సైబర్ నేరగాళ్లకు టెక్నాలజీ వరంగా మారింది. రోజుకో ఎత్తుగడలతో మోసాలకు పాల్పడుతున్నారు. అమాయకులను మోసం చేస్తూ అందినకాడికి దోచేస్తున్నారు. కాల్స్, మెసేజ్ లు, ఫేక్ లింక్స్ పంపిస్తూ వాటిని క్లిక్ చేయగానే ఖాతాలు లూటీ చేస్తున్నారు. సైబర్ మోసాలపై అవగాహన కల్పిస్తున్నప్పటికీ అడ్డుకట్ట పడడం లేదు. తాజాగా విద్యుత్ వినియోగదారులను ను టార్గెట్ చేశారు సైబర్ చీటర్స్. కరెంట్ బిల్ పెండింగ్ లో ఉందని.. బిల్ కట్టకపోతే కరెంట్ కట్ చేస్తామని మెసేజ్ లు పంపిస్తూ మోసాలకు […]
రవాణా వ్యవస్థలో ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి సంస్థలు పెను మార్పులు తీసుకొచ్చాయి. ఆన్ లైన్ లో బుక్ చేస్తే చాలు నిమిషాల్లో వెహికల్ ఇంటి ముందుకు వచ్చేస్తోంది. ఇదే సమయంలో టూవీలర్, త్రీవీలర్, ఫోర్ వీలర్ వాహనదారులు ఉపాధి పొందుతున్నారు. అయితే ఆయా సంస్థలు కమిషన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల తాము నష్టపోతున్నామని ఓలా, ఉబర్ వంటి సర్వీసులతో వాహనాలు నడిపే డ్రైవర్లు ఆందోళన చేసిన సందర్భాలున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ట్యాక్సీ డ్రైవర్లకు […]
రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ లకు మార్కెట్ లో ఉండే క్రేజే వేరు. యూత్ కు డ్రీమ్ బైక్ కూడా. కొంటే రాయల్ ఎన్పీల్డ్ బైక్ కొనాలి అని వెయిట్ చేసే వాళ్లు ఎందరో ఉన్నారు. అలాంటి వారికి గుడ్ న్యూస్. రాయల్ ఎన్ఫీల్డ్ 650cc విభాగంలో కొత్త బైక్ను విడుదల చేసింది. రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 650 బైక్ను భారత మార్కెట్లో అఫీషియల్ గా విడుదల చేసింది. క్లాసిక్ డిజైన్, ఆధునిక ఫీచర్లతో అట్రాక్ట్ చేస్తోంది. ఈ […]
అమెరికా వెళ్లాలనుకునే వారికి షాక్. భారత్లో 2,000 వీసా అపాయింట్ మెంట్స్ను అమెరికా రద్దు చేసింది. మోసపూరిత కార్యకలాపాల కారణంగా 2 వేలకుపైగా వీసా దరఖాస్తులను రద్దు చేసినట్లు భారత్ లోని అమెరికా రాయబార కార్యాలయం బుధవారం తెలిపింది. గత సంవత్సరం యూఎస్ రాయబార కార్యాలయం అంతర్గత దర్యాప్తు నిర్వహించి దరఖాస్తుదారులకు వీసాలు పొందడానికి నకిలీ పత్రాలను సమర్పించడం ద్వారా US ప్రభుత్వాన్ని “మోసం” చేసిన 30 మంది ఏజెంట్ల జాబితాను రూపొందించింది. అపాయింట్మెంట్ షెడ్యూలింగ్ వ్యవస్థలో […]
మొబైల్ లవర్స్ కు మరో కొత్త స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ ఇన్ఫినిక్స్ భారత్ మార్కెట్ లో తన బడ్జెట్-సెగ్మెంట్ స్మార్ట్ఫోన్ ఇన్ఫినిక్స్ నోట్ 50X 5G+ ను విడుదల చేసింది. ఇందులో మీడియం రేంజ్ ఫీచర్లు ఉన్నాయి. మీడియాటెక్ D7300 అల్టిమేట్, 5500mAh బ్యాటరీ వంటి ఫీచర్లతో కంపెనీ ఈ స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది. ఈ స్మార్ట్ఫోన్ ఫ్లిప్కార్ట్ లో అందుబాటులో ఉంది. సేల్ ఏప్రిల్ 3న మధ్యాహ్నం […]
ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? జాబ్స్ కోసం సెర్చ్ చేసి అలసిపోయారా? అయితే డోంట్ వర్రీ. హిందుస్తాన్ పెట్రోలియంలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 63 పోస్టులను భర్తీచేయనున్నారు. భర్తీకానున్న పోస్టుల్లో జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెకానికల్ 11, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ 17 , జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇన్స్ట్రుమెంటేషన్ 06, జూనియర్ ఎగ్జిక్యూటివ్ […]
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రెండు రోజులపాటు కలెక్టర్ల సమావేశాలు జరిగాయి. నేడు రెండో రోజు కలెక్టర్ల సమావేం ముగిసింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. “అమరావతి తిరుపతి వైజాగ్ లో సాంస్కృతిక కార్యక్రమాలు కోసం ప్రత్యేక కల్చర్ సెంటర్ ఉండాలి.. కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలి.. సంస్కృతిని నిరంతరం ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలి.. సమస్యల పరిష్కారం కోసం మనం ఉన్నాము.. అంతే కాని అడిగినప్పుడు సమస్యలు చెప్పడం కాదు.. జిల్లాలో సమస్య వస్తే ప్లానింగ్ […]
ఏపీలో 5 ప్రభుత్వ వైద్యశాలలకు క్రిటికల్ కేర్ బ్లాక్ లు మంజూరయ్యాయి. ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ పథకంలో భాగంగా రాష్ట్రానికి 5 క్రిటికల్ కేర్ బ్లాక్ లు మంజూరయ్యాయి. దీనిలో భాగంగా 50 బెడ్స్ అత్యాధునిక క్రిటికల్ కేర్ ఐసియు విభాగాలు ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఒక్కో యూనిట్ కు రూ. 23 కోట్ల 75 లక్షల చొప్పున మొత్తం రూ. 118 కోట్ల 75 లక్షలు మంజూరు చేస్తూ […]
పాస్టర్ ప్రవీణ్ కేసుపై తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ మీడియాకు కీలక విషయాలు వెల్లడించారు. అనుమానాస్పద మృతి కేసుగా దర్యాప్తు చేస్తున్నామని.. ప్రధానంగా రెండు సీసీ ఫుటేజ్ లు లభించాయనీ తెలిపారు. హైదరాబాదు నుంచి బుల్లెట్ పై రాజమండ్రికి వస్తున్న సమయంలో సోమవారం అర్ధరాత్రి 11 గంటల 42 నిమిషాలకు ఒక కారుతోపాటు ఐదు వాహనాలు ప్రవీణ్ బుల్లెట్ ని దాటుకొని వెళ్లాయనీ సిసి ఫుటేజ్ ఆధారాలు ప్రదర్శించారు.. రెడ్ కలర్ కారు… ప్రవీణ్ ప్రయాణిస్తున్న […]
ప్రకాశం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జిల్లా ప్రగతి ప్రణాళికలకు సంబంధించి సీఎం నారా చంద్రబాబునాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. నెల్లూరు జిల్లాలోని కొవ్వూరు షుగర్ ఫ్యాక్టరీకి చెందిన 124 ఎకరాల భూమిని పారిశ్రామిక అభివృద్ధికై ఏపీఐఐసీ కేటాయించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. చెరుకు రైతులకు చెల్లించాల్సిన బకాయిలు దాదాపు రూ.28 కోట్లను ప్రభుత్వం చెల్లిస్తుంది.. చిత్తూరు జిల్లాలో 3.65 లక్షల […]