Venu Goapl Reddy
Author- NTV Telugu-
Jammu Kashmir: కాశ్మీర్ లో రెండు ఎన్ కౌంటర్లు… నలుగురు లష్కర్ ఉగ్రవాదులు ఖతం
జమ్మూ కాశ్మీర్ లో వరసగా ఎన్ కౌంటర్లు జరుగుతున్నాయి. భద్రతా బలగాలు, పోలీసులు ఉగ్రవాదులను ఏరిపారేస్తున్నారు. తాజాగా గత రాత్రి మరో రెండు ఎన్ కౌంటర్లు జరిగాయి. అవంతి పొరా, శ్రీనగర్ ఎన్ కౌంటర్లలో నలుగురు లష్కర్ ఉగ్రవాదులను మట్టుపెట్టాయి భద్రతా బలగాలు. జమ్మూ కాశ్మీర్ లో టీవీ ఆర్టిస్ అమ్మీన్ భట్ ను ఒక రోజు ముందు ఉగ్రవాదులు హతమర్చారు. ఈ ఘటనకు పాల్పడిన ఉగ్రవాదులను 24 గంటలు తిరగకముందే భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. శ్రీనగర్ […] -
Navjot Singh Sidhu: జైలులో సిద్ధూ డైట్ మామూలుగా లేదుగా… కొబ్బరి నీళ్లు, ఆల్మండ్స్….
దాదాపుగా 30 ఏళ్ల క్రితం రోడు ప్రమాదంలో ఓ వ్యక్తి ప్రాణాలు పోవడానికి కారణం అయిన మాజీ క్రికెటర్, ప్రస్తుతం పంజాబ్ కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్దూ పాటియాలా సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఇటీవల సుప్రీం కోర్ట్ సిద్ధూకు ఒక ఏడాది శిక్ష విధించింది. అయితే అతని ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి డాక్టర్ల బోర్డు ప్రత్యేక ఆహారాన్ని సిఫారసు చేసింది. కొబ్బరి నీళ్లు, లాక్టోజ్ లేని పాలు, జ్యూస్, ఆల్మండ్ ఇలా ప్రత్యేక ఆహారాన్ని […] -
Assam: గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డాడు… పారిపోతుంటే కాల్చేశారు
అస్సాంలో సీఎం హిమంత బిశ్వ శర్మ నేరాలపై ఉక్కుపాదం మోపుతున్నాడు. నేరాల పట్ల కఠినంగా వ్యవహరించాలని పోలీసులకు పవర్స్ ఇచ్చాడు. తాజాగా బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడు పోలీసుల నుంచి తప్పించుకుపోయేందుకు ప్రయత్నించాడు. దీంతో పోలీసులు నిందితుడిపైకి కాల్పులు జరిపారు. అయితే అతని లక్ బాగుండి కేవలం గాయాలతో బయటపడ్డాడు. గురువారం అస్సాంలోని కోక్రాజార్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. సోమవారం రాత్రి సరుకులు తీసుకువస్తున్న క్రమంలో దోల్మారా గ్రామంలో 16 ఏళ్ల బాలికపై ముగ్గురు […] -
PM Modi: చెన్నై టూ కెనడా, మధురై టూ మలేషియా… తమిళం శాశ్వతం
ప్రధాని నరేంద్ర మోదీ చెన్నై టూర్ లో తమిళ భాషపై ప్రశంసలు కురిపించారు. తమిళనాడులో రూ. 31,000 కోట్లతో పలు డెవలప్మెంట్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా తమిళ భాషపై కీలక వ్యాఖ్యలు చేశారు. జాతీయ విద్యావిధానం భారతీయ భాషలను ప్రోత్సహించేందుకు ప్రాధాన్యత ఇస్తుతందని.. సాంకేతిక, వైద్య కోర్సులను స్థానిక భాషల్లో అభ్యసించేందుకు అవకాశం లభిస్తుందని ఆయన అన్నారు. దీని వల్ల తమిళ యువతకు మేలు జరుగుతుందని ప్రధాని మోదీ అన్నారు. తమిళ భాష శాశ్వతమైనదని..తమిళ సంస్కృతి […] -
MK Stalin: మోదీజీ… హిందీలాగే తమిళాన్ని అధికార భాష చేయండి
ప్రధాని హైదరాబాద్ పర్యటన తరువాత ప్రత్యేక విమానంలో చెన్నై వెళ్లారు. దాదాపు రూ. 31,000 కోట్లతో 11 డెవలప్మెంట్ ప్రాజెక్టులకు సీఎం ఎంకే స్టాలిన్ తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టుల్లో పలు రోడ్డు, రైల్వే ప్రాజెక్టులు ఉన్నాయి. తమిళనాడులో పర్యటిస్తున్న మోదీకి ఘన స్వాగతం పలికారు అక్కడి ప్రజలు. ఇదిలా ఉంటే తమిళనాడు సీఎం స్టాలిన్, ప్రధాని మోదీకి కొన్ని విజ్ఞప్తులు చేశారు. ముఖ్యంగా హిందీ లాగే తమిళాన్ని అధికార భాష చేయాలని.. మద్రాస్ […] -
Earthquake: పెరూలో భారీ భూకంపం.. 7.2 తీవ్రతతో కంపించిన భూమి
దక్షిణ అమెరికా దేశం పెరులో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 7.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. దక్షిణ పెరులోని అజాంగారో పట్టణానికి పశ్చిమ వాయువ్యంగా 8 మైళ్లదూరంలో భూకంప కేంద్రం ఉంది. లిటికాకా సరస్సుకు సమీపంలో ఈ భూకంపం సంభవించింది. ఈ ప్రాంతం పెరు- బొలీవియా దేశాల సరిహద్దుల్లో ఉంది. దాదాపుగా 217 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్ర ఉంది. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించలేదు. ఇదిలా ఉంటే […] -
Cause of Death 2020: కరోనా కాదు… ఎక్కువ మరణాలకు ఇవే కారణం
చైనాలో కరోనా 2019 చివర్లో ప్రారంభం అయినా… ఇండియాలో మాత్రం 2020 ఫిబ్రవరి- మార్చి నెలల్లో కరోనా కేసులు నమోదు అయ్యాయి. అయితే 2021 సెకండ్ వేవ్ లో పెద్ద ఎత్తున ప్రజలు కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. అయితే 2020 ఏడాదిలో వైద్యపరంగా ధ్రువీకరించిన మరణాలను బట్టి చూస్తే కరోనా కన్నా ఇతర అనారోగ్య సమస్యలతోనే ప్రజలు ఎక్కువగా మరణించారని తెలుస్తోంది. 2020లో వైద్యపరంగా ధ్రువీకరించిన మరణాల సంఖ్య దేశంలో 81.15 లక్షలు ఉంటే […] -
Gyanvapi Mosque case: తదుపరి విచారణ మే30కి వాయిదా
జ్ఞానవాపి మసీదు కేసు దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే. తాజాగా వారణాసి జిల్లా కోర్ట్ లో ఈ కేసుపై విచారణ జరగుతోంది. తాజాగా ఈ రోజు వీడియోగ్రఫీ సర్వేను ఛాలెంజ్ చేస్తూ అంజుమన్ ఇంతేజామియా వేసిన పిటిషన్ ను వారణాసి కోర్ట్ విచారించింది. అయితే కోర్ట్ ముస్లింల తరుపున తదుపరి వాదనలను వినేందుకు మే 30కి విచారణ వాయిదా వేసింది. అయితే ఇప్పటికే వీడియో సర్వేపై అభ్యంతరాలు దాఖలు చేసేందుకు హిందూ, ముస్లిం పక్షాలకు కోర్ట్ […] -
BMW i4: కొత్త ఈవీని లాంచ్ చేసిన బీఎండబ్ల్యూ… ఒక్కసారి ఛార్జ్ చేస్తే 590 కి.మి రేంజ్
ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. ద్విచక్ర వాహనాలతో పాటు ఎలక్ట్రిక్ కార్ల సేల్స్ పెరుగుతున్నాయి. టాటా కంపెనీ రిలీజ్ చేసిన నెక్సాన్ ఈవీ సూపర్ క్లిక్ అయింది. దీంతో పాటు ఎంజీ జెడ్ఎస్ ఈవీ, హ్యుందాయ్ కోనా కార్లు కూడా చాలా వరకు అమ్ముడుపోతున్నాయి. ఇదిలా ఉంటే ఇండియాలో ఈవీ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని జర్మనీ లగ్జరీ కార్ల దిగ్గజం బీఎండబ్ల్యూ కొత్తగా […] -
Taj Mahal: నమాజ్ కలకలం… హైదరాబాదీలతో సహా నలుగురి అరెస్ట్
ఉత్తర్ ప్రదేశ్ ఆగ్రాలోని తాజ్ మహల్ వద్ద నమాజ్ చేసినందుకు నలుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇందులో ముగ్గురు హైదరాబాద్ కు చెందిన వారు కాగా.. ఒకరు ఆజాంగఢ్ కు చెందిన వాడిగా పోలీసులు గుర్తించారు. బుధవారం సాయంత్రం తాజ్ మహల్ పరిధిలోని షాహీ మసీదులో నమాజ్ చేశారు. దీంతో ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు, సీఐఎస్ఎఫ్ అధికారులు నలుగురిని పోలీసులకు అప్పగించారు. నలుగురిపై ఐపీసీ సెక్షన్ 153 కింద కేేసు నమోదు చేసి కోర్టులో […]
తాజావార్తలు
-
Nara Lokesh South Korea visit: సౌత్ కొరియాలో మంత్రి లోకేష్ పర్యటన.. 50కి పైగా కంపెనీలతో చర్చలు
-
KTR: 117 సీట్లు కాదు.. కాంగ్రెస్కు 7 సీట్లు కూడా రావు.! కాంగ్రెస్పై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు..
-
Cyber Fraud: ఓటీపీ చెప్పకపోయినా డబ్బు పోతుందా? సైబర్ నేరగాళ్లు ఇప్పుడు ఇలా మోసం చేస్తున్నారు
-
PhonePe ITR filing: కేవలం రూ.24తోనే ITR ఫైల్ చేయొచ్చు.. PhonePe, JioFinance కొత్త ట్యాక్స్ ఫైలింగ్ సేవలు ప్రారంభం
-
Ellora Kailasa Temple: ఎల్లోరాలోని కైలాసనాథ ఆలయాన్ని పై నుంచి కిందికి ఎందుకు చెక్కారు.. ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన నిర్మాణం!
ట్రెండింగ్
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!