Nimisha Priya: నిమిష ప్రియను వీలైనంత త్వరగా ఉరితీయండి…
- నిమిష ప్రియను వీలైనంత త్వరగా ఉరితీయండి
- మహదీ కుటుంబం యెమెన్లోని హౌతీ ప్రభుత్వాన్ని డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యెమెన్లో మరణశిక్ష ఎదుర్కొంటున్న కేరళ నర్సు నిమిష ప్రియను కాపాడాలనే ఆశలు సన్నగిల్లుతున్నాయి. నిమిష హత్యకు పాల్పడినట్లు ఆరోపణలు గుప్పిస్తున్న యెమెన్ పౌరుడు తలాల్ అబ్దో మహదీ కుటుంబం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. భారతీయ నర్సు నిమిషను వీలైనంత త్వరగా ఉరితీయాలని వారు యెమెన్లోని హౌతీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో, కేరళ నివాసి అయిన నిమిషను జూలై 16న ఉరితీయాల్సి ఉంది. కానీ అది నిరవధికంగా వాయిదా పడింది. ఇప్పుడు బాధితుడి కుటుంబం నిమిషను ఎటువంటి ఆలస్యం లేకుండా ఉరితీయాలని హౌతీలను డిమాండ్ చేస్తోంది. ఆమెను వీలైనంత త్వరగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ తలాల్ సోదరుడు అబ్దుల్ ఫతా అబ్దో మహదీ సోషల్ మీడియాలో ఒక లేఖ రాశారు.
Also Read:Coolie : నాగార్జునపై రజినీకాంత్ జోకులు..
Also Read
- Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
- Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
- YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
- OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
అబ్దుల్ ఈ లేఖను ఆగస్టు 3న యెమెన్ అటార్నీ జనరల్, జడ్జి అబ్దుల్ సలాం అల్ హౌతీకి రాశారు. ఈ లేఖలో, నిమిషను ఉరితీయాలని కుటుంబం మరోసారి డిమాండ్ చేసింది. ‘శిక్ష విధించడం వాయిదా పడి ఒకటిన్నర నెలలు గడిచాయి. ఇంకా కొత్త తేదీని నిర్ణయించలేదు’ అని లేఖలో తెలిపాడు. బాధితుడి కుటుంబంగా మేము, మా హక్కును అమలు చేయాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాము. మేము ఏ విధమైన మధ్యవర్తిత్వం లేదా పరిష్కారాన్ని తిరస్కరిస్తున్నాము అని వెల్లడించాడు.
Also Read:Shilpa Ravi: జగన్ను జైలుకు పంపేందుకు కుట్ర.. కూటమి ప్రభుత్వంపై శిల్పా రవి ఆగ్రహం
ఈ లేఖలో, మహదీ కుటుంబం న్యాయం, చట్టపరమైన హక్కులను కాపాడుకోవడానికి మరణశిక్ష అవసరమని పేర్కొంది. భారత ప్రభుత్వం నిమిష ప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ బృందాన్ని యెమెన్కు వెళ్లడానికి అనుమతించలేదు. దీనికి భారత ప్రభుత్వం తీవ్రమైన భద్రతా కారణాలను పేర్కొంది. అయితే, ఇటీవల సుప్రీంకోర్టు ఈ బృందానికి క్షమాపణ కోసం బాధితుడి కుటుంబంతో చర్చలు జరపడానికి అనుమతి ఇచ్చింది. అలాంటి చర్చల కోసం, ఒకరు యెమెన్కు వెళ్లాలి. దీని కోసం విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆమోదం అవసరం.
Also Read:B-Unique Crew : ‘పుష్ప’ సాంగ్తో అమెరికా స్టేజ్ కంపించేశాడు ‘బీ యూనిక్ క్రూ’..
భారత పౌరులు యెమెన్కు వెళ్లకుండా నిషేధం విధించింది. ఒక ప్రశ్నకు సమాధానంగా, భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ యెమెన్లో ప్రమాదకరమైన భద్రతా పరిస్థితిని ప్రస్తావించింది. యెమెన్లోని హౌతీలతో భారతదేశానికి అధికారిక దౌత్య సంబంధాలు లేవు. గతంలో సనాలో భారత రాయబార కార్యాలయం ఉండేది. కానీ ఇప్పుడు భద్రతా కారణాల దృష్ట్యా దానిని సౌదీ అరేబియాకు మార్చారు. నిమిష ప్రియ కేరళలోని పాలక్కాడ్ జిల్లాకు చెందినది. నిమిషా 2008లో యెమెన్కు వెళ్లి అక్కడ నర్సుగా పనిచేసింది. తలాల్ అబ్డో సహాయంతో నిమిష అక్కడ తన క్లినిక్ను ఏర్పాటు చేసిందని ఆరోపించారు. తలాల్ భారతీయ నర్సును వేధించడం ప్రారంభించాడని నిమిషా న్యాయవాది చెప్పారు. దీని నుంచి తప్పించుకోవడానికి, నిమిష తలాల్కు డ్రగ్స్ ఇచ్చారు. ఇది అతని మరణానికి దారితీసింది.
తాజావార్తలు
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
-
CM Revanth Reddy : ఆక్స్ఫర్డ్కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్లో కొత్త క్యాంపస్.?
-
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
-
OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!