Venu Goapl Reddy
Author- NTV Telugu-
Chhattisgarh: పోలీస్ కానిస్టేబుల్ నిజాయితీ.. రోడ్డుపై దొరికిన రూ.45 లక్షలు అప్పగింత
చత్తీస్ గఢ్ రాజధాని రాయ్ పూర్ లో జరిగింది. రాయ్ పూర్ లో ట్రాఫిక్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న నిలంబర్ సిన్హా తన నిజాయితీని చాటుకున్నారు. రూ.45 లక్షల బ్యాగ్ ను స్థానిక పోలీస్ స్టేషన్ లో అందించి చాలా మందికి ఆదర్శప్రాయంగా నిలిచాడు. తాను వేసుకున్న యూనిఫాం గౌరవాన్ని పెంచేలా ప్రవర్తించారు. నయా రాజయ్ పూర్ లోని కయాబంధ పోస్ట్ కు అనుబంధంగా ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ నిలంబర్ సిన్హా.. -
COVID19 : ఇండియాలో కరోనా కల్లోలం.. కొత్తగా నమోదైన కేసులు ఎన్నంటే..?
కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 20,279 కొత్త కేసులు నమోదు అయ్యాయి. 18,143 మంది వ్యాధిబారి నుంచి కోలుకున్నారు. గడిచిన ఒక రోజులో 36 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 1,52,200 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా మొదలైనప్పటి నుంచి గణాంకాలను పరిశీలిస్తే .. ఇప్పటి వరకు దేశంలో 4,38,88,775 కరోనా కేసులు నమోదు అవ్వగా. -
MEGHALAYA: బీజేపీ ఉపాధ్యక్షుడి వేశ్యాగృహంపై దాడి.. 73 మంది అరెస్ట్.
Meghalaya BJP leader’s farmhouse run as brothel House:మేఘాలయ బీజేపీ అధ్యక్షుడు అత్యంత నీచానికి దిగజరాడు.. బాధ్యతాయుతమైన హోదాలో ఉండీ, చిన్న పిల్లలతో బ్రోతల్ హౌజ్ నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. గతంలో మిలిటెంట్ గా ఉండీ, ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్న బెర్నార్డ్ మరాక్ తన ఫామ్ హౌజ్ లో వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్నాడు. పోలీసులు పక్కా సమాచారంతో శనివారం తురాలోని ఫామ్ హౌజ్ పై దాడి చేశారు. పోలీసులకు సమాచారం అందడంతో దాడులు నిర్వహించామని.. వెస్ట్ గారో హిల్స్ జిల్లా ఎస్పీ వివేకానంద్… -
USA: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..
మరోసారి అగ్రరాజ్యం అమెరికాలో కాల్పుల ఘటన కలకలం రేపింది. ఇటీవల కాలంలో తుపాకీ కాల్పుల ఘటనల్లో అమాయకులు మరణిస్తున్నారు. తాజాగా మరోసారి అలాంటి ఘటనే జరిగింది. శనివారం తెల్లవారుజామున సీటెల్ శివారు రెంటల్ ప్రాంతంలో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఒకరు మరణించగా.. ఐదుగురు గాయపడ్డారు. -
BJP MP Ravi Kishan: జనాభా నియంత్రణ బిల్లుపై రవికిషన్ కు చుక్కలు చూపిస్తున్న నెటిజెన్లు
రవికిషన్ చేసిన వ్యాఖ్యలపై నెటిజెన్లు ఆడుకుంటున్నారు. రవికిషన్ ను ప్రశ్నిస్తూ పోస్టులు పెడుతున్నారు. రవికిషన్ కు మగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒక జంటకు ఇద్దరి కన్నా ఎక్కువ సంతానం ఉందకూడదని చెబుతున్న మీరు చేసిదేంటని ప్రశ్నిస్తున్నారు. కుమారుడు పుట్టేంత వరకు పిల్లలను కంటూనే ఉన్న మీరు జనాభా నియంత్ర బిల్లును పెడతాను అనడం హాస్యాస్పదం అని మరో నెటిజెన్ కామెంట్ చేశాడు. మీరు బిల్లు పెడితే మీకు ఇద్దరు పిల్లలు మాత్రమే దక్కుతారని.. ఎవరో తేల్చుకోవాలని మరో నెటిజెన్… -
Russia- Ukraine War: ఒప్పందం జరిగిన రోజు వ్యవధిలోనే రష్యా దాడి..
Russian missiles hit Ukraine port: రష్యా, ఉక్రెయిన్ పోర్టులను బ్లాక్ చేయడంతో ప్రపంచ వ్యాప్తంగా ధాన్యం కొరత ఏర్పడింది. అయితే శుక్రవారం ఉక్రెయన్ పోర్టుల నుంచి ధాన్యం రవాణాకు సేఫ్ గా తరలించేందుకు టర్కీ, ఐక్యరాజ్యసమితి సమక్షంలో రష్యా, ఉక్రెయిన్ లు ఒప్పందం చేసుకున్నాయి. అయితే ఈ ఒప్పందం జరిగిన రోజు వ్యవధిలోనే రష్యా, ఉక్రెయిన్ లోని ప్రధాన పట్టణం ఒడిస్సాపై రాకెట్లతో విరుచుకుపడింది. ఒడెసాలోని నౌకాశ్రయంపై దాడి చేసింది. ఒడెసా నగరంలోని ధాన్యం నిల్వచేసే ప్రాంతాన్ని రష్యా మిసైళ్లతో టార్గెట్ చేసింది. -
Imran Khan: పాకిస్తాన్ లో కూడా శ్రీలంక తరహా ఉద్యమం వస్తుంది.
ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని శ్రీలంక అల్లాడుతోంది. శ్రీలంక తరువాత ఏ దేశం అంటే వినిపించే పేరు పాకిస్తాన్. అయితే అక్కడ కూడా శ్రీలంక తరహా ఉద్యమం వస్తుందని మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రిక్ ఏ ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ శనివారం హెచ్చరించారు. మాఫియాకు వ్యతిరేకంగా ప్రజలు వీధుల్లోకి వచ్చే రోజు దగ్గర్లో ఉందంటూ సంచనల వ్యాఖ్యలు చేశారు. ఆసిఫ్ జార్దారీ, షరీఫ్ కుటుంబాలు మూడు నెల్లలోనే తాము అక్రమంగా సంపాదించిన సంపదను కాపాడుకునేందుకు రాజకీయంగా, ఆర్ధికంగా దేశాన్ని దివాలా తీయిస్తున్నారని… -
Aviation Accidents: విమానయానం అంటే భయపడుతున్నారు.. ఒక్క నెలలోనే 9 మిడ్ – ఎయిర్ ప్రమాదాలు
విమానయానం అంటే జనాలు జంకాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మనం ఎక్కే విమానం క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చుతుందా..? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఏకంగా ఒక్క నెలలోనే మొత్తం 9 మిడ్ ఎయిర్ ప్రమాదాలు జరిగాయి. ఆకాశంలో ఉండగానే సాంకేతిక లోపాలతో ఫ్లైట్స్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యాయి. జూలై 5 నుంచి జూలై 21 మధ్య ఈ తొమ్మిది ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాలు ప్రయాణికుల రక్షణను ప్రశ్నిస్తున్నాయి. -
Jagadanand Singh: పాకిస్తాన్ ఏజెంట్లుగా పట్టుబడుతున్నది ఆర్ఎస్ఎస్, హిందువులే..
RJD chief's controversial comments: బీహార్ రాష్ట్రీయ జనతాదళ్( ఆర్జేడీ) చీఫ్ జగదానంద్ సింగ్ శనివారం మరో వివాదాన్ని తెరపైకి తీసుకువచ్చారు. ఆర్ఎస్ఎస్, హిందూ సమాజాన్ని ఉద్దేశిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ సైద్ధాంతిక విభాగం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్), తీవ్రవాద గ్రూప్ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా( పీఎఫ్ఐ) రెండూ కూడా ఒకటే అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు గ్రూపులు కూడా వారి మతస్తులకు సేవ చేయాలని అనుకుంటున్నాయని సమర్థించాడు -
Missing Pet Parrot Found: పెంపుడు చిలుకను పట్టితెచ్చినందుకు రూ. 85వేల బహుమానం.. ఎక్కడో తెలుసా..?
Missing Pet Parrot Found in Karnataka: ఇటీవల కర్ణాటక రాష్ట్రంలో తమ పెంపుడు చిలుక కనిపించకుండా పోవడంతో సదరు యజమాని దాన్ని పట్టించినందుకు రూ.50,000 రివార్డు ఇస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ పెంపుడు చిలుక ఆచూకీ వారం రోజుల తరువాత తెలిసింది. దీంతో దీన్ని పట్టించిన వ్యక్తికి ముందుగా అనుకున్న రూ. 50,000 కన్నా ఎక్కువగా బహుమతి ఇచ్చాడు. ఏకంగా రూ.85,000 రివార్డు ఇచ్చాడు.
తాజావార్తలు
-
Congress: తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!
-
National Mourning: ఖతార్ మాజీ ఎమిర్ కన్నుమూత.. భారత్ కీలక నిర్ణయం..
-
Varanasi: రూమరా? నిజమా? రాజమౌళి – మహేష్ బాబు సినిమాతో ఎన్టీఆర్ కొడుకు ఎంట్రీ!
-
Bihar: లవ్ ఎఫైర్.. మహిళా కానిస్టేబుల్ కిడ్నాప్, అత్యాచారం..
-
Srinivasa Mangapuram Trailer: మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి కొత్త హీరో.. ట్రైలర్తోనే అంచనాలు పెంచేసిన జై కృష్ణ!
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..