Jagadanand Singh: పాకిస్తాన్ ఏజెంట్లుగా పట్టుబడుతున్నది ఆర్ఎస్ఎస్, హిందువులే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RJD chief’s controversial comments: బీహార్ రాష్ట్రీయ జనతాదళ్( ఆర్జేడీ) చీఫ్ జగదానంద్ సింగ్ శనివారం మరో వివాదాన్ని తెరపైకి తీసుకువచ్చారు. ఆర్ఎస్ఎస్, హిందూ సమాజాన్ని ఉద్దేశిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ సైద్ధాంతిక విభాగం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్), తీవ్రవాద గ్రూప్ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా( పీఎఫ్ఐ) రెండూ కూడా ఒకటే అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు గ్రూపులు కూడా వారి మతస్తులకు సేవ చేయాలని అనుకుంటున్నాయని సమర్థించాడు. ఆర్ఎస్ఎస్ లాగే పీఎఫ్ఐ కూడా సమాజానికి సేవ చేయాలని అనుకుంటుందని వ్యాఖ్యలు చేశాడు. పీఎఫ్ఐ వారిని దేశ వ్యతిరేకులని ఎందుకు అంటున్నారని.. ప్రశ్నించారు. భద్రతా దళాలకు పట్టుబడుతున్న పాకిస్తాన్ ఏజెంట్లు అంతా ఆర్ఎస్ఎస్, హిందూ సమాజానికి చెందిన వారే అని సంచలన వ్యాఖ్యలు చేశాడు.
Read Also: Missing Pet Parrot Found: పెంపుడు చిలుకను పట్టించినందుకు రూ. 85,000 బహుమానం.. ఎక్కడో తెలుసా..?
Also Read
- Liquor Ban: ఏంటి! ఇన్ని రోజులు "బ్రాండెడ్ విషం" తాగారా? ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్ సహా ఈ బ్రాండ్ల గుట్టు రట్టు..
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
- No Petrol: సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు.. థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ లేకపోతే ఇంధనం బంద్..
ఇటీవల బీహార్ రాష్ట్రంలో ప్రధాని నరేంద్రమోదీ ర్యాలీలు జరిగే సమయంలో అల్లకల్లోలం చేయాలని ప్లాన్ చేశారనే ఆరోపణలతో పీఎఫ్ఐపై బీహార పోలీసులకు కేసులు నమోదు చేశారు. ప్రధాని మోదీని చంపాలనే లక్ష్యంగా పీఎఫ్ఐ పనిచేస్తుందని.. అందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నుతున్నారనే విషయాలు వెలుగులోకి వచ్చాయి. పీఎఫ్ఐ దేశవ్యాప్తంగా ఉగ్రవాద శిక్షణ ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం పీఎఫ్ఐ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విచారిస్తోంది. పుల్వారీ షరీఫ్ కేసులో ఉగ్రవాద సంబంధాలు ఉన్నాయని ఎన్ఐఏని విచారించాల్సిందిగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశించింది. దీంట్లో భాగంగా దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ముగ్గురిని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. పుల్వారీ షరీఫ్ కేసులో పోలీసులు జరిపిన దాడుల్లో పలు అభ్యంతకర పత్రాలు బయటపడ్డాయి. భారత దేశాన్ని ముస్లిం మెజారిటీ దేశంగా మార్చడంతో పాటు.. టర్కీ వంటి ఇస్లామిక్ దేశం సహాయంతో భారత ముస్లింల ద్వారా భారత దేశంపై సాయుధ దాడిని ప్రారంభించాలనే ‘విజన్ 2047 ఇండియా’ పేరిట పత్రాలు పట్టుబడ్డాయి. ఈ నేపథ్యంలో ఆర్జేడీ చీఫ్ వారికి మద్దతుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
తాజావార్తలు
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
-
Dorothy : ఎన్నాళ్లకు.. కొత్త సినిమా ప్రకటించిన కోలివుడ్ స్టార్ డైరెక్టర్
-
YS Jagan: తూర్పు గోదావరిలో వైఎస్ జగన్ పర్యటన.. పొగాకు కొనుగోళ్లపై సమీక్ష, రైతులతో ముఖాముఖి!
-
UPI Charges: రూ.2,000 దాటిన UPI చెల్లింపులపై ఛార్జీలు? ఎవరు చెల్లించాలి.. ఎలాంటి లావాదేవీలకు వర్తిస్తాయంటే?
-
Salman Khan: ఒక బాత్రూమ్కు 70 మంది.. జైల్లో గడిపిన రోజులు గుర్తు చేసుకున్న సల్మాన్ ఖాన్..
ట్రెండింగ్
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!