తెలుగు రాష్ట్రాల్లో ఉగాది వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ప్రారంభమైంది. కొత్త సంవత్సరం వేళ ప్రతి ఒక్కరి ఆలోచన తమకు ఈసారైన అన్ని రంగాల్లో కలిసి వస్తుందా? లేదా అని ఆందోళన చెందుతుంటారు. తమ రాశిఫలాల కోసం ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. అయితే ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా కొన్ని రాశుల వారికి అద్భుతంగా ఉండగా మరికొన్ని రాశులవారికి కాస్త ఇబ్బందులు కలిగేలా ఉంటుందని పండితులు చెబుతున్నారు. […]
ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నారా? అయితే ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలను మిస్ చేసుకోకండి. తాజాగా నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (NCRTC) వివిధ పోస్టుల భర్తీకోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 71 ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీకానున్న పోస్టుల్లో జూనియర్ ఇంజనీర్, ప్రోగ్రామింగ్ అసోసియేట్, అసిస్టెంట్ వంటి పోస్టులున్నాయి. అభ్యర్థులు పోస్టులను అనుసరించి డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ పాసై ఉండాలి. Also Read:Train Incident: ఘోర రైలు […]
ఆరోగ్యంగా ఉండటానికి శరీరంలో అన్ని పోషకాలు సరైన పరిమాణంలో ఉండటం ముఖ్యం. కానీ తీసుకునే ఆహారంలో అన్ని విటమిన్లు, ఖనిజాలు లభించవు. వీటిలో విటమిన్-ఇ లోపం కూడా ఉంటుంది. విటమిన్ ఇ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది కణాలను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. విటమిన్ ఇ చర్మం, జుట్టు, కళ్ళు, రోగనిరోధక వ్యవస్థకు మేలు చేస్తుంది. విటమిన్ ఇ లోపం కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయంటున్నారు […]
చిత్తూరు జిల్లాలో నలుగురు విఆర్ఓలను కలెక్టర్ సుమిత్ కుమార్ సస్పెండ్ చేశారు. రెవెన్యూ సమస్యల పరిష్కారంలో భాగంగా పరిష్కారమైన అర్జీదారుల స్పందనను ఐవిఆర్ ఎస్ ద్వారా ప్రభుత్వం సేకరిస్తోంది. సమాచార సేకరణలో భాగంగా ప్రజల నుంచి ఫిర్యాదులు అందడంతో కలెక్టర్ కఠినమైన చర్యలు తీసుకున్నారు. తొలిసారిగా సిటిజెన్ ఫీడ్ బ్యాక్ ద్వారా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కాగా సస్పెండ్ అయిన వీఆర్వోల్లో బైరెడ్డిపల్లి మండలం లక్కనపల్లి విఆర్వో, ఎస్ ఆర్ పురం నెలవాయి విఆర్వో, గంగవరం మండలం […]
పాములను చూస్తే దాదాపు అందరికీ భయం పుడుతుంది. పాము కనిపిస్తే చాలు ప్రాణ భయంతో పరుగులు తీస్తుంటారు. అలాంటిది 15 అడుగుల భారీ గిరినాగు కనిపిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. భారీ గిరినాగు జనావాసాల్లో ప్రత్యక్షమవగా ప్రజలు హడలిపోయారు. ఈ ఘటన అనకాపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. దేవరాపల్లిలో ఒడ్డు చింతల కల్లాల వద్ద 15 అడుగుల గిరినాగు శుక్రవారం సాయంత్రం హడలెత్తించింది. తారు రోడ్డు దాటుతున్న పామును కుక్కలు అటకాయించాయి. పాము బుసలు కొడుతుండగా రైతులు చూసి […]
ఉద్యోగం సాధించి లైఫ్ లో సెటిల్ అవ్వాలని భావిస్తున్నారా? అయితే మీ డ్రీమ్ జాబ్ ను సొంతం చేసుకునే ఛాన్స్ వచ్చింది. నిరుద్యోగులకు హైదరాబాద్లోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్) గుడ్ న్యూస్ అందించింది. వివిధ విభాగాల్లో 32 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. భర్తీకానున్న పోస్టుల్లో ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ (EAT) 08, టెక్నీషియన్ C 21, జూనియర్ అసిస్టెంట్ 03 ఉన్నాయి. Also Read:Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్న్యూస్… […]
కేంద్ర ప్రభుత్వం అన్ని రేషన్ కార్డుదారులకు ఈ-కేవైసీ ప్రక్రియను తప్పనిసరి చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ-కేవైసీ ప్రక్రియ 2025 మార్చి 31తో గడువు ముగియనున్నది. ఈ నేపథ్యంలో రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. జాతీయ ఆహార భద్రతా చట్టం (NFSA) లబ్ధిదారులకు e-KYC ప్రక్రియ గడువు పొడిగించింది. Also Read:Rashmika : నాకెవరూ సపోర్ట్ చేయలేదు.. సొంతంగానే ఎదిగా : రష్మిక అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు […]
జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతు.. జగనన్నను చూసి అధికారులు పరిగెత్తారని అవినాష్ చెప్పడం విడ్డురంగా ఉంది.. ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు చెప్పడంలో వాళ్ళు దిట్ట.. సీబీఐ విచారణ జరిగింది.. జగన్, అవినాష్ లకు అంతా తెలుసు.. అవినాష్ రెడ్డికి వివేకా హత్య కేసులో ప్రమేయం లేదా.. పాడా నిధులు 800కొట్లు పాడు చేశారు.. చిత్రావతి నీళ్లు […]
ఒకే దేశం – ఒకే ఎన్నిక ప్రాముఖ్యత, సవాళ్ళు, ప్రభావం పై సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మాజీ న్యాయమూర్తి బి.శివశంకరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతు.. రాజకీయాలు విరమించి ప్రజాజీవనంలో మాత్రమే పాల్గొంటున్నా.. రాజ్యాంగంలో ఉన్నత పదవి నుంచి వచ్చాక రాజకీయాలు మాట్లాడకూడదు.. పదవీ విరమణ చేసాను కానీ పెదవి విరమణ చేయలేదు.. రాజకీయంగా కనిపించని రాజకీయ అంశాలు మాట్లాడతాను.. ఒకే దేశం ఒకే ఎన్నిక […]
ఉంగుటూరు మండలం ఆత్కూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారితోపాటు అరవై కేజీల గంజాయి, ఎర్టిగా మారుతి కారును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో ఆత్కూరు పోలీస్ స్టేషన్ లో ఎస్పీ ఆర్ గంగాధర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. అందిన సమాచారం మేరకు పొట్టిపాడు టోల్ గేట్ వద్ద అక్రమంగా తరలిస్తున్న గంజాయిని ఈనెల 20వ తారీఖున […]