Ganesh Chaturthi 2025: వినాయక నిమజ్జనం రోజు డీజేలకు అనుమతి ఉందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ganesh Chaturthi 2025: ఈ నెల 27 దేశవ్యాప్తంగా వినాయక చవితి ప్రారంభం కానుంది. ఈ మేరకు నెల రోజుల నుంచే చిన్నా పెద్ద తేడా లేకుండా అంతా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి పెద్ద ఎత్తున చేసుకుంటాం. ఉత్సవాల నేపథ్యంలో పోలీసులు ఎప్పటి కప్పుడు ఆంక్షలు పెడుతూనే ఉంటారు. మండపాలు ఏర్పాటు చేసుకునే వాళ్లకు తెలంగాణ పోలీసులు కీలక సూచనలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నారు. అందుకు గానే తెలంగాణ పోలీసు అధికారిక వెబ్సైట్లో మండపాల నిర్వాహకుల పేర్లు నమోదు చేసుకోవాలని పోలీసులు స్పష్టం చేశారు.
READ MORE: SBI Robbery : క్యాషియరే కన్నం వేశాడు.. చెన్నూరు ఎస్బీఐ-2 బ్రాంచ్ చోరీలో అసలు డ్రామా
Also Read
- Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభవార్తలే, పండగే ఇవాళ!
- Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఆకస్మిక ధన లాభాలు!
- Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. అప్పులు అస్సలు ఇవ్వొద్దు, తీసుకోవద్దు సుమీ!
- Today Astrology: మంగళవారం దిన ఫలాలు.. కలిసి రానున్న ఆర్థిక లావాదేవీలు!
ఇప్పటికే.. ఆయా జిల్లాలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీలు ఆదేశాలు జారీ చేస్తున్నారు. డీఎస్పీలు, సీఐలతో సమీక్ష సమావేశం నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేస్తున్నారు. విగ్రహాల ప్రతిష్ఠాపన విషయంలో నిర్వాహకులతో ముందుగానే సమావేశాలు ఏర్పాటు చేయాలని, ఎక్కడా శాంతిభద్రతల సమస్య తలెత్తనివ్వొద్దని జిల్లా ఎస్పీలు చెబుతున్నారు. మండపాల్లో డీజే ఏర్పాటుకు అనుమతి లేదని ఇప్పటికే తేల్చి చెప్పేశారు. ప్రతి మండప నిర్వాహకుల వివరాలు తీసుకోవాలని స్థానిక పోలీసులకు సూచించారు. మరోవైపు.. ఆయా మండలాల్లో వినాయక మండపాల నిర్వాహకులతో ఎస్సై, సీఐలు మీటింగ్లు నిర్వహిస్తున్నారు. డీజేలకు అనుమతి లేదని కండీషన్లు పెడుతున్నారు.
READ MORE: Saipallavi : శ్రీలీల, కృతిశెట్టి, భాగ్య శ్రీ.. సాయిపల్లవిని చూసి నేర్చుకోండి..
కాగా.. ప్రజలు, ట్రాఫిక్కు అంతరాయం కలిగే ప్రాంతాల్లో మండపాలు ఏర్పాటు చేయవద్దు. విద్యుత్, ఇతర ఉపకరణాలతో అగ్నిప్రమాదాలు తలెత్తకుండా జాగ్రత్తపడాలి. విద్యుత్ నియంత్రికల సమీపంలో మండపాలు ఏర్పాటు చేయడం శ్రేయస్కరం కాదు. విద్యుత్ సరఫరా కోసం సంబంధిత శాఖ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి. మండపాల వద్ద డీజే శబ్దాలతో స్థానికులను ఇబ్బందులకు గురిచేయవద్దు. నిమజ్జనం రోజున డీజేలకు అనుమతి లేదు. పోలీసుల సూచనల మేరకు తగిన సౌండ్ సిస్టమ్ ఏర్పాటుచేసుకోవాలి. నిమజ్జనం సందర్భంలో ప్రమాదాలు తలెత్తకుండా చెరువులు, కుంటల వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!