతో ఆ ఆత్మకు ఈ ప్రపంచంతో ఉన్న లౌకిక బంధాలు తెగిపోతాయట. 13వ రోజు చేసే కార్యక్రమాల వల్ల ఆత్మకు ఒక సూక్ష్మ శరీరం ఏర్పడుతుందని, అది యమలోక మార్గంలో ప్రయాణించడానికి సిద్ధమవుతుందని గరుడ పురాణం వివరిస్తుంది. ఈ రోజు తర్వాతే ఆత్మ తన కర్మల ఆధారంగా వైతరణి నదిని దాటుతూ యమధర్మరాజు దర్బారుకు చేరుకుంటుందట. అందుకే 13వ రోజు చేసే దానధర్మాలు, బ్రాహ్మణ భోజనాలు ఆ ఆత్మకు మార్గమధ్యంలో ఉపశమనాన్ని కలిగిస్తాయని నమ్మకం. గరుడ పురాణం మనకు నేర్పే గొప్ప సత్యం ఏమిటంటే.. మనిషి జీవించి ఉన్నప్పుడు చేసే మంచి పనులే మరణం తర్వాత అతడిని నీడలా వెన్నాడుతాయి.
తాజావార్తలు
-
Shubman Gill: “మా ప్లాన్ వర్కవుట్ అయింది”.. హైదరాబాద్పై భారీ విజయం తర్వాత గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
Ramayana: ‘రామాయణ’లో..సాయి పల్లవిపై మేకర్స్ కీలక నిర్ణయం!
-
Daily Horoscope: బుధవారం రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి ఊహించని శుభవార్తలు!
-
Pat Cummins: “ఏం పర్వాలేదు.. ప్లేఆఫ్స్కు ఇంకా ఛాన్స్ ఉందిగా”.. కెప్టెన్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!