Nimisha Priya: నిమిష ప్రియను వీలైనంత త్వరగా ఉరితీయండి…
- నిమిష ప్రియను వీలైనంత త్వరగా ఉరితీయండి
- మహదీ కుటుంబం యెమెన్లోని హౌతీ ప్రభుత్వాన్ని డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యెమెన్లో మరణశిక్ష ఎదుర్కొంటున్న కేరళ నర్సు నిమిష ప్రియను కాపాడాలనే ఆశలు సన్నగిల్లుతున్నాయి. నిమిష హత్యకు పాల్పడినట్లు ఆరోపణలు గుప్పిస్తున్న యెమెన్ పౌరుడు తలాల్ అబ్దో మహదీ కుటుంబం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. భారతీయ నర్సు నిమిషను వీలైనంత త్వరగా ఉరితీయాలని వారు యెమెన్లోని హౌతీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో, కేరళ నివాసి అయిన నిమిషను జూలై 16న ఉరితీయాల్సి ఉంది. కానీ అది నిరవధికంగా వాయిదా పడింది. ఇప్పుడు బాధితుడి కుటుంబం నిమిషను ఎటువంటి ఆలస్యం లేకుండా ఉరితీయాలని హౌతీలను డిమాండ్ చేస్తోంది. ఆమెను వీలైనంత త్వరగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ తలాల్ సోదరుడు అబ్దుల్ ఫతా అబ్దో మహదీ సోషల్ మీడియాలో ఒక లేఖ రాశారు.
Also Read:Coolie : నాగార్జునపై రజినీకాంత్ జోకులు..
Also Read
అబ్దుల్ ఈ లేఖను ఆగస్టు 3న యెమెన్ అటార్నీ జనరల్, జడ్జి అబ్దుల్ సలాం అల్ హౌతీకి రాశారు. ఈ లేఖలో, నిమిషను ఉరితీయాలని కుటుంబం మరోసారి డిమాండ్ చేసింది. ‘శిక్ష విధించడం వాయిదా పడి ఒకటిన్నర నెలలు గడిచాయి. ఇంకా కొత్త తేదీని నిర్ణయించలేదు’ అని లేఖలో తెలిపాడు. బాధితుడి కుటుంబంగా మేము, మా హక్కును అమలు చేయాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాము. మేము ఏ విధమైన మధ్యవర్తిత్వం లేదా పరిష్కారాన్ని తిరస్కరిస్తున్నాము అని వెల్లడించాడు.
Also Read:Shilpa Ravi: జగన్ను జైలుకు పంపేందుకు కుట్ర.. కూటమి ప్రభుత్వంపై శిల్పా రవి ఆగ్రహం
ఈ లేఖలో, మహదీ కుటుంబం న్యాయం, చట్టపరమైన హక్కులను కాపాడుకోవడానికి మరణశిక్ష అవసరమని పేర్కొంది. భారత ప్రభుత్వం నిమిష ప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ బృందాన్ని యెమెన్కు వెళ్లడానికి అనుమతించలేదు. దీనికి భారత ప్రభుత్వం తీవ్రమైన భద్రతా కారణాలను పేర్కొంది. అయితే, ఇటీవల సుప్రీంకోర్టు ఈ బృందానికి క్షమాపణ కోసం బాధితుడి కుటుంబంతో చర్చలు జరపడానికి అనుమతి ఇచ్చింది. అలాంటి చర్చల కోసం, ఒకరు యెమెన్కు వెళ్లాలి. దీని కోసం విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆమోదం అవసరం.
Also Read:B-Unique Crew : ‘పుష్ప’ సాంగ్తో అమెరికా స్టేజ్ కంపించేశాడు ‘బీ యూనిక్ క్రూ’..
భారత పౌరులు యెమెన్కు వెళ్లకుండా నిషేధం విధించింది. ఒక ప్రశ్నకు సమాధానంగా, భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ యెమెన్లో ప్రమాదకరమైన భద్రతా పరిస్థితిని ప్రస్తావించింది. యెమెన్లోని హౌతీలతో భారతదేశానికి అధికారిక దౌత్య సంబంధాలు లేవు. గతంలో సనాలో భారత రాయబార కార్యాలయం ఉండేది. కానీ ఇప్పుడు భద్రతా కారణాల దృష్ట్యా దానిని సౌదీ అరేబియాకు మార్చారు. నిమిష ప్రియ కేరళలోని పాలక్కాడ్ జిల్లాకు చెందినది. నిమిషా 2008లో యెమెన్కు వెళ్లి అక్కడ నర్సుగా పనిచేసింది. తలాల్ అబ్డో సహాయంతో నిమిష అక్కడ తన క్లినిక్ను ఏర్పాటు చేసిందని ఆరోపించారు. తలాల్ భారతీయ నర్సును వేధించడం ప్రారంభించాడని నిమిషా న్యాయవాది చెప్పారు. దీని నుంచి తప్పించుకోవడానికి, నిమిష తలాల్కు డ్రగ్స్ ఇచ్చారు. ఇది అతని మరణానికి దారితీసింది.
తాజావార్తలు
-
Devasish Sharma: IAS పదవికి రాజీనామా.. 8 రోజుల్లోనే బీజేపీ ఎంపీ టికెట్.. దేవాశిష్ శర్మ ఎవరు?
-
Bada Ganesh : ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనానికి వెళ్తున్నారా? ఈ ట్రాఫిక్ రూట్లు మర్చిపోకండి
-
Sergio Gor: మణిపూర్లో సెర్గియో గోర్ పర్యటన.. గవర్నర్, సీఎంతో భేటీ!
-
Rain Alert: బ్రిక్స్ సదస్సు వేళ ఢిల్లీకి భారీ వర్ష సూచన
-
Nani: నా కెరీర్లోనే అత్యంత కష్టమైన సినిమా ఇదే.. జడల బరువుపై నాని సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?