Honor killing: మరో పరువు హత్య.. ఎస్ఐ కూతురుతో ప్రేమ.. చంపేయాలని కొడుకుతో చెప్పిన తల్లిదండ్రులు
- మరో పరువు హత్య
- ఎస్ఐ కూతురుతో ప్రేమ.. చంపేయాలని కొడుకుతో చెప్పిన తల్లిదండ్రులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవలి కాలంలో పరువు హత్యలు కలకలం రేపుతున్నాయి. తమ కూతురును ప్రేమిస్తున్నాడని.. సమాజంలో తమ పరువు పోతుందని భావించి ప్రియుడిని చంపేస్తు్న్నారు. కొన్ని సందర్బాల్లో కన్న కూతురును కూడా చంపేందుకు కూడా వెనకాడడం లేదు. ఈ క్రమంలో తమిళనాడులో మరో పరువు హత్య కలకలం రేపింది. ఎస్ ఐ కూతురుని ప్రేమించినందుకు యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. తమ కుమార్తె ప్రేమిస్తున్న ప్రియుడ్ని చంపాలని కూమారుడికి చెప్పారు ఎస్ ఐ దంపతులు శవవణన్,కృష్ణా కూమారి. తల్లిదండ్రుల అదేశాలతో చెల్లి ప్రేమిస్తున్న ప్రియుడు కవిన్ గణేష్ కూమార్ ను నడి రోడ్డులో నరికి చంపాడు ప్రియురాలి అన్న సుర్జిత్. తూత్తుకుడి జిల్లాలోని ఆరుముగమంగళంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
Also Read:Kalpika : వివాదాస్పద నటి కల్పిక మరోసారి వార్తల్లోకి.. ఈసారి ఎందుకంటే?
Also Read
మృతుడు కవిన్ గణేశ్ కూమార్ టిసిఎస్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు. అనారోగ్యంతో ఉన్న తన తాతను హాస్పిటల్లో పరామర్శించడానికి వచ్చిన సమయంలో కవిన్ ను హత్య చేశాడు సుర్జిత్. కవిన్ హత్యపై దళిత సంఘాలు ఆందోళన చేపట్టాయి. హత్య చేసిన సుర్జిత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్ ఐ దంపతులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
తాజావార్తలు
-
SIP: రూ.2000 SIPతో కోటీశ్వరులు కావాలంటే.. ఎన్నేళ్లు పెట్టుబడి పెట్టాలో తెలుసుకోండి!
-
RCB IPL 2026 Playoffs: ఆర్సీబీకి భారీ షాక్.. ప్లేఆఫ్స్ రేసులో కొత్త టెన్షన్!
-
DRDO TARA Test: డీఆర్డీఓ స్వదేశీ ‘తారా’ కిట్ టెస్ట్ సక్సెస్.. శత్రువులకిక దబిడి దిబిడే
-
Tragedy : హైదరాబాద్లో కలకలం.. రిటైర్డ్ IPS భార్యను చంపిన నేపాలీ గ్యాంగ్..!
-
Shakti Kapoor: తన మరణ వార్తలపై.. కౌంటర్ ఇచ్చిన శక్తి కపూర్