Raksha Bandhan 2025: ప్రధాని మోడీ కోసం రాఖీ సిద్ధం చేసిన పాక్ ముస్లిం సోదరి ఖమర్ మొహ్సిన్ షేక్..
- ప్రధాని మోదీకి రాఖీని సిద్ధం చేసిన ఖమర్ మొహ్సిన్ షేక్
- పాకిస్తాన్లోని కరాచీలో జన్మించిన ఖమర్ షేక్ గత 30 సంవత్సరాలుగా ప్రధాని మోడీకి రాఖీ కడుతున్నారు
- ఈ సంవత్సరం ఆమె తన చేతులతో ఓం, గణేష్ జీ డిజైన్లతో నాలుగు రాఖీలను తయారు చేసింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మరో మూడు రోజుల్లో రాఖీ పండుగ రాబోతోంది. అన్నా చెళ్లెల్లు, అక్కా తమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలకు, ఆప్యాయతకు చిహ్నంగా రక్షబంధన్ నిలుస్తోంది. ఈ ఏడాది కూడా రాఖీ పండుగను ఘనంగా జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో రక్షా బంధన్ సందర్భంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముస్లిం సోదరి ఖమర్ మొహ్సిన్ షేక్ మరోసారి ఆయన కోసం రాఖీని సిద్ధం చేశారు. పాకిస్తాన్లోని కరాచీలో జన్మించిన ఖమర్ షేక్ గత 30 సంవత్సరాలుగా ప్రధాని మోడీకి రాఖీ కడుతున్నారు. ఈ సంవత్సరం ఆమె తన చేతులతో ఓం, గణేష్ జీ డిజైన్లతో నాలుగు రాఖీలను తయారు చేసింది. రాఖీ కట్టేందుకు ఆమె పీఎంఓ ఆహ్వానం కోసం ఎదురుచూస్తోంది.
Also Read
- Dharmendra Pradhan Education: ధర్మేంద్ర ప్రధాన్ ఎంత వరకు చదువు, ఆస్తుల వివరాలు మీకు తెలుసా?
- AP Cabinet Meeting: కేబినెట్ ముందు 25కి పైగా కీలక ప్రతిపాదనలు.. నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
- US Airstrike: తారాస్థాయికి చేరిన అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు.. రంగంలోకి బీ-1 బాంబర్!
- Constable Suicide: డీజీపీ కార్యాలయంలో తుపాకితో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య.!
ప్రతి సంవత్సరం తాను స్వయంగా రాఖీలు తయారు చేస్తానని, తనకు అత్యంత ఇష్టమైన రాఖీని ప్రధాని మోడీ చేతికి కడతానని ఖమర్ మొహ్సిన్ షేక్ చెప్పారు. మోడీ జీ సంఘ్ కార్యకర్తగా ఉన్నప్పటి నుంచి తనకు తెలుసునని ఆమె చెప్పింది. ఒకసారి ప్రధాని మోడీ తన క్షేమం గురించి అడిగి, ‘సోదరి ఎలా ఉన్నారు?’ అని అడిగారు. అప్పటి నుంచి ఆమె అతనికి రాఖీలు కట్టడం ప్రారంభించింది. ప్రధాని మోడీ గుజరాత్ ముఖ్యమంత్రి కావాలని తాను ఒకసారి ప్రార్థించానని ఖమర్ షేక్ చెప్పారు.
Also Read:Mohammed Siraj: హైదరాబాద్లోనే కాదు, ఎక్కడున్నా సిరాజ్కి బిర్యానీ!
అప్పుడు ప్రధాని నవ్వారని తెలిపింది. ఈ కోరిక నెరవేరినప్పుడు, మీరు దేశానికి ప్రధానమంత్రి అయి దేశానికి కీర్తి తీసుకురావాలని ఆకాంక్షించినట్లు తెలిపింది. తన కోరిక ఇప్పుడు మూడోసారి నెరవేరిందని ఆమె చెబుతోంది. గత సంవత్సరం తాను ఢిల్లీకి వెళ్లలేకపోయానని, కానీ ఈ సంవత్సరం తనకు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఆహ్వానం వస్తుందని, రాఖీ కట్టి రక్షాబంధన్ జరుపుకోగలనని ఆమె ఆశాభావం వ్యక్తం చేసింది.
తాజావార్తలు
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dharmendra Pradhan Education: ధర్మేంద్ర ప్రధాన్ ఎంత వరకు చదువు, ఆస్తుల వివరాలు మీకు తెలుసా?
-
Vivienne Pitt : బ్రాడ్ పిట్ ఇంటిపేరుకు మరో షాక్.. లీగల్గా తొలగించేందుకు ఏంజెలీనా కుమార్తె పిటిషన్!
-
Objection My Lord Trailer : మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ‘అబ్జెక్షన్ మై లార్డ్’ ట్రైలర్ విడుదల
-
Rahul Gandhi on NEET Paper Leak: “యువత భవిష్యత్తును ఎక్కువగా దెబ్బతీసింది మీరే”.. ప్రధాని మోడీకి రాహుల్ గాంధీ కౌంటర్
ట్రెండింగ్
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Samsung కొత్త స్మార్ట్వాచ్లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!