శ్రావణ మాసం కావడంతో పెళ్లిళ్ల జోరు కనిపిస్తోంది. ఇప్పటికే సంబంధాలు కుదుర్చుకున్న వారు పెళ్లి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. పెళ్లికి ఎంతో కొంత బంగారం కొనడం సాధారణమే. ఈ నేపథ్యంలో బంగారం ధరలు ఊరటనిచ్చాయి. నేడు గోల్డ్ ధరలు స్వల్పంగా తగ్గాయి. తులం పసిడి ధర రూ. 110 తగ్గింది. సిల్వర్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,982, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) […]
జార్ఖండ్లోని డియోఘర్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. యాత్రికులతో వెళ్తున్న బస్సు ట్రక్రును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చాలా మంది కన్వారియాలు గాయపడ్డారు. రోడ్డు ప్రమాదంలో కనీసం 18 మంది కన్వారియాలు మరణించారు. ఇందులో 20 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. మోహన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జమునియా అడవి సమీపంలో కన్వారియాలతో వెళ్తున్న బస్సు గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న వాహనాన్ని ఢీకొట్టడంతో తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసు అధికారి […]
హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, ఇతర ముఖ్య నేతలతో కలిసి జూబ్లిహిల్స్ నియోజకవర్గంలోనీ రోడ్ నంబర్ 5 ,ఇందిరా నగర్ లోని భద్రాచలం కేఫ్ వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నగరవాసులకు శుభవార్తను అందించారు. ఆగస్టు ఒకటి నుంచి హైదరాబాద్ లో రేషన్ కార్డుల పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. 50 వేల రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నారు. 2 లక్ష 50 వేల మంది పేర్లు రేషన్ కార్డులో చేర్చాము అని తెలిపారు. […]
ఇవాళ కొన్ని గంటల క్రితం కేరళ నర్సు నిమిషా ప్రియకు యెమెన్ లో ఉరిశిక్ష రద్దు అంటూ వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. భారతీయ నర్సు నిమిషా ప్రియకు విధించిన మరణశిక్షను పూర్తిగా రద్దు చేసినట్లు గ్రాండ్ ముఫ్తీ ఆఫ్ ఇండియా కాంతపురం ఎపి అబూబకర్ ముస్లియార్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే, యెమెన్ ప్రభుత్వం నుంచి ఇంకా అధికారిక లిఖిత పూర్వక ధృవీకరణ రాలేదని కూడా ప్రకటనలో స్పష్టం చేశారు. తాజాగా ఈ […]
బంగారం అలంకరణ కోసం మాత్రమే కాదు.. పెట్టుబడిదారులకు మొదటి ప్రాధాన్యతగా మారింది. దీనికి గల కారణం గోల్డ్ ధరల పెరుగుదల. ఇదే సమయంలో సామాన్యులకు అందని ద్రాక్షలా మారింది. బంగారం కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. పసిడి ధరలు తగ్గుతే బావుండు అని ఆలోచించే వారు లేకపోలేదు. ఇలాంటి వారికి బిగ్ రిలీఫ్ ఇవ్వబోతోంది ఓ అమెరికన్ స్టార్టప్ కంపెనీ. పాదరసాన్ని బంగారంగా మార్చడానికి ఒక మార్గాన్ని కనుగొన్నట్లు ఓ అమెరికన్ స్టార్టప్ పేర్కొంది. శాన్ […]
ఇటీవలి కాలంలో పరువు హత్యలు కలకలం రేపుతున్నాయి. తమ కూతురును ప్రేమిస్తున్నాడని.. సమాజంలో తమ పరువు పోతుందని భావించి ప్రియుడిని చంపేస్తు్న్నారు. కొన్ని సందర్బాల్లో కన్న కూతురును కూడా చంపేందుకు కూడా వెనకాడడం లేదు. ఈ క్రమంలో తమిళనాడులో మరో పరువు హత్య కలకలం రేపింది. ఎస్ ఐ కూతురుని ప్రేమించినందుకు యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. తమ కుమార్తె ప్రేమిస్తున్న ప్రియుడ్ని చంపాలని కూమారుడికి చెప్పారు ఎస్ ఐ దంపతులు శవవణన్,కృష్ణా కూమారి. తల్లిదండ్రుల అదేశాలతో చెల్లి […]
అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. న్యూయార్క్ నగరంలోని మాన్హట్టన్ ప్రాంతంలో జరిగిన భీకర కాల్పుల ఘటనలో న్యూయార్క్ పోలీసు అధికారితో సహా ఐదుగురు మరణించారు. ఈ దాడిలో చాలా మంది గాయపడ్డారు. బ్లాక్స్టోన్, ఎన్ఎఫ్ఎల్ ప్రధాన కార్యాలయాలు ఉన్న 44 అంతస్తుల కార్యాలయ భవనంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో షేన్ తమురా అనే 27 ఏళ్ల వ్యక్తి భవనంలోకి ప్రవేశించి రైఫిల్తో […]
నిన్నటి వరకు దేశ వ్యాప్తంగా నరాలు తెగే ఉత్కంఠ. పరాయి దేశంలో భారతీయ నర్సు నిమిషా ప్రియకు ఉరిశిక్ష రద్దవుతుందా లేదా? అని.. రద్దు అవ్వాలని ప్రతి ఒక్కరు కోరుకున్నారు. మొత్తానికి ప్రభుత్వ కృషి, ప్రజల ప్రార్థనలతో నిమిషా ప్రియకు మరణ శిక్ష తప్పింది. యెమెన్లో భారతీయ నర్సు నిమిషా ప్రియకు విధించిన మరణశిక్షను పూర్తిగా రద్దు చేశారు. దీనికి సంబంధించి గ్రాండ్ ముఫ్తీ ఆఫ్ ఇండియా కాంతపురం ఎపి అబూబకర్ ముస్లియార్ కార్యాలయం ఒక ప్రకటన […]
శరీరంలోని కణాల అసాధారణ పెరుగుదల పలు రకాల క్యాన్సర్లకు దారితీస్తుంది. వాటిల్లో ఒకటి బ్రెయిన్ క్యాన్సర్. మెదడులోని కణాల అసాధారణ పెరుగుదల దీనికి కారణం అవుతుంది. ఇది మెదడులో కణితుల పెరుగుదలకు దారితీస్తుంది. ప్రాధమిక మెదడు కణితులు బ్రెయిన్ లోనే పుట్టుకొస్తాయి. ద్వితీయ కణితులు శరీరంలోని ఇతర భాగాల నుంచి మెదడుకు వ్యాపిస్తాయి. బ్రెయిన్ క్యాన్సర్ కు గురైన వ్యక్తుల్లో తలనొప్పి, మూర్ఛలు, దృష్టి సమస్యలు, జ్ఞాపకశక్తి కోల్పోవడం, గందరగోళం, వికారం, వాంతులు వంటివి సాధారణ లక్షణాలు […]
ట్యాలెంట్ ఒకరి సొత్తు కాదని నిరూపించాడు బీహార్ కుర్రాడు. తన ఆలోచనలతోనే అద్భుతాన్ని ఆవిష్కరించాడు. అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకుని ఏకంగా ఎగిరే విమానాన్ని తయారు చేశాడు. అతడే బీహార్ కు చెందిన అవనీష్ కుమార్. డిగ్రీలు చదవకపోయినా టెక్నికల్ స్కిల్స్ ను పెంపొందించుకుని ఎవరూ ఊహించని ఆవిష్కరణకు తెరలేపాడు. సైంటిస్టులు సైతం ఆశ్చర్యపోయేలా ఫ్లైట్ ను కళ్ల ముందు ఉంచాడు. విమానం తయారు చేయాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. Also Read:Pahalgam terrorists: పహల్గామ్ […]