ప్రేమ కోసం ఎంతకైనా తెగిస్తున్నారు కొంతమంది యువతీ యువకులు. ప్రేమ మత్తులో పడి కన్నవారిని సైతం విడిచి వెళ్లేందుకు వెనకాడడం లేదు. అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ పిల్లలు ప్రేమ పేరిట దూరమవుతుండడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తాజాగా రాజస్థాన్లోని జోధ్పూర్లో ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. తన ప్రియుడితో కలిసి జీవించడానికి ఒక యువతి అన్ని హద్దులు దాటింది. ఓ తల్లి తన కూతురిని ఆపడానికి ప్రయత్నిస్తూ విలపిస్తోంది. ఆ యువతి తన కుటుంబంతో […]
టీవీఎస్ తన పాపులర్ స్కూటర్ టీవీఎస్ స్కూటీ జెస్ట్ కొత్త వేరియంట్ SXC ని విడుదల చేసింది. ఈ కొత్త వేరియంట్ రూ. 75,500 ఎక్స్-షోరూమ్ ధరతో విడుదలైంది. తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్లతో వస్తోంది. కొత్త TVS స్కూటీ జెస్ట్ SXCలో వేగం, ఇంధన స్థాయి, ఓడోమీటర్, ట్రిప్మీటర్ వంటి సమాచారాన్ని ప్రదర్శించే డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ఉంది. ఇది ఇప్పుడు బ్లూటూత్ స్మార్ట్ఫోన్ కనెక్టివిటీని కూడా కలిగి ఉంది. కాల్, SMS హెచ్చరికలను అందిస్తోంది. […]
కుటుంబ కలహాలు, ఆస్తుల పంచాయితీలతో తల్లిదండ్రులపై పిల్లలు దాడులకు పాల్పడడం చూస్తూనే ఉన్నాం. కొన్ని సందర్భాల్లో పిల్లల వేధింపులు భరించలేక తల్లిదండ్రులు అంతమొందిస్తున్నారు. తాజాగా ఉమానగర్, పంజాగుట్టలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నిద్రలో ఉన్న యువకుడిని స్వంత తల్లి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులతో కలిసి గొంతు నులిమి హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. మృతుడు హర్ష వర్ధన్ (27) గా పోలీసులు గుర్తించారు. ఆయన తల్లి గంగులమ్మ (50) ఇళ్లలో పనులు చేస్తూ […]
ఆదిలాబాద్ జిల్లాలో వింత దొంగతనం చోటుచేసుకుంది. గుట్టు చప్పుడు కాకుండా దొంగతనాలకు పాల్పడుతుంటారు దుండగులు. కానీ ఓ యువ దొంగ మాత్రం యజమాని కళ్ల ముందే చోరీకి పాల్పడ్డాడు. ఇంటి ముందు ఉన్న వ్యక్తిని, బైక్ ను తీసుకెళ్లాడు ఓ యువకుడు. తర్వాత మద్యం తాగాక పట్టణంలోని పలు కాలనీలు అదే బైక్ పై తిప్పాడు. ఆ తర్వాత ఓ చోట బాధితుడిని దింపేసి బైక్ తో పరార్ అయ్యాడు యువదొంగ. మద్యం మత్తులోంచి తేరుకున్న బాధితుడు […]
ములుగు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తాడ్వాయి మండలం బిరెల్లిలో దహన సంస్కారానికి వెళ్లి చెరువులో దిగి మంకిడి పవన్ అనే యువకుడు గల్లంతయ్యాడు. గ్రామంలో రామకృష్ణ అనే వ్యక్తి చనిపోగా అతని అంతిమయాత్రలో పాల్గొని దహన సంస్కారం అనంతరం స్నేహితులతో కలిసి పవన్ అనే యువకుడు చెరువులోకి దిగాడు. అయితే నవీన్, వినయ్, రణధీర్, అనే నలుగురు స్నేహితులు అవతల ఒడ్డుకు చేరుకున్నరు. కానీ, పవన్ మాత్రం నీటిలో మునిగి గల్లంతయ్యాడు. వెంటనే వారు పోలీసులకు సమాచారం […]
మాగంటి గోపీనాథ్ మృతితో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బై ఎలక్షన్ లో పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ కూడా తమ అభ్యర్థిని ప్రకటించేందుకు రెడీ అవుతోంది. ఈ క్రమంలో ఎల్లుండి సాయంత్రం బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ మీటింగ్(డిల్లి లో) జరుగనుంది. తెలంగాణ జూబ్లీహిల్స్ అభ్యర్థి నీకేంద్ర ఎన్నికల కమిటీ ఖరారు చేయనున్నట్లు సమాచారం. ఈ రోజు సమావేశం అయిన బీజేపీ ముఖ్య […]
శంషాబాద్ విమానాశ్రయంలో మరో మారు ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానం ల్యాండింగ్ అయ్యింది. అంటోనోవ్ ఎన్ 124 సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అంటోనోవ్ ఎన్ 124 ప్రపంచంలోనే అతిపెద్ద విమానాలలో ఒకటి. క్వాడ్ ఇంజిన్ అంటే 4 ఇంజన్లు ఉన్నాయి. 24 చక్రాలు ఉన్నాయి. ప్రపంచంలోని అతిపెద్ద కార్గో విమానాలలో ఒకటి, దీనిలో లాంగ్ ట్రక్కులు నేరుగా లోడింగ్, అన్లోడ్ కోసం రాంప్లను ఉపయోగించి […]
ఇటీవలి కాలంలో తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్న ఆరోగ్య సమస్యల్లో గుండెపోటు ఒకటి. ఏజ్ తో సంబంధం లేకుండా హార్ట్ ఎటాక్ కు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. నిత్యం పోషకాహారం, ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటూ, వ్యాయామం చేసేటువంటి సెలబ్రిటీలు సైతం గుండెపోటుకు గురవుతున్నారు. తాజాగా సల్మాన్ ఖాన్ చిత్రం “టైగర్ 3″లో నటించిన ప్రముఖ పంజాబీ నటుడు, ప్రొఫెషనల్ వెజిటేరియన్ బాడీబిల్డర్ వరీందర్ సింగ్ ఘుమాన్ అమృత్సర్లో గుండెపోటుతో మరణించారు. ఆయనకు 41 సంవత్సరాలు. […]
కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన కగార్ ఆపరేషన్ తో మావోలు అడవిని వీడి జనంబాట పడుతున్నారు. ఇప్పటికే పలువురు మావోలు పోలీసుల ఎదుట లొంగిపోయారు. తాజాగా మరో ముగ్గురు సీనియర్ మావోయిస్టులు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ.. ముగ్గురు స్టేట్ కమిటీ సభ్యులు జన జీవన స్రవంతి లో కలిశారని తెలిపారు. కుంకటి వెంకటయ్య అలియాస్ వికాస్, మొగిలిచర్ల వెంకట్రాజు అలియాస్ చందు, తోడెం గంగ అలియాస్ […]
ప్రభుత్వాఫీసుల్లో లంచగొండి అధికారులను ఏసీబీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ కొందరిలో మాత్రం మార్పు రావడం లేదు. వేలు, లక్షల్లో లంచాలు పుచ్చుకుంటూ ఏసీబీకి పట్టుబడుతున్నారు. లంచం ఇవ్వడం, తీసుకోవడం నేరమని అవగాహన కల్పించాల్సిందిపోయి కంచె చేను మేసినట్లుగా లంచాలకు తెగబడుతున్నారు కొందరు అధికారులు. తాజాగా తార్నాకలోని టీఎస్పీడీసీఎల్ కార్యాలయంలో లంచం తీసుకుంటూ ఏసిబికి రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు సుధాకర్ రెడ్డి. కొత్త ట్రాన్స్ఫర్మర్ కోసం కాంట్రాక్టర్ వద్ద రూ. 15000 […]