Deloitte Analysis: హైబ్రీడ్ ఎలక్ట్రిక్ వాహనాలకు భారతీయుల ప్రాధాన్యం.. ఆటోమొబైల్ సర్వేలో కీలక విషయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deloitte Analysis: ఆటోమొబైల్ రంగంలోని ఇటీవల కాలంలో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సాంప్రదాయ పెట్రోల్/డిజిల్ ఆధారిత ఇంటర్నల్ కంబర్షన్ ఇంజన్(ICE) సాంకేతిక నుంచి ఎలక్ట్రిక్ వాహనాలు(EV), హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాలకు (HEV) వరకు వాహన రంగం అభివృద్ధి చెందింది. డెలాయిట్ యొక్క ఇటీవలి గ్లోబల్ ఆటోమోటివ్ కన్స్యూమర్ స్టడీ (GACS) ప్రకారం.. 50 శాతం మంది భారతీయ వినియోగదారులు పెట్రోల్/డిజిల్ ఇంజన్ల నుంచి హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాలకు (HEV)లకు ప్రాధన్యత ఇస్తున్నట్లుగా తేలింది. 2023 అక్టోబర్ 5 నుండి 12వ తేదీ వరకు నిర్వహించబడిన డెలాయిట్ అధ్యయనం 1,000 మంది భారతీయ వినియోగదారులను సర్వే చేసింది.
80 శాతం మంది రూ. 5 లక్షల నుంచి రూ. 25 లక్షల మధ్య కారును కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. రూ.10 లక్షలు- రూ. 25 లక్షల లోపు వాహనాల్లో 59 శాతం పెట్రోల్/డిజిల్ ఇంజన్ వాహనాలకు మొగ్గు చూపగా.. 58 శాతం మంది ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రాధాన్యత ఇచ్చారు. రూ. 10 లక్షలు అంతకంటే తక్కువ ధరల వాహనాల్లో 23 శాతం ICE వాహనాలకు ప్రాధాన్యత ఇవ్వగా.. 22 శాతం మంది EVలను ఇష్టపడుతున్నారు.
Also Read
- BMW X6 Facelift: భారత్లో BMW X6 ఫేస్లిఫ్ట్ లాంచ్.. 530HP పవర్, జస్ట్ 4.3 సెకన్స్ లో 100kmph స్పీడ్
- TVS NTORQ 125: కొత్త కలర్స్, స్పోర్టీ గ్రాఫిక్స్తో టీవీఎస్ NTORQ 125.. యువత కోసం స్టైలిష్ అప్డేట్, ధరలు ఇవే!
- India Tractor Sales: ఒక్క నెలలో 83,000 ట్రాక్టర్లు సేల్.. ఈ బ్రాండ్ కే జై కొట్టిన రైతులు
- Hero Passion+ Disc: న్యూ లుక్, డిజిటల్ ఫీచర్లతో విడుదలైన హీరో ప్యాషన్ కొత్త మోడల్.. 71KM మైలేజీ
Read Also: Chaari 111: ‘చారి 111’కి సీక్వెల్… రుద్రనేత్ర యూనివర్స్లోకి స్టార్ హీరోలు!
ఈ స్టడీలో పాల్గొన్న 68 శాతం మంది పర్యావరణాన్ని ప్రస్తావించారు. చార్జింగ్ మౌలిక సదుపాయల గురించి విషయాల్లో, 66 శాతం మంది డ్రైవర్లు తమ వాహనాలను ఇంటి వద్దే ఛార్జ్ చేస్తామని, 22 శాతం పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లలో ఛార్జ్ చేస్తామని చెప్పారు. ఫాస్ట్ ఛార్జింగ్ అవసరమని, ఎక్కువ మంది కస్టమర్లు క్రెడిట్/డెబిట్ కార్డ్ చెల్లింపులకు ఇష్టపడుతున్నట్లు తెలిపారు.
సర్వే ప్రకారం.. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లభ్యత, బ్యాటరీ భద్రత మరియు ఛార్జింగ్ సమయాల్లో కొనసాగుతున్న సమస్యలు నేపథ్యంలో కొత్త కారు కొనేవారు హైబ్రిడ్ టెక్నాలజీని ఇష్టపడుతున్నారు. యాజ్డ్ కార్ల కన్నా కొత్త కారు కొనేందుకు మొగ్గు చూపుతున్నారు. కనెక్టెడ్ వెహికల్స్ విషయాని వస్తే భద్రతకు భారతీయులు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. 71 శాతం మంది కనెక్టెడ్ ఫీచర్ల కోసం ఎక్కువ చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారు. 88 శాతం మంది రోడ్ సేఫ్టీ, కొలిజన్ ప్రివెన్షన్ కోరుకోగా.. 88 శాతం మంది మెయింటనెన్స్ అప్డేట్స్, వెహికిల్స్ హెల్త్ అలర్ట్ కోరుతున్నారు.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!