Maruti Suzuki Ciaz: షాకింగ్.. మారుతి సుజుకి సియాజ్ అమ్మకాలు నిలిపివేత.. కారణం?
- సియాజ్ను నిలిపేందుకు కంపెనీ యత్నం
- ఏప్రిల్ 2025 నాటికి అమ్మకాల నిలిపివేత
- మార్చి, 2025 నాటికి తయారీ బంద్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మారుతి సుజుకి భారతదేశంలో తన ప్రసిద్ధ మిడ్-సైజ్ సెడాన్ సియాజ్ అమ్మకాలను నిలిపివేయడానికి సన్నాహాలు చేస్తోంది. మారుతి సియాజ్ అమ్మకాలు నిరంతరం తగ్గుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటుంది. ఆటోకార్ ఇండియాలో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. మారుతి సియాజ్ అమ్మకాలు ఏప్రిల్ 2025 నాటికి నిలిపివేయబతాయి. ఈ కారు ఉత్పత్తి మార్చి, 2025 నాటికి ఆగిపోతుందని భావిస్తున్నారు. అయితే, ఈ విషయంలో కంపెనీ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.
READ MORE: Shivraj Singh: ఎయిరిండియాలో కేంద్రమంత్రికి చేదు అనుభవం.. విరిగిపోయిన సీటులో ప్రయాణం
Also Read
- BMW Vision K18: భవిష్యత్ హై-పర్ఫార్మెన్స్ టూరింగ్ బైక్.. బీఎండబ్ల్యూ విజన్ K18 ఆవిష్కరణ
- Electric Scooters: ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఒక రూపాయికే 4 కిలోమీటర్ల ప్రయాణం.. ధరలు కేవలం రూ.50,000 నుండి ప్రారంభం
- Honda Hybrid Sedan: హోండా నెక్స్ట్ జనరేషన్ హైబ్రిడ్ సెడాన్.. 10% ఎక్కువ మైలేజ్, 30% తక్కువ ఖర్చు!
- Green Invicta: గ్రీన్ ఇన్విక్టా ఎలక్ట్రిక్ స్కూటర్ పై రూ.45000 డిస్కౌంట్.. చౌక ధరకే సొంతం చేసుకోండి.. 60KM రేంజ్
వాస్తవానికి.. మారుతి సియాజ్ 2014 సంవత్సరంలో భారత మార్కెట్లో వచ్చింది. సియాజ్ ప్రారంభంచినప్పుడు విజయాన్ని సాధించింది. హోండా సిటీ, హ్యుందాయ్ వెర్నాతో పోటీ పడుతూ వచ్చింది. మంచి మైలేజ్తో దూసుకు పోయింది. కానీ.. ఇటీవల అమ్మకాలు నిరంతరం తగ్గుతూ వచ్చాయి. 2020లో కంపెనీ తన డీజిల్ వేరియంట్ను నిలిపివేయడంతో సియాజ్ అమ్మకాలు పెద్ద దెబ్బ తిన్నాయి. ప్రస్తుతం సియాజ్లో 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ మాత్రమే అందుబాటులో ఉంది. గతేడాది గణాంకాలు గమనిస్తే.. అక్టోబర్ 2024లో మారుతి సియాజ్ మొత్తం 659 మంది కొత్త కస్టమర్లను పొందింది. అయితే నవంబర్ 2024లో మొత్తం 597 మంది మారుతి సియాజ్ను కొనుగోలు చేశారు. డిసెంబర్ 2024లో 464 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. 2025 జనవరిలో 768 మంది కస్టమర్లకు మాత్రమే విక్రయించారు. మరోవైపు.. కంపెనీ చివరి సారిగా 2018 సంవత్సరంలో సియాజ్ వేరియంట్ను అప్గ్రేడ్ చేసింది. మళ్లీ ఇంత వరకూ కొత్త వేరియంట్ అందుబాటులోకి రాలేదు. కాగా.. సియాజ్ ధర రూ. 9.41 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమై టాప్-ఎండ్ మోడల్కు రూ. 12.29 లక్షల వరకు ఉంటుంది.
READ MORE: Bhatti Vikramarka : ఫైనల్గా బీసీ జనాభా 56 శాతం.. సర్వే పకడ్బందీగా జరిగింది
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!