Aviation Accidents: విమానయానం అంటే భయపడుతున్నారు.. ఒక్క నెలలోనే 9 మిడ్ – ఎయిర్ ప్రమాదాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విమానయానం అంటే జనాలు జంకాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మనం ఎక్కే విమానం క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చుతుందా..? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఏకంగా ఒక్క నెలలోనే మొత్తం 9 మిడ్ ఎయిర్ ప్రమాదాలు జరిగాయి. ఆకాశంలో ఉండగానే సాంకేతిక లోపాలతో ఫ్లైట్స్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యాయి. జూలై 5 నుంచి జూలై 21 మధ్య ఈ తొమ్మిది ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాలు ప్రయాణికుల రక్షణను ప్రశ్నిస్తున్నాయి. డొమెస్టిక్ విమానాలతో పాటు అంతర్జాతీయ విమానాలు కూడా ప్రమాదాలకు గురయ్యాయి. ఇప్పటికే ఈ ప్రమాదాలపై, ప్రయాణికుల భద్రతపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ( డీజీసీఏ) విచారణ జరుపుతోంది.
జూలై 21న సాంకేతిక లోపంతో ఎయిర్ ఇండియా దుబాయ్- కొచ్చిన్ విమానాన్ని ముంబైకి మళ్లించారు. విమానంలో ఎయిర్ ప్రెజర్ తగ్గడాన్ని గుర్తించి పైలెట్ విమానాన్ని అత్యవస ల్యాండింగ్ చేశారు. బోయింగ్ 787 ఫ్లైట్ నెంబర్ ఏఐ-934 విమానం ఈ ప్రమాదానికి గురైంది.
Also Read
- Sana Malik: పాకిస్తాన్లోని ఇస్లామిక్ చట్టాన్ని భారత్ లో అమలు చేయాలి.. ఎమ్మెల్యే సనా మాలిక్ సంచలన వ్యాఖ్యలు
- Ketan Agarwal Murder: 6 నెలల ప్లానింగ్.. 2004 ఫోన్ కాల్స్, 238 గంటల టాక్ టైమ్.. వణుకు పుట్టిస్తున్న మర్డర్ స్కెచ్..
- PM Modi: వెనెజువెలాకు భారత్ అండ.. సహాయ సహకారాలు అందిస్తామన్న ప్రధాని మోడీ..
- Ayodhya: రామాలయ నిధుల వివాదంలో కొత్త ట్విస్ట్.. PMOకు సైతం లెక్కలు ఇవ్వని రామ్ మందిర్ ట్రస్ట్!
Read Also: Monkeypox: ప్రపంచ ఆరోగ్య అత్యవసర స్థితిని ప్రకటించిన డబ్ల్యూహెచ్ఓ
జూలై 20న ఢిల్లీ నుంచ గౌహతి వెళ్తున్న గో ఫస్ట్ విమానాన్ని సాంకేతిక కారణంగా జైపూర్ మళ్లించారు. ఏ 320నియో విమానం విండ్ షీల్డ్ గాలిలో ఉండగానే పగిలిపోయింది. జూలై 19న ఇదే గో ఫస్ట్ సంస్థకు చెందిన రెండు విమానాలను అత్యవసర ల్యాండింగ్ చేశారు. ముంబై నుంచి లేహ్ వెళ్తున్న గో ఎయిర్ ఏ320 వీటీడబ్ల్యూజీఏ విమానంలో ఇంజన్ నెంబర్ 2లో సాంకేతిక లోపం తతెత్తడంతో ఢిల్లీకి మళ్లించారు. శ్రీనగర్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న మరో గో ఎయిర్ ఏ 320 డబ్ల్యూజేజీ విమానంలో కూడా ఇంజన్ నెంబర్ 2లో సాంకేతిక లోపం తలెత్తడంతో తిరిగి శ్రీనగర్ విమానాశ్రయానికి మళ్లించారు.
జూలై 17న షార్జా నుంచి హైదరాబాద్ వస్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తతెల్తడంతో పాకిస్తాన్ కరాచీ ఎయిర్ పోర్టులో అత్యవసర ల్యాండింగ్ చేశారు. జూలై 16న కాలికట్ నుంచి దుబాయ్ వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానానంలో మండుతున్న వాసన రావడంతో ఓమన్ రాజధాని మస్కట్ లో ల్యాండింగ్ చేశారు. జూలై15న ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ బహ్రెయిన్ – కొచ్చి విమానం కాక్ పిట్ లో పక్షి కనిపించడంతో.. కొచ్చిలో విమానాన్ని ల్యాండ్ చేయాల్సి వచ్చింది. జూలై 14న ఇండిగోకు చెందిన ఢిల్లీ- వడోదర విమానంలో వైబ్రేషన్స్ రావడంతో జైపూర్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. జూలై 5న ఢిల్లీ నుంచి దుబాయ్ వెళ్తున్న స్పైస్ జెట్ విమానంలో ఇండికేటర్ లైట్ పనిచేయకపోవడంతో కరాచీలో ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు.
తాజావార్తలు
-
Hindu Culture : శుభకార్యాల్లో రూ. 101, రూ. 501 ఎందుకు ఇస్తారు? ఈ ఒక్క రూపాయి సెంటిమెంట్ ఎందుకో తెలుసా ?
-
Hyderabad: ప్రజల ప్రాణాలతో చెలగాటం.. ఎలుకల మధ్య తయారైన ఫుడ్.. కుళ్లిన బిర్యానీ, కూరగాయలు..
-
Plastic Water Bottle: ప్లాస్టిక్ వాటర్ బాటిల్ను ఎంతకాలం వాడొచ్చు? వాటి కింద ఉన్న నంబర్ల అర్థం ఏమిటి?
-
Honda Vario EVO 160: హోండా వారియో ఇవో 160 స్కూటర్ విడుదల.. యమహా ఏరోక్స్ 155కు గట్టి పోటీ!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
ట్రెండింగ్
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!
-
IND vs BAN: నేడు టీమిండియాకు కీలక మ్యాచ్.. గెలవకుంటే ఇంటికే.. కొడితే గట్టిగా కొట్టాల్సిందే!