రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజన్న భీమేశ్వర ఆలయంలో అక్రమ దర్శనాలపై ఆలయ అధికారుల కొరడా ఝుళిపించారు. బ్రేక్ దర్శనాలు చేపిస్తామని భక్తుల వద్ద డబ్బులు దండుకుంటున్న ఏడుగురు పై వేములవాడ పోలీసులు కేసు నమోదు చేశారు. భీమేశ్వరాలయంలో భక్తుల వద్ద నగదు తీసుకొని అక్రమంగా దర్శనాలను చేయిస్తుండగా ఆలయ ఎస్పీఎఫ్ భద్రత సిబ్బంది పలువురిని పట్టుకున్నారు. Also Read:Bans Harmful Chemicals in Agarbatti : అగరబత్తుల తయారీపై కేంద్రం సంచలన నిర్ణయం భక్తుల రద్దీని […]
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) భారత్ లోని వినియోగదారుల కోసం కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ను ప్రారంభించింది. ప్రభుత్వ రంగ టెలికాం ఆపరేటర్ గురువారం తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా దీనిని ప్రకటించింది. ఈ కొత్త ప్లాన్ పేరు క్రిస్మస్ బొనాంజా. ఇది పరిమిత-కాల రీఛార్జ్ ప్లాన్, ఇది యూజర్లకు 2GB రోజువారీ 4G డేటా, అపరిమిత కాల్స్, ఇతర ప్రయోజనాలను చాలా తక్కువ ధరకు అందిస్తుంది. Also Read:Top 5 Most Impactful […]
2025 లో, అంతర్జాతీయ లగ్జరీ బ్రాండ్లు భారత్ లో హల్ చల్ చేశాయి. BMW iX1 LWB, కొత్త 2 సిరీస్ గ్రాన్ కూపే, సరికొత్త X3 వంటి అనేక మోడళ్లను ప్రవేశపెట్టింది. వోల్వో EX30 e-SUV లతో పాటు XC90, XC60 ఫేస్లిఫ్ట్లతో కూడా అదే బాట పట్టింది. అయితే, 2026 సంవత్సరం యాక్షన్-ప్యాక్డ్ గా ఉంటుందని తెలుస్తోంది. రాబోయే సంవత్సరంలో మార్కెట్ ను షేక్ చేసేందుకు రెడీ అవుతున్నాయి లగ్జరీ కార్లు. లిస్ట్ లోబీఎండబ్ల్యూ, […]
లెనోవా చైనాలో లెనోవా వాచ్ GT ప్రోను విడుదల చేసింది. లెనోవా నుంచి వచ్చిన ఈ కొత్త వేరియబుల్ 1.43-అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంది. అవుట్డోర్ ట్రాకింగ్ కోసం డ్యూయల్-ఫ్రీక్వెన్సీ GPSని అందిస్తుంది. ఈ స్మార్ట్వాచ్ 170 కంటే ఎక్కువ స్పోర్ట్స్ మోడ్లకు మద్దతు ఇస్తుంది. 470mAh బ్యాటరీతో వస్తుంది. ఇది 5ATM వాటర్ రెసిస్టెన్స్ ను కలిగి ఉంది. లెనోవా వాచ్ GT ప్రో హృదయ స్పందన రేటు, బ్లడ్ ఆక్సిజన్ సంతృప్తత (SpO2), నిద్రను […]
ఈజీ మనీకి అలవాటు పడిన కొందరు వ్యక్తులు తప్పుడు మార్గాలను ఎంచుకుంటున్నారు. దొంగతనాలు, దోపిడీలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో నిజమాబాద్ జిల్లా కేంద్రంలో ఏటీఎం దొంగలు రెచ్చిపోయారు. గంటల వ్యవధిలో రెండు ఏటిఎం లలో చోరికి యత్నించారు. యంత్రాలు తెరుచుకోకపోవడం తో దుండగులు తగులబెట్టారు. దీంతో రూ.50 లక్షల నగదు కాలి బూడిదైంది. వర్ని చౌరస్తా, వినాయక నగర్ లోని ఏటీఏంలను ధ్వంసం చేశారు. బైక్ పై ఇద్దరు దొంగలు ఏటీఏంలోకి చొరబడగా.. కారులో మరో ఇద్దరు […]
ఆన్ లైన్ గేమ్స్ నిండు ప్రాణాలను బలిగొంటున్నాయి. భారీగా డబ్బులు వస్తాయన్న ఆశతో పెట్టుబడులు పెట్టి ఉన్నదంతా పోగొట్టుకుంటున్నారు. అప్పులు చేసి అవి తీర్చే మార్గం లేక మానసిక వేదనతో తనువు చాలిస్తున్నారు. ఆన్ లైన్ గేమ్స్ కారణంగా కుటుంబాలు రోడ్డునపడుతున్నాయి. తాజాగా మరో యువకుడు ఆన్ లైన్ గేమ్స్ కి బలయ్యాడు. కుత్బుల్లాపూర్, సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆన్లైన్ గేమ్స్ కి అలవాటు పడి ఓ యువకుడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. Also Read:ఆయుర్వేదంలో ఆపరేషన్లకు […]
కవాసకి కంపెనీ 2026 కవాసకి నింజా 1100SXని విడుదల చేసింది. ఇందులో స్టైలింగ్ అప్డేట్లు ఉన్నాయి. దీని ధర రూ.14.42 లక్షలు. ఇది కొత్త బ్లాక్, గోల్డ్ కలర్ స్కీమ్ కలిగి ఉంది. 2026 నింజా 1100SX అదే 1,099cc, నాలుగు సిలిండర్ల, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్తో పనిచేస్తుంది, ఇది 136hp, 113Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ రియల్ వరల్డ్ రైడింగ్ కోసం అధిక-ఉత్తేజకరమైన పనితీరును, బలమైన మిడిల్ రేంజ్ పనితీరును అందిస్తుంది. ఇది బైక్ను […]
మాజీమంత్రి కేటీఆర్ తెలంగాణ భవన్లో జరిగిన జాయినింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మార్పు అని చెప్పి ఊదరగొట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అయిందన్నారు. ఈ రెండేళ్లలో కూల్చివేతలు, ఎగవేతలు, పేల్చివేతలు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని విమర్శించారు. అప్పుడు కాలేశ్వరం బ్యారేజ్ ని పేల్చారు.. ఇప్పుడు చెక్ డ్యాం లను పేలుస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెసోళ్లు దొంగతనంగా ఇసుక తరలించేందుకు కష్టమవుతుంది అని చెక్ డ్యాం లు పేలుస్తున్నారు. నిన్న మొన్న పెద్ద […]
తుఫాన్ ఇన్నింగ్స్ తో క్రికెట్ దిగ్గజాల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ. 14 ఏళ్ల వయసున్న వైభవ్ అరుదైన గౌరవాన్ని అందుకున్నాడు. వైభవ్ సూర్యవంశీకి ప్రధానమంత్రి జాతీయ బాల పురస్కారం లభించింది. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి జాతీయ బాలల అవార్డును ప్రదానం చేశారు. దేశీయ క్రికెట్లో అద్భుతమైన పర్ఫామెన్స్ తర్వాత వైభవ్కు ఈ గౌరవం లభించింది. ఈ వారం ప్రారంభంలో, విజయ్ హజారే ట్రోఫీలో అరుణాచల్ ప్రదేశ్పై […]
షియోమీ వాచ్ 5 స్మార్ట్వాచ్ చైనీస్ మార్కెట్లో విడుదలైంది. ఈ స్మార్ట్వాచ్, eSIM కి కూడా మద్దతు ఇస్తుంది. ఇది 60Hz రిఫ్రెష్ రేట్, 1500 నిట్ల బ్రైట్ నెస్ తో 1.54-అంగుళాల AMOLED డిస్ప్లేను కలిగి ఉంది. Xiaomi స్మార్ట్వాచ్ హార్ట్ రేట్ సెన్సార్, స్లీప్ మానిటరింగ్, స్ట్రెస్ మానిటరింగ్ వంటి హెల్త్ ఫీచర్లను కలిగి ఉంది. దీని ధర 1,999 యువాన్లు (సుమారు రూ. 25,500). eSIM వేరియంట్ ధర 2,299 యువాన్లు (సుమారు […]