H-1B visa: ట్రంప్ H-1B వీసా చర్యతో ఎయిర్పోర్టుల్లో గందరగోళం..పెరిగిన అమెరికా విమాన ఛార్జీలు..
- ట్రంప్ హెచ్1బీ వీసా చర్యతో ఎయిర్పోర్టుల్లో గందరగోళం..
- అమెరికాలో విమానాలు దిగిపోయిన భారతీయులు..
- న్యూఢిల్లీ నుంచి అమెరికాకు పెరిగిన విమాన ఛార్జీలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
H-1B visa: H-1B వీసాలపై ట్రంప్ తీసుకున్న నిర్ణయం భారతీయ టెక్కీల్లో భయాన్ని నింపాయి. H-1B వీసాల రుసుమును $100,000 (రూ. 88 లక్షలు)కి పెంచాలని US అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆకస్మికంగా తీసుకున్న చర్యతో, ముఖ్యంగా ఆ దేశంలో ఉంటున్న భారతీయులకు పెద్ద దెబ్బగా చెప్పవచ్చు. దీనికి తోడు సెప్టెంబర్ 21 వరకు మాత్రమే గడువు విధించడంతో అమెరికా విమానాశ్రయాల్లో గందరగోళం మొదలైంది. ప్రకటన వెలువడిన వెంటనే భారతీయ టెక్కీలు విమానాల నుంచి దిగిపోయినట్లు నివేదికలు వస్తున్నాయి.
ఇదే కాకుండా, ట్రంప్ నిర్ణయాన్ని క్యాష్ చేసుకునేందుకు విమానయాన సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. దీంతో భారత్ నుంచి అమెరికా వెళ్లే విమాన ఛార్జీలు ఒక్కసారిగా పెరిగాయి. భారత్లో చిక్కుకుపోయిన వారు హుటాహుటిన అమెరికా వెళ్లేందుకు విమానాశ్రయాలకు చేరుకుంటున్నారు. దీంతో, అమెరికా వెళ్లే అన్ని విమానాల ధరలు పెరిగాయి. H-1B వీసాలు కలిగిన వారిలో భారతీయులే 70 శాతం మంది ఉండటంతో ఈ చర్య వారిని దెబ్బతీసింది.
Also Read
- Monsoon: తొలకరిపై అన్నదాతలకు ఐఎండీ గుడ్న్యూస్.. 2-3 రోజుల్లో కేరళకు రుతుపవనాలు
- Dk.Shivakumar: రేపు ఖర్గే, రాహుల్గాంధీతో డీకే.శివకుమార్ భేటీ.. మంత్రివర్గ కూర్పుపై చర్చ
- Kapil Sibal: భారత్లో నివసించడానికి సిగ్గుగా ఉంది.. కపిల్ సిబల్ వ్యాఖ్యలపై బీజేపీ ఎదురుదాడి
- Annamalai: బీజేపీకి అన్నామలై గుడ్ బై..? సొంత పార్టీ వైపు అడుగులు.. ‘ఆ ఒక్క మాట’తో షేక్ అవుతున్న తమిళ పాలిటిక్స్!
Read Also: H-1B visa: ఆదివారం నుంచి అమెరికాలోకి ప్రవేశం నిషేధం.. భారతీయులపై H-1B వీసా పిడుగు..
నిబంధనల ప్రకారం, సెప్టెంబర్ 21, భారత కాలమాన ప్రకారం ఆదివారం ఉదయం 9.31 గంటల లోపు అమెరికాలో ఉండాలి. ఆ తర్వాత, వ్యక్తికి స్పాన్సర్ చేసే కంపెనీ లక్ష డాలర్లు అంటే రూ. 88 లక్షలు చెల్లించకుంటే అతడిని అమెరికాలోకి అనుమతించరు. అమెజాన్, మైక్రోసాఫ్ట్, జేపీ మోర్గాన్ వంటి అగ్రశ్రేణి కంపెనీలు H-1B వీసాలు కలిగి ఉన్న తమ ఉద్యోగులకు USను విడిచి వెళ్లవద్దని సూచించాయి. ప్రస్తుతం విదేశాల్లో ఉన్నవారు వెంటనే అమెరికాకు తిరిగి రావాలని కోరారు.
అయితే, భారత్లో సెలవులు, ఇతర పనుల కోసం వచ్చిన H-1B వీసాదారులు ఇప్పటికే గడువును కోల్పోయారు. భారత దేశం నుంచి నేరుగా విమానంలో ఇప్పటికి ఇప్పుడు వెళ్లినా సకాలంలో అమెరికా చేరుకునే అవకాశం లేదు. ట్రంప్ ప్రకటన వెలువడి వెంటనే రెండు గంటల్లోనే న్యూఢిల్లీ నుంచి న్యూయార్క్ వెళ్లే విమాన ఛార్జీలు రూ. 37,000 నుంచి రూ. 80,000 కి పెరిగింది. కనెక్టింగ్ ఫ్లయిట్స్ ద్వారా ఇండియాకు వచ్చే వారు మధ్యలోనే తన విమానాలు దిగిపోయి, మళ్లీ అమెరికా వెళ్లాలని భావిస్తున్నారు. అమెరికా నుంచి భారత్కు వద్దామని ప్లాన్ చేసుకున్న వారు, తమ ప్రయాణాలను క్యాన్సల్ చేసుకుంటున్నారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వీలైనంత త్వరగా బుడ్డోడిని టీమిండియా జట్టులోకి తీసుకరండి.. ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు..
-
Donald Trump: “నీకు పిచ్చి పట్టింది, నేను లేకపోతే నువ్వు జైల్లో ఉండేవాడివి” నెతన్యాహుపై ట్రంప్ ఫైర్
-
Italy Earthquake: ఇటలీలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.1 తీవ్రత
-
Buchi Babu: “నేను పెద్ది 100 సార్లు చూసి.. ఏడ్చేశా”.. పెద్ది మూవీపై బుచ్చిబాబు సంచలన వ్యాఖ్యలు!
-
Ram Charan : మీకోసం రక్తం చిందించడానికైనా సిద్ధమే.. చనిపోయే వరకు ఎంటర్టైన్ చేస్తా!
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!