Maruti Suzuki Ciaz: షాకింగ్.. మారుతి సుజుకి సియాజ్ అమ్మకాలు నిలిపివేత.. కారణం?
- సియాజ్ను నిలిపేందుకు కంపెనీ యత్నం
- ఏప్రిల్ 2025 నాటికి అమ్మకాల నిలిపివేత
- మార్చి, 2025 నాటికి తయారీ బంద్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మారుతి సుజుకి భారతదేశంలో తన ప్రసిద్ధ మిడ్-సైజ్ సెడాన్ సియాజ్ అమ్మకాలను నిలిపివేయడానికి సన్నాహాలు చేస్తోంది. మారుతి సియాజ్ అమ్మకాలు నిరంతరం తగ్గుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటుంది. ఆటోకార్ ఇండియాలో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. మారుతి సియాజ్ అమ్మకాలు ఏప్రిల్ 2025 నాటికి నిలిపివేయబతాయి. ఈ కారు ఉత్పత్తి మార్చి, 2025 నాటికి ఆగిపోతుందని భావిస్తున్నారు. అయితే, ఈ విషయంలో కంపెనీ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.
READ MORE: Shivraj Singh: ఎయిరిండియాలో కేంద్రమంత్రికి చేదు అనుభవం.. విరిగిపోయిన సీటులో ప్రయాణం
Also Read
- SUV Safety: ఎస్యూవీలతో పాదచారులకు ముప్పు.. 8 ఏళ్లలో 3,000కు పైగా మరణాలు!
- Suzuki GSX250R: సుజుకీ GSX250R ఆవిష్కరణ.. భారత్లో కూడా విడుదలవుతుందా?
- BMW X6 Facelift: భారత్లో BMW X6 ఫేస్లిఫ్ట్ లాంచ్.. 530HP పవర్, జస్ట్ 4.3 సెకన్స్ లో 100kmph స్పీడ్
- TVS NTORQ 125: కొత్త కలర్స్, స్పోర్టీ గ్రాఫిక్స్తో టీవీఎస్ NTORQ 125.. యువత కోసం స్టైలిష్ అప్డేట్, ధరలు ఇవే!
వాస్తవానికి.. మారుతి సియాజ్ 2014 సంవత్సరంలో భారత మార్కెట్లో వచ్చింది. సియాజ్ ప్రారంభంచినప్పుడు విజయాన్ని సాధించింది. హోండా సిటీ, హ్యుందాయ్ వెర్నాతో పోటీ పడుతూ వచ్చింది. మంచి మైలేజ్తో దూసుకు పోయింది. కానీ.. ఇటీవల అమ్మకాలు నిరంతరం తగ్గుతూ వచ్చాయి. 2020లో కంపెనీ తన డీజిల్ వేరియంట్ను నిలిపివేయడంతో సియాజ్ అమ్మకాలు పెద్ద దెబ్బ తిన్నాయి. ప్రస్తుతం సియాజ్లో 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ మాత్రమే అందుబాటులో ఉంది. గతేడాది గణాంకాలు గమనిస్తే.. అక్టోబర్ 2024లో మారుతి సియాజ్ మొత్తం 659 మంది కొత్త కస్టమర్లను పొందింది. అయితే నవంబర్ 2024లో మొత్తం 597 మంది మారుతి సియాజ్ను కొనుగోలు చేశారు. డిసెంబర్ 2024లో 464 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. 2025 జనవరిలో 768 మంది కస్టమర్లకు మాత్రమే విక్రయించారు. మరోవైపు.. కంపెనీ చివరి సారిగా 2018 సంవత్సరంలో సియాజ్ వేరియంట్ను అప్గ్రేడ్ చేసింది. మళ్లీ ఇంత వరకూ కొత్త వేరియంట్ అందుబాటులోకి రాలేదు. కాగా.. సియాజ్ ధర రూ. 9.41 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమై టాప్-ఎండ్ మోడల్కు రూ. 12.29 లక్షల వరకు ఉంటుంది.
READ MORE: Bhatti Vikramarka : ఫైనల్గా బీసీ జనాభా 56 శాతం.. సర్వే పకడ్బందీగా జరిగింది
తాజావార్తలు
-
HYDRA Operation: హస్మత్పేటలో ఆపరేషన్.. రూ.750 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా!
-
Smartphone Theft: ఫోన్ పోయిందా? మొదటి 15 నిమిషాల్లో ఈ పనులు చేయకపోతే డేటా, డబ్బు రెండూ పోవచ్చు
-
Cyber Crime Recovery Mela: సైబర్ క్రైమ్ రికవరీ మేళా.. 310 మంది బాధితులకు రూ.6 కోట్ల రికవరీ చెక్కులు..
-
Tollywood First Half Results : టాలీవుడ్ ఫస్ట్ హాఫ్.. అదరగొట్టిన చిరు.. ఆదుకున్న సమంత
-
NEET Paper Leak: నీట్ పేపర్ లీకేజీపై ఎస్ఎఫ్ఐ ఆందోళన.. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్!
ట్రెండింగ్
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!